WestGodavari

News May 13, 2024

GET READY ప.గో. జిల్లా

image

సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.

News May 12, 2024

ప.గో.: అభిమాన నేత కోసం నాలుక కోసుకున్నాడు..!

image

ప.గో. జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన చెవల మహేశ్ HYD బంజారాహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత CM కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ 2 సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

News May 12, 2024

ప.గో.: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

image

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన ప.గో. జిల్లాలో 33,06,063 మంది ఓటర్లున్నారు.
– నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.

News May 12, 2024

ప.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.

News May 12, 2024

ప.గో: ఓట్ల పండగ.. RTC ప్రత్యేక బస్సు సర్వీసులు

image

రేపే పోలింగ్.. ఏదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండగలో భాగమయ్యేందుకు ప.గో జిల్లాకు HYD, ఇతర నగరాల నుంచి దాదాపు 60వేల మంది వస్తున్నట్లు అంచనా. దీంతో RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. HYD నుంచి సాధారణ రోజుల్లో 14 బస్సులు నడవగా.. ఈనెల 9 నుంచి 12 వరకు మరో 13 సర్వీసులు (భీమవరం-4, నరసాపురం-3, తణుకు-3, తాడేపల్లిగూడెం-3) ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేందుకు 13, 14 తేదీల్లో 11 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

News May 12, 2024

ALERT: ఉమ్మడి ప.గో.లో పిడుగులకు ఛాన్స్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఆదివారం అక్కడ పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News May 12, 2024

ప.గో: ఓట్ల పండగ.. RTC ప్రత్యేక బస్సు సర్వీసులు

image

రేపే పోలింగ్.. ఏదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండగలో భాగమయ్యేందుకు ప.గో జిల్లాకు HYD, ఇతర నగరాల నుంచి దాదాపు 60వేల మంది వస్తున్నట్లు అంచనా. దీంతో RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. HYD నుంచి సాధారణ రోజుల్లో 14 బస్సులు నడవగా.. ఈనెల 9 నుంచి 12 వరకు మరో 13 సర్వీసులు (భీమవరం-4, నరసాపురం-3, తణుకు-3, తాడేపల్లిగూడెం-3) ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేందుకు 13, 14 తేదీల్లో 11 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

News May 12, 2024

భీమవరంలో విషాదం.. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి

image

ప.గో జిల్లా భీమవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని నాచువారి సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుండి జ్యోతిప్రియ మృతి చెందింది. కరాటే నేర్చుకునేందుకు బాలిక సైకిల్‌పై వెళ్తుండగా.. ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. జ్యోతిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తండ్రి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నారు.

News May 12, 2024

ప.గో.: ఓటింగ్ శాతం పెంచుదాం

image

ప.గో. జిల్లాలో గత 2 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. పోలింగ్ శాతం కొంతమేర తగ్గింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 82.25 శాతం పోలింగ్ జరగగా.. 2019 ఎన్నికల్లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో మరింత పెంచేలా ఓటర్లుగా మనం ముందుకెళ్దాం.
– ఇంతకీ గత 2 ఎన్నికల్లో మీరు ఓటు వేశారా..?

News May 11, 2024

ఏలూరు: అఖండ జ్యోతి వెలిగించి.. ఓటర్లకు విజ్ఞప్తి 

image

ఏలూరు జిల్లాలో ఉన్న 16.37 లక్షల ఓటర్లను మే 13వ తేదీన ఓటు వేయమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని సెయింట్ థెరీసా మహిళా డిగ్రీ కళాశాలలో దీపాలు వెలిగించి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పారు.