India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు కూడా వేలల్లో ఓట్లు వచ్చాయి. పాలకొల్లులో నోటాకు 900 ఓట్లు, నరసాపురం నియోజకవర్గంలో 1,216, పోలవరంలో 5,172, చింతలపూడిలో 4,121, ఉంగుటూరులో 2,088, దెందులూరులో 1,713, ఆచంటలో 1,673, ఉండిలో 1,670, భీమవరంలో 1,210, ఏలూరులో 1,212, తణుకులో 1,722, తాడేపల్లిగూడెం 1,522 ఓట్లు నోటాకు దక్కాయి.
ప.గో. జిల్లా ఏలూరు MPగా పుట్టా మహేశ్ యాదవ్ తొలిసారి పోటీచేసినప్పటికీ 1,78,326 భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. కాగా ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి MLAగా గెలుపొందారు. ఈయన 20.14, 2019లో పోటీచేసినప్పటికీ ఓటమి చవిచూశారు. తాజా గెలుపుతో తండ్రి MLAగా, కొడుకు MPగా సేవలందించనున్నారు.
ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అరుదైన రికార్డ్ సాధించింది. 1999 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గానికి ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999- టీడీపీ, 2004- కాంగ్రెస్, 2009- ప్రజారాజ్యం, 2014- బీజేపీ, 2019- వైసీపీ, 2024- జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.
ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గత 2019 ఎన్నికల్లో 13 చోట్ల వైసీపీ గెలుపొందగా.. 2 చోట్ల టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో చింతలపూడిలో సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కంభం విజయరాజుకు టికెట్ ఇచ్చింది. ఇక పోలవరంలోనూ తెల్లం బాలరాజుకు బదులు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి పోటీలో నిలిచారు. గెలుపే లక్ష్యంగా ఆయా చోట్ల టికెట్లు మార్చినప్పటికీ ప్లాన్ ఫెయిల్ అయిందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రులుగా సేవలందించారు. కాగా తాజాగా ముగ్గురూ ఓటమి పాలయ్యారు. కాగా మూడు చోట్ల గెలిచిన కూటమి అభ్యర్థులు 30 వేల పై చిలుకు మెజారిటీ సాధించడం మరో విశేషం.
ప.గో. జిల్లాలోని మొత్తం 15 స్థానాల్లో గెలిచిన MLAలలో 9మంది తొలిసారే కావడం విశేషం. అందులో ఐదుగురు జనసేన కాగా.. నలుగురు టీడీపీ.
☛ నిడదవోలు- కందుల దుర్గేశ్
☛ నరసాపురం- బొమ్మిడి నాయకర్
☛ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
☛ ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
☛ పోలవరం – చిర్రి బాలరాజు
☛ గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
☛ ఉండి – RRR
☛ ఏలూరు – బడేటి రాధాకృష్ణ
☛ చింతలపూడి – సొంగా రోషన్
➤ SHARE IT
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనిత మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరున కృతజ్ణతలు అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని అన్నారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి నుంచి బరిలో నిలిచిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారీ విజయం సాధించారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఆయన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు డా.కృష్ణ కాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ పాల్గొన్నారు.
నరసాపురం పార్లమెంట్ ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ MPగా ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. కాగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నరసాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ విజయం సాధించారు. మొత్తం ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక వైసీపీ నుంచి బరిలో నిలిచిన గూడూరి ఉమాబాలకు 4,30,541 ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.