India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం జరిగిన <<13151338>>రోడ్డుప్రమాదం<<>>లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్యాపిల్లలతో బైక్పై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు. రుద్రరాము(33), కుమార్తె రక్షశ్రీ(9) అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదైంది.
ఏలూరు జిల్లాలో ఇంటర్ పాసైన విద్యార్థులకు డీఈవో అబ్రహం మంగళవారం శుభవార్త తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. DEECET-2024 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మే 9 వరకు ఈ పరీక్షకై ఆన్లైన్ ద్వారా https://cse.ap. gov.in & https://cse.apdeecet.apcfss.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఇవే వెబ్సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఎస్పీ మేరీ ప్రశాంతి హెలికాప్టర్ దిగడానికి CRR రెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను పరిశీలించారు. భద్రతా పరమైనటువంటి అంశాలతో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట జిల్లా అదనపు ఎస్పీ స్వరూప రాణి, తదితరులు ఉన్నారు
టీడీపీ- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులని ఎంపీ, కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. జగన్ ఒక దుష్టుడు అని విమర్శించారు. ఏపీలోని రైల్వే స్టేషన్కు జగన్ పేరు, ఫొటో వేసుకోవడం కుదరదు కనుకే ఆయా స్టేషన్ల పేర్లు మారలేదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీలో ఉంటారన్నది లెక్క తేలింది. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 183 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యల్పంగా చింతలపూడి నియోజకవర్గంలో 8 మంది పోటీచేస్తుండగా.. అత్యధికంగా దెందులూరు, పాలకొల్లు, భీమవరం నుంచి 15 మంది చొప్పున బరిలో ఉన్నారు.
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొనగా ఘటన స్థలంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. కొడుకు, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ దుర్గ గుడిని దర్శించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు, ముడియం సూర్యచంద్రరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ముడియం సూర్యచంద్రరావు టీడీపీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.
నల్లజర్ల మండలం నభీపేటకు చెందిన ప్రవీణ్ కుమార్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. వరికోత మిషన్ డ్రైవర్గా పనిచేస్తున్న అతనికి రెండేళ్ల క్రితం పెళ్లైంది. కాగా సోమవారం అన్న రవితేజకు ఫోన్ చేశాడు. పనికి వస్తానని కొందరి వద్ద డబ్బులు తీసుకున్నా.. వాటిని బైక్ అమ్మి కట్టేయండి.. అనంతపల్లి కాలువలోకి దూకేస్తున్నానని చెప్పాడు. రవితేజ పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహం బయటకు తీయించారు. కేసు నమోదైంది.
తాడేపల్లిగూడెం మండలంలో మామ కోడలిని <<13143207>>చంపిన<<>> విషయం తెలిసిందే. SI సురేశ్ తెలిపిన వివరాలు.. విశాఖకు చెందిన నాగశ్రావణికి జగన్నాథపురానికి చెందిన శ్రీనివాసరావుకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు. ఉపాధినిమిత్తం శ్రీనివాసరావు దుబాయ్ వెళ్లాడు. కాగా వెండి మొలతాడు పోగొట్టుకున్నాడని తన కుమారుడిని ఆదివారం కొట్టింది. దీంతో మామ కేశవరావు గొడవకు దిగాడు. రాత్రి నిద్రిస్తుండగా తలపై బండతో మోది చంపేశాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.