WestGodavari

News June 9, 2024

టి.నరసాపురంలో యువకుడి అదృశ్యం.. కేసు నమోదు

image

యువకుడు అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు టి.నరసాపురం ఎఎస్సై జయకుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గౌరి శంకరపురానికి చెందిన హరీశ్(27) ఈనెల 7న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిపోయాడు. ఆతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్లలో వెతికినా.. ఫలితం లేకపోయింది. అతని తండ్రి వెంకట రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

News June 9, 2024

ప.గో: ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

News June 8, 2024

ప.గో: ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

News June 8, 2024

ఏలూరు: ‘కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకం’

image

జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకం, అభినందనీయమని జేసి లావణ్య వేణితో పాటు పలువురు రిటర్నింగ్ అధికారులు అన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏలూరులో కలెక్టర్‌కి అభినందనలు తెలిపారు. 

News June 8, 2024

ప.గో: హత్య కేసులో కొవ్వూరు వాసికి 10ఏళ్లు జైలు శిక్ష

image

కొవ్వూరుకు చెందిన చిట్టిబాబు, మహేశ్వరరావు కొండాపూర్‌కు పనికి వెళ్లారు. 2022 ఏప్రిల్ 16న చిట్టిబాబు కుమారుడు దుర్గాప్రసాద్ కొండాపూర్ రాగా మహేశ్వరరావు అతనిని తిట్టాడు. దీంతో మాటామాటా పెరిగి చిట్టిబాబు కత్తితో మహేశ్వరరావుపై దాడి చేయడంతో మహేశ్వరరావు మృతిచెందాడు. దీంతో రెండేళ్ల విచారణ అనంతరం చిట్టిబాబుకు 10ఏళ్ల జైలు, రూ.25 వేలు జరిమానా విధించినట్లు గచ్చిబౌలి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 

News June 8, 2024

ప.గో.: RRRపై ఏకైక మహిళ పోటీ.. ఓట్లు ఎన్నంటే

image

ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ MLAగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది పోటీచేయగా.. అందులో మల్లిపూడి షర్మిల ఒక్కరే మహిళ. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆమెకు 1140 ఓట్లు వచ్చాయి. అయితే RRRకు 1,16,902 ఓట్లు రాగా.. 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News June 8, 2024

రామోజీరావుతో మాటలు గుర్తొస్తున్నాయ్: RRR

image

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణరాజు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 నెలల క్రితం ఆయనతో కలిసి 2 గంటల పాటు మాట్లాడిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తొస్తున్నాయని అన్నారు. గొప్ప పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కోటికి ఒక్కరిలోనే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

News June 8, 2024

ప.గో.: గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 2024- 25 విద్యాసంవత్సరానికి గాను 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 20న నరసాపురం గురుకులంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. రిజర్వేషన్ కేటగిరీ, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 8, 2024

భావనగర్- కాకినాడ పోర్ట్ రైలు దారి మళ్లింపు

image

భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

News June 8, 2024

ఏలూరు: చిరుతపులి దాడి.. 5 మేకలు మృతి 

image

ఏలూరు జిల్లా పోలవరం మండలం ఉడతపల్లి అటవీప్రాంతంలో చిరుతపులి దాడి చేయడంతో ఐదు మేకలు చనిపోయాయి. ఈ ఘటనపై పోలవరం ఇన్‌ఛార్జి రేంజర్ దావీదు రాజు మాట్లాడుతూ.. గ్రామానికి దూరంగా పొలాల్లో చుండ్రు బుల్లెబ్బాయి మేకల మందను కట్టినట్లు తెలిపారు. నిత్యం అక్కడే మకాం ఉండే అతడు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఘటన జరిగిందన్నారు. చిరుత కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.