WestGodavari

News March 19, 2024

ఏలూరు జిల్లాలో బాల్య వివాహం అడ్డగింత

image

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో అధికారులు మంగళవారం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమెకు పెళ్లి చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఇంటికి వెళ్లి అడ్డుకున్నామని జిల్లా బాలల సంరక్షణాధికారి డా.సీహెచ్ సూర్య చక్రవేణి తెలిపారు. అనంతరం బాల్య వివాహల వలన కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు వివరించినట్లు పేర్కొన్నారు.

News March 19, 2024

భీమవరంలో రైలు ఢీకొని మహిళ మృతి

image

భీమవరం రైల్వే అవుట్ పోలీసు స్టేషన్ పరిధి లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై పీటీవీ రమణ తెలిపారు. సుమారు 45 ఏళ్లు కలిగిన మహిళ.. నీలం రంగు చీర, గులాబీ రంగు జాకెట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 70939 39777 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News March 19, 2024

నరసాపురం చరిత్రలో తొలిసారిగా..

image

1952లో ఏర్పడిన నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఇక్కడ అత్యధికంగా 15 సార్లు క్షత్రియ, 2 సార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎంపీలుగా గెలుపొందారు. కాగా వైసీపీ తొలిసారిగా బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. శెట్టిబలిజ వర్గానికి చెందిన న్యాయవాది గూడూరి ఉమాబాలను అభ్యర్థిగా ప్రకటించింది.

News March 19, 2024

GREAT: మన గోదారి బిడ్డకు.. ఆల్ ఇండియా 32 RANK

image

ఇటీవల నిర్వహించిన గేట్ పరీక్షల్లో ఏలూరుకు చెందిన కె.సాయి ఫణీంద్ర ఆలిండియాలో ఉత్తమ ర్యాంకు సాధించాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే చదువుకున్నానని ఫణీంద్ర తెలిపాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ ఫర్‌మేషన్ టెక్నాలజీ (సీఎస్) విభాగంలో పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 921 మార్కులు సాధించి 32వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News March 19, 2024

జనసేనకు ‘గోదారోళ్ల’ మద్దతు ఉండేనా..?

image

TDP- జనసేన- BJP పొత్తులో భాగంగా APలో జనసేన 21 స్థానాల్లో పోటీచేయనుంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన వారిలో 9మంది ఉభయగోదారి జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. మరో 2 స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందని టాక్. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ సైతం తూ.గో. జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. మొత్తం సీట్లలో 50 శాతం అభ్యర్థులను మన గోదారి జిల్లాల నుంచే బరిలో నిలిపారు. మరి జనసేనను గోదారోళ్లు ఆదరించేనా..? – మీ కామెంట్..?

News March 19, 2024

ఏలూరు: ఎన్ని విగ్రహాలకు ముసుగులేశారంటే ..!

image

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి.. 883 వాల్‌రైటింగ్స్, 5,717 పోస్టర్లు, 5,634 బ్యానర్లు, 2,140 హోర్డింగ్స్ మొత్తం 14,374 తొలగించడం జరిగిందని అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేతలు, పార్టీలకు సంబంధించి.. 2,697 విగ్రహాలకు ముసుగుతో పాటు ప్రైవేట్ ప్రదేశాలలో ఉన్న 558 వాల్ రైటింగ్స్, 3,778 పోస్టర్లు, 2,981 బ్యానర్లు, 1,480 హోర్డింగ్స్ మొత్తం కలిసి 8,797 తొలగించామన్నారు.

News March 19, 2024

ప.గో: ‘పది’ పరీక్షలకు 1597 మంది గైర్హాజరు

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన SSC పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి రమణ తెలిపారు. తొలి రోజు తెలుగు పరీక్షకు 23,120 మందికి గాను 21,523 మంది హాజరయ్యారని,  1597 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలపకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

News March 19, 2024

తల్లితండ్రులను పట్టించుకోకుంటే కేసులు: కలెక్టర్

image

తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ద్వారకాతిరుమల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏలూరులో కలెక్టర్‌ను ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురానికి చెందిన చిట్టెమ్మ కలిసి తన బాధను తెలిపి, న్యాయం చేయాలని కోరింది. తన కుమారుడు నిరాదరణకు గురిచేస్తున్నాడని, ఎటువంటి ఆధారం లేదని, న్యాయం చేయాలని కోరింది.

News March 18, 2024

యువతిని నమ్మించి మోసం.. యువకుడికి జైలు శిక్ష

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో యువకుడికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా కోర్టు కమ్ మహిళా కోర్టు జడ్జి జి.రాజేశ్వరి తీర్పునిచ్చారు. వారి వివరాల ప్రకారం.. 2019లో నరేష్ అనే యువకుడు పాలకొల్లుకు చెందిన యువతని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం నిరూపితం కావడంతో నరేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల ఫైన్ విధించారు.

News March 18, 2024

ఏలూరు జిల్లాలో ఎల్లుండి వర్షాలు!

image

ఏలూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!