India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో ఈ పరీక్షలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంటర్-8,664 మందికి ఉ.9గంటల నుంచి మ.12 వరకు, సెకండ్ ఇంటర్-4,133 మందికి మ.2:30 నుంచి సా.5: 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఫిర్యాదులుంటే 08812 230197కు ఫోన్ చేయాలన్నారు.
ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్రూమ్ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
నిడదవోలు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య నిన్న రాత్రి గుర్తు తెలియని మహిళ మృతి చెంది పడి ఉన్నట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. దారవరం రైల్వే గేటు సమీపంలో డౌన్ లైన్ పక్కన మహిళ మృతదేహం లభ్యమైందని, సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. వివరాలేమీ లభ్యం కాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 40 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI కుటుంబరావు తెలిపారు. చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లగా.. దుకాణదారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటికి వచ్చి కుటుంబీకులకు చెప్పగా.. వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి తొలి ఫలితం నరసాపురం అసెంబ్లీ నుంచి వెలువడనున్నది . నరసాపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్పై కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రౌండ్లలో నరసాపురం, 13 రౌండ్లలో ఆచంట, 14 రౌండ్లలో పాలకొల్లు, 15 రౌండ్లలో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి ఫలితాలు వెల్లడికానున్నాయి. 17వ రౌండ్లో భీమవరం ఫలితం వెలువడనుంది.
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు SI రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.
జగన్ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.
ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను డీఐజీ అశోక్ కుమార్ బుధవారం పరిశీలించారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఏపీ దూరవిద్య ద్వారా జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను ఆన్లైన్లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. www.apopenschool.ap.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు ఉన్నాయని చెప్పారు. లేదా ఓపెన్ స్కూల్స్ సెంటర్ల కో-ఆర్డినేటర్ల నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చు అని స్పష్టం చేశారు.
ముత్యాపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన ఇంటిలో ఉండగా ఉదయం 6గంటల సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అదే నిమిషంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.