India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో TDP 2స్థానాల్లో గెలుపొందగా అందులో పాలకొల్లు ఒకటి. 2019లో YCPప్రభంజనంలోనూ నిమ్మల రామానాయుడు 17809 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాజాగా మళ్లీ గెలిచి హ్యాట్రిక్ రికార్డ్ నమోదుచేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే పాలకొల్లు నుంచి 1989లో MLAగా గెలుపొందిన చేగొండి హరిరామ జోగయ్య మంత్రిగా సేవలందించగా.. దాదాపు 35ఏళ్ల తర్వాత ఇక్కడి నుంచి మంత్రి పదవి దక్కినట్లయింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఓ టీ దుకాణ యజమాని తన అభిమానం చాటుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బుధవారం తన షాపులో ఉదయం 10 గంటల వరకు కాఫీ, టీ ఉచితంగా ఇస్తున్నట్లు జంగారెడ్డిగూడేనికి చెందిన ఎం.రాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దుకాణం (కనక నాగ శివాని టీ స్టాల్) వద్ద బ్యానర్ ఏర్పాటుచేశారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందిన నిమ్మల రామానాయుడు మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ MLAగా రికార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో నియోజకవర్గంలో 70 శాతం ఓటింగ్ పొంది.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగానూ గుర్తింపు పొందారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గం సైతం ఏర్పాటుకానుంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని వీక్షించేలా.. ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు LED స్క్రీన్లు, టీవీలను ఏర్పాటుచేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే విద్యుత్ కాంతులతో సిద్ధం చేశారు.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?
ఏలూరు జిల్లా వైసీపీ కార్యదర్శి చాటపర్తి పోసిబాబు తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు పంపించానన్నారు. భవిష్యత్ కార్యాచరణను కార్యకర్తలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ ఇంట్లో రెండు భారీ కోడె నాగులు హల్ చల్ చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై సమాచారాన్ని స్నేక్స్ సేవియర్ సొసైటీ చదలవాడ క్రాంతికి తెలియజేశారు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పాములను పట్టుకున్నారు. అనంతరం వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాగా పవన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు చెందిన MLAలు బొమ్మిడి నాయకర్, పులపర్తి అంజిబాబు, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు ఉన్నారు
కార్యకర్తకు తగిన గుర్తింపునిచ్చిన పార్టీ BJP అని, అదే గుర్తింపు TDP, జనసేనలోనూ కొనసాగుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. నరసాపురం MPగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ ఓ కార్యకర్త స్థాయి నుంచి వచ్చారని గుర్తుచేశారు. శ్రీనివాస వర్మకు BJP ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఆశ్చర్యమేసిందని, అయితే.. పార్టీ కోసం ఆయన పడిన కష్టం తర్వాత తెలిసిందన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ, హ్యాట్రిక్ MLA నిమ్మల రామానాయుడు, ఉండి MLA రఘురామకు అమాత్యయోగం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన ఫైర్ బ్రాండ్ MLA చింతమనేని పేరు, BJP కోటాలో కైకలూరు MLA కామినేని శ్రీనివాస్, జనసేన నుంచి బొలిశెట్టి, పులపర్తి రామాంజనేయులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.