India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంధంచర్ల – చింతలపూడి సరిహద్దు అడవిలో పులి అడుగు జాడలను శనివారం బీట్ అధికారిణి భవానీ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఆయా ప్రాంతాల్లో కనిపించిన కాలి ముద్రలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల టీడీపీ, 3 చోట్ల జనసేన, వైసీపీ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. కొవ్వూరు, ఆచంటలో టీడీపీకి, భీమవరంలో జనసేనకు, ఉంగుటూరులో వైసీపీకి ఎడ్జ్లో ఉన్నట్లు పేర్కొంది. ఇక దెందులూరు, గోపాలపురం స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.
రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు శనివారం వెల్లడించడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలో గెలుపు అవకాశాలపై ఓ అంచనా ఏర్పడిందని చర్చ సాగుతోంది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను చాణక్య స్ట్రాటజీస్, పోస్ట్ పోల్, కేకే తదితర సంస్థలు కూటమే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. తుది ఫలితాలకు నేడు, రేపు మాత్రమే మిగిలిఉండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
– సర్వే ఫలితాలపై మీ కామెంట్..?
ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 సీట్లలో NDA కూటమి 10- 11 గెలుస్తుందని బిగ్టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లలో 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 11 నుంచి 12 స్థానాల్లో, వైసీపీ 3- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీ, నరసాపురం నుంచి బీజేపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.
ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఉమ్మడి జిల్లాలో కూటమికి 12 వస్తాయని, కేకే సంస్థ టీడీపీ-9, జనసేన-6 గెలుస్తాయని ఫలితాలు విడుదల చేశాయి. కాగా తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరికి సంబంధించి KK సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు గానూ టీడీపీ- 09, జనసేన- 6 గెలుస్తాయని తెలిపింది. వైసీపీ ఏ ఒక్కచోటా గెలవదని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి
– మీ కామెంట్..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. మొత్తం 15 స్థానాలకు గాను కూటమికి 12, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుండగా..ఒకచోట టఫ్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
– మీ కామెంట్ ఏంటి..?
కూటమి పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలిచిన భూపతిరాజు శ్రీనివాస శర్మ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన రఘురామకృష్ణరాజు సునాయాసంగా విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. 4వ తేదీన సాయంత్రం 5గంటల లోపు పూర్తి ఫలితాలు వెల్లడించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొత్తం 16 నుంచి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున, అసెంబ్లీ, ఎంపీకి కలిపి 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.