WestGodavari

News April 24, 2024

ప.గో.: సిట్టింగ్ MLAలను పక్కన పెట్టారు.. గెలుపు సులువేనా..?

image

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప.గో. జిల్లాలో YCP, TDPలు చెరోస్థానంలో సిట్టింగ్ MLAలను కాదని ఇతరులకు కేటాయించాయి. 2019లో చింతలపూడి వైసీపీ MLAగా నియోజకవర్గ చరిత్రలో అధిక మెజారిటీ సాధించి గెలిచిన ఎలీజాను ఆ పార్టీ ఈ సారి పక్కనపెట్టి విజయరాజుకు అవకాశం ఇచ్చింది. ఉండిలో టీడీపీ MLA రామరాజును కాదని కూటమి అభ్యర్థిగా ఆ పార్టీ RRRకు అవకాశమిచ్చింది. మరి ఈ 2చోట్ల ఆయా పార్టీల గెలుపు సులువయ్యేనా..?
– మీ కామెంట్..?

News April 24, 2024

ప.గో.: రేపు నరసాపురం కూటమి అభ్యర్థి నామినేషన్ 

image

నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం పెద అమిరంలోని NTR విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందిస్తారని కూటమి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

News April 24, 2024

నామినేషన్.. ఒకే ఫ్రేమ్‌లో రఘురామ, రామరాజు

image

ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు నామినేషన్ వేసేందుకు సోమవారం భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రఘురామను పార్టీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించాయి. అనంతరం పెద అమిరం గ్రామంలోని RRR నివాసం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ర్యాలీగా వచ్చారు. ఉండి తహశీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు.

News April 24, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో 10Th ఉత్తీర్ణత శాతం ఇలా..

image

10వ తరగతి ఫలితాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది.
➤ పశ్చిమ గోదావరి జిల్లాలో గతేడాది 65.93 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ ఏడాది 81.82 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది.
➤ ఏలూరు జిల్లా విద్యార్థులు గతేడాది 64.35 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. ఈ ఏడాది 80.08% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది.

News April 24, 2024

10Th రిజల్ట్స్: ప.గో@ 23.. ఏలూరు@ 25

image

☞ ‘పది’ ఫలితాలలో 81.82 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. 20,785 మంది పరీక్షలు రాయగా.. 17,007 (BOYS-8,262, GIRLS-8,745) మంది పాసయ్యారు.
☞ ఏలూరు జిల్లాలో 23,163 మంది పరీక్షలు రాశారు. వీరిలో 18,549 (BOYS-8,513, GIRLS-10,036) మంది ఉత్తీర్ణులయ్యారు. 80.08 శాతంతో ఈ జిల్లా 25వ స్థానంలో నిలిచింది.

News April 22, 2024

ప.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు నామినేషన్లు వేసే అభ్యర్థులు వీరే.
☞ ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్.
☞ నరసాపురం BJP ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
☞ దెందులూరు- చింతమనేని ప్రభాకర్ (TDP).
☞ చింతలపూడి- సొంగా రోషన్ కుమార్ (TDP).
☞ ఉండి- రఘురామకృష్ణరాజు (TDP).
☞ నరసాపురం- బొమ్మిడి నాయకర్ (JSP).
☞ కైకలూరు- దూలం నాగేశ్వరరావు (YCP).

News April 22, 2024

పవన్ కళ్యాణ్ సభలో చాకుతో యువకుడు?

image

పవన్ భీమవరం సభలో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం చౌక్‌లో పవన్ మాట్లాడుతుండగా.. ఇద్దరి కదిలికలపై అనుమానంతో పోలీసులు పట్టుకునేందుకు యత్నించారట. ఓ యువకుడు చాకుతో దాడికి దిగగా.. అతడిని, దుర్గాపురానికి చెందిన మరో యువకుడిని సైతం స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వీరు జేబు దొంగతనాలకు వచ్చారా..?, మరేదైనా కారణమా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

News April 22, 2024

ప.గో.: కూటమి అభ్యర్థులను గెలిపించాలి: RRR

image

ప.గో. జిల్లా కాళ్ళ మండలం జక్కరం గ్రామంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే మంతెన రామరాజు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలిపించాలని సూచించారు.

News April 21, 2024

ప.గో.: ఒకే వేదికపై RRR, మంతెన రామరాజు

image

ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా TDP తొలుత సిట్టింగ్ MLA మంతెన రామరాజు పేరును ఖరారు చేసి, తర్వాత ఆ స్థానం నుంచి రఘురామకృష్ణను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..ఈ రోజు కాళ్ళ మండలం జక్కరంలో కూటమి నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారిద్దరూ ఒకేవేదికను పంచుకొన్నారు. ఈ సందర్భంగా నవ్వులు చిందిస్తూ ముచ్చటించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. సమన్వయంతో పనిచేసి గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 21, 2024

నరసాపురంలో చిన్నప్పుడు తప్పిపోయా: పవన్ కళ్యాణ్

image

నరసాపురంతో తనకు చాలా మంచి జ్ణాపకాలు ఉన్నాయని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్తుండగా నరసాపురం బస్టాండ్‌లో ఆగినప్పుడు తప్పిపోయాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను దుకాణంలో కూర్చొబెట్టి నాన్న వచ్చాక వెయిట్ చేసి అప్పజెప్పారంటూ గుర్తుచేసుకున్నారు.