India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆన్లైన్లో మోసపోయిన పలువురు కోనసీమ జిల్లా ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాలు.. రామచంద్రపురం, అంబాజీపేట తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్, మోటుపల్లి కిరణ్ GMR యాప్ పరిచయం చేశారు. యాప్లో డబ్బులు పెడితే రెట్టింపు వస్తాయని నమ్మించారు. చాలామందికి నగదు వచ్చాయి. కొద్దిరోజులుగా నగదు రాకపోగా మోసపోయినట్లు గుర్తించారు. బాధితుల్లో తణుకుకు చెందిన వారు సైతం ఉన్నారు.
ప.గో జిల్లా వ్యాప్తంగా కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గి.. సిజేరియన్లు 80శాతం పైనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2023-24లో ప్రవేట్లో మొత్తం 11,674 కాన్పులు కాగా.. 1,751 మాత్రమే సాధరణ కాన్పులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో 7,912 కాన్పులు కాగా, వాటిలో సాధారణ-3,568, సిజేరియన్లు-4,344 జరిగినట్లు గుణంకాలు చెబుతున్నాయి. ఆపరేషన్కు రూ.80వేలు- రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
ప.గో జిల్లాలోనే ముఖ్య పట్టణం భీమవరం. 1948లో 3వశ్రేణిగా, 1963లో 2వశ్రేణి, 1967లో ప్రథమ శ్రేణి, 1980లో ప్రత్యేక, 2011లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందింది. 39 వార్డులతో ఉన్న ఈ పట్టణం విలీన గ్రామాలతో కలిపి దాదాపు 2 లక్షల మంది జనాభాతో నగరపాలక సంస్థ హోదా దిశగా అడగులేస్తోంది. దీనికి సంబంధించి పురపాలిక కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు శుక్రవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎగువన సీలేరు జలాశయం నుంచి 2000 క్యూసెక్కుల గోదావరి జలాల విడుదలతో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నాటికి గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 22.950 మీటర్లు, స్పిల్వే దిగువన 15.300 మీటర్లు, ఎగువ కాపర్ డ్యాంకు 23.000 మీటర్ల నీటిమట్టం, దిగువ కాపర్ డ్యామ్లో13.920 మీటర్ల నీటిమట్టం నమోదయింది.
బి.సి, ఎస్.సి, ఎస్.టికి సంబంధించి ఉమ్మడి ప.గో జిల్లాలోని డి.ఎస్.సి.అభ్యర్థులకు వచ్చే నెల 11వ తేదీ నుంచి డి.ఎస్.సి. ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా బి.సి సంక్షేమ అధికారిణి నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బి.సి స్టడీ సర్కిల్ కార్యాలయంలో జులై 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
➠ SHARE IT..
కైకలూరు మండలం ఉప్పుటేరు చెక్ పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు(45) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ జులై 1న తొలిసారి పిఠాపురం రానున్నారు. తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలపనున్నారు. ఉప్పాడ సెంటర్లో జరిగే వారాహి సభలో పవన్ ప్రసంగిస్తారు. 3రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు వారాహి సభకు ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల నుంచి జనసేన నేతలు, అభిమానులు భారీగా తరలి రానున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కాకినాడ కలెక్టర్ షన్మోహన్ శుక్రవారం సమీక్షించారు.
దారికాసి మరీ యువకుడిపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ప.గో జిల్లా తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.రామ్మూర్తి శుక్రవారం బైక్పై వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, ముత్యాల సాయి మరికొందరితో కలిసి అడ్డగించారు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లుతో వెంటపడి మరీ కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
రెబల్స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్
ప.గో జిల్లా పెనుగొండ మండలం వదలిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. టి.గంగయ్య(50) అనే రైతు ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంట్ స్తంభం నుంచి తెగిపోయి నీటిలో పడి ఉన్న తీగను గమనించకుండా పొలంలో దిగాడు. షాక్ కొట్టడంతో పొలంలోనే గంగయ్య ప్రాణాలు వదిలాడు. గంగయ్య భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.