India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత ఏలూరు జిల్లాకు చెందిన దెందులూరు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ నుంచి MLAగా గెలుపొందారు. రెండేళ్లకే మంత్రి (నీటిపారుదల శాఖ) పదవి సైతం వరించింది. ఆ తర్వాత దెందులూరు మండల జడ్పీటీసీ పదవికి ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిచెందాడు. దీంతో మాగంటి మంత్రి పదవికి రాజీనామా చేశారు. జడ్పీటీసీ ఓటమి మంత్రి పదవికే ఎసరుపెట్టినట్లయింది.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా 6 చోట్ల జనసేన పోటీచేస్తుండగా.. 9 చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లెక్కన జనసేన అభ్యర్థులు పోటీచేసే చోట ఎన్నికల్లో టీడీపీ గుర్తు కనిపించదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీచేసిన టీడీపీ పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో కొన్నిస్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరో రోజు 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. 18 తేదిన మొదలైన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ఏలురు పార్లమెంటు స్థానానికి 5 నామినేషన్లు దాఖలుకాగా.. మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 35 నామినేషన్లు దాఖలయ్యాయిని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చివరి రోజు గురువారం భారీగా నామినేషన్లు వచ్చే అవకాశలు ఉన్నాయన్నారు.
పేరు: పులపర్తి రామాంజనేయులు
పార్టీ: జనసేన
విద్యార్హత: ఇంటర్మీడియట్
కేసులు: లేవు
చరాస్తుల విలువ: అభ్యర్థి పేరిట :2.30 కోట్లు ,భార్య పేరిట : 1.29 కోట్లు
స్థిరాస్తులు : అభ్యర్థి పేరిట :20.22 కోట్లు, భార్య పేరిట : 10.53 కోట్లు
బంగారం విలువ అభ్యర్థి పేరిట : రూ.50,000 , భార్య పేరిట : రూ.43.75 లక్షలు
అప్పులు: లేవు
వాహనాలు: లేవు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు ఈరోజు తమ నామినేషన్లు సమర్పించనున్నారు. వారిలో
> పోలవరం -చిర్రి బాలరాజు (JSP)
> ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు
> తాడేపల్లిగూడెం -కొట్టు సత్యనారాయణ (YCP)
> ఉంగుటూరు- పుప్పాల వాసు బాబు (YCP)
అభ్యర్థి: తెల్లం రాజ్యలక్ష్మి ( వైసీపీ)విద్యార్హతలు: డిగ్రీ, బీఏ కేసులు: ఏమీ లేవుచరాస్తుల విలువ: రూ.41.61లక్షలు, భర్త బాలరాజు పేరిట: రూ.98.54 లక్షలుబంగారం: 130 గ్రాములు, భర్తకు- 30 గ్రాములుస్థిరాస్తి: 24.10 ఎకరాలు,
భర్తకు 30.74 ఎకరాలు,
కుమారుడి పేరిట-12.38 ఎకరాలు అప్పులు: రూ.25.41 లక్షలు,
భర్తకు రూ.43.27 లక్షలువాహనాలు: భర్త పేరున పార్చ్యునర్ కారు, కుమారుడి పేరిట ఇన్నోవా క్రిస్టా కారు
విద్యార్హతలు: 10
కేసులు: ఒకటి
చరాస్తులు :
అభ్యర్థి పేరిట- రూ.18.లక్షలు, భార్య పేరిట- రూ.11.56 లక్షలు
స్థిరాస్తుల విలువ: అభ్యర్థి పేరిట- రూ.8.59 కోట్లు, భార్య పేరిట- రూ.12.86 కోట్లు
బంగారం: 775 గ్రాములు, వెండి- 2 కేజీలు
వాహనాలు : రూ.11.76 లక్షల విలువైన ఫార్చునర్ కారు, రూ.8.33 లక్షల టయోట కారు
దెందులూరు అసెంబ్లీ పరిధిలో 5వ రోజు బుధవారం ఏడుగురు అభ్యర్థులు తొమ్మిది నామినేషన్లు దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి బుధవారం వెల్లడించారు. కాగా ఏప్రిల్ 26న ఉదయం 11 గంటలకు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.
పోడూరు మండలానికి ఇద్దరు MLAలు ఉన్నారు. మండలంలో 16 గ్రామాలుండగా కొన్నిగ్రామాలు ఆచంట నియోజకవర్గంలో, మరికొన్ని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో సమయంలో మండలంలోని పోడూరు, జగన్నాథపురం, తూర్పుపాలెం, మినిమించిలిపాడు, కవిటం, పి.పోలవరం, గుమ్మలూరు గ్రామాలు ఆచంటలో చేరగా.. పెనుమదం, వద్దిపర్రు, జిన్నూరు, వేదంగి, కొమ్మచిక్కాల, అప్పన చెర్వు, రావిపాడు, మట్టపర్రు పాలకొల్లు పరిధికి వచ్చాయి.
నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడును ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు ఏపీసీసీ అధ్యక్షురాలు YS.షర్మిల బుధవారం బీఫాం అందజేశారు. కాగా ఆయన రేపు నామినేషన్ వేయనున్నట్లు మీడియాకు తెలిపారు.
Sorry, no posts matched your criteria.