India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో గ్రీన్ అంబాసిడర్గా పనిచేస్తున్న చంద్రపాల్(55) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. తాగునీటి సరఫరా సమయంలో రేకుల షెడ్డులో ఉన్న మోటారు వేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ సెంటర్’లో మెరుగైన సహాయం అందించాలని ఏలూరు నూతన కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ‘దిశ వన్ స్టాప్ సెంటర్’ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సెంటర్కు వచ్చిన మహిళలు, పిల్లలకు సిబ్బంది సరైన మార్గదర్శకం చేయాలన్నారు.
కమ్యూనికేషన్, టీం వర్క్, క్రిటికల్ థింకింగ్, భావోద్వేగ మేధస్సు వంటి నైపుణ్యాలను అలవర్చుకొని ఔత్సాహిక రంగాల్లో యువత అభివృద్ధి చెందాలని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ సలోమి సునీత, అధ్యాపకులు పాల్గొన్నారు.
చిరుత దాడిలో మేక హతమైన సంఘటన పోలవరం మండలంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ క్షేత్ర అధికారి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలగండి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికాడు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి జరిగినట్లుగా అధికారుల తేల్చారు.
ప.గో జిల్లా పాలకొల్లులోని 18వ వార్డుకు చెందిన 13నెలల పాప వైద్యానికి ఇచ్చిన మాటను మంత్రి నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి చిన్నారి అక్షరను చూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారి తల్లిదండ్రులను పలకరించారు. సీఎం సహాయ నిధి మంజూరు కోసం నిమ్మల గతంలోనే ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.
టమాట సీజన్ ముగియడంతో ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది. మంగళవారం తాడేపల్లిగూడెం బహిరంగ మార్కెట్లో కిలో టమాట రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయించారు. జిల్లాలోని పలు ప్రాంతాల రైతు బజార్లలో రూ.68 వరకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు టమాట అందని పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో సుబ్బారాబు ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్లోని ఛైర్పర్సన్ ఛాంబర్లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. HYDలో ముద్దాయిని పట్టుకొని కైకలూరు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపర్చినట్లు తెలిపారు.
ప.గో జిల్లాలో వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామానికి చెందిన జ్యోతి(38) ఈనెల 24వ తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొల్లు ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు భర్త పోతరాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వీరవాసనం ఎస్సై రమేష్ తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మంత్రి దుర్గేష్, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.