WestGodavari

News August 24, 2024

నరసాపురం – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

image

నరసాపురం నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 28న ప్రత్యేక రైలు నడపనున్నామని స్టేషన్ మేనేజరు గణపతి మధుబాబు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని మధుబాబు చెప్పారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.

News August 24, 2024

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో వైసీపీ నేతలు భేటీ

image

ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను శుక్రవారం తణుకు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. పాలకొల్లు వివాహ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యంలో ఆగిన బొత్స సత్యనారాయణను కలిసిన నాయకులు అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

News August 23, 2024

డయాఫ్రం వాల్ కట్టకుంటే గోదావరి జిల్లాలకు ముప్పు: CM

image

పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక వరమని వానపల్లి సభా వేదికగా సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పోలవరంను దుర్మార్గుడైన జగన్ గోదావరిలో కలిపేశారని, డయాఫ్రం వాల్ నాశనమైందని, కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. తొందర్లోనే పోలవరంను పూర్తి చేస్తామన్నారు.

News August 23, 2024

బుట్టాయిగూడెంలో BSNL 4G టవర్ ప్రారంభం

image

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో BSNL 4G టవర్‌ను ఏలూరు MP మహేష్, పోలవరం MLA చిర్రి బాలరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏజెన్సీలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఇంటర్ నెట్, సెల్‌ఫోన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. అందరూ బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు.

News August 23, 2024

జంగారెడ్డిగూడెం: మెసేజ్ పంపి రూ. లక్షలలో కాజేశారు

image

ఫోనుకు వచ్చిన లింకు తెరవగా ఖాతాలో నగదు మాయమైన ఘటనపై జంగారెడ్డిగూడెం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్టేషన్ రైటర్ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. పట్టణానికి చెందిన మోటేపల్లి రాజేంద్రప్రసాద్ ఫోనుకు ఈ నెల 7న ఓ లింకుతో కూడిన మెసేజ్ వచ్చింది. దానిపై క్లిక్ చేసిన కాసేపటి తరువాత అతని ఖాతాలో ఉన్న రూ.2 లక్షలు దఫదఫాలుగా మాయమైంది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

News August 23, 2024

ప.గో జిల్లా: సెప్టెంబర్ 29 వరకూ పలు రైళ్లు రద్దు

image

సాంకేతిక పనుల దృష్ట్యా సెప్టెంబరు 2వ తేదీ నుంచి 29వరకు విజయవాడ డివిజన్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్- విజయవాడ (07863),(07283) విజయవాడ-భీమవరం జంక్షన్,(07861) విజయవాడ- నర్సాపూర్ తదితరులు రైళ్లు రద్దు చేశారు.

News August 22, 2024

ఏలూరు కలెక్టర్‌ను కలిసిన సంకురమ్మ

image

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని మర్లగూడెం గ్రామానికి చెందిన సంకురమ్మ ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి అక్కడ ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకొని బుధవారం ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. కువైట్ నుంచి వచ్చిన సంకురమ్మ గురువారం ఏలూరు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసింది.

News August 22, 2024

ప.గో: బదిలీలకు ప్రణాళికలు.. ఉద్యోగుల్లో గుబులు

image

ఈనెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది. విద్య, వైద్య శాఖలు మినహా మొత్తం 15 శాఖల్లో బదిలీలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న వారిలో కొందరు ఇప్పటికే పైరవీల కోసం యత్నిస్తున్నారట. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఎక్కువ బదిలీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

News August 22, 2024

ప.గో.: కానిస్టేబుల్‌ మృతి.. అధికారిక లాంఛనాలతో వీడ్కోలు

image

విజయవాడలో జరిగిన రోడ్డుప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలోని సమతానగర్‌కు చెందిన కానిస్టేబుల్ తారక రామారావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహానికి గురువారం అధికారిక లాంఛనాలతో గ్రేహౌండ్స్ పోలీసులు అంతిమ వీడ్కోలు పలికారు. తారక రామారావు మృతి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

News August 22, 2024

ప.గో.: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ప.గో. జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. ఆకివీడు మండలం సమతానగర్‌కు చెందిన కొట్నాని తారకరామారావు (37) విజయవాడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు స్టేషన్ నుంచి బైక్‌పై ఇంటికి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ లారీ అతణ్ని వెనక నుంచి ఢీ కొట్టగా మృతిచెందాడు. ఎనిమిదేళ్ల క్రితం అతని సోదరుడు సైతం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.