WestGodavari

News March 25, 2024

ఉమ్మడి ప.గో జనసేన అభ్యర్థుల విద్యార్హతలు

image

ఉమ్మడి ప.గోలోని 15స్థానాలకు ‘కూటమి’ తరపున జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వారి విద్యార్హతలేంటో చూద్దాం.
☞ పోలవరం- చిర్రి బాలరాజు(బీఏ) (2వసారి బరిలో)
☞ నరసాపురం-బొమ్మిడి నాయకర్(డిగ్రీ) (2వ సారి బరిలో)
☞ ఉంగుటూరు- పత్సమట్ల ధర్మరాజు(ITI ఎలక్ట్రికల్) (తొలిసారి బరిలో)
☞ తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్(బీకాం) (2వసారి బరిలో)
☞ భీమవరం- పులపర్తి రామాంజనేయులు (ఇంటర్) (4వసారి పోటీ)

News March 25, 2024

లవ్ మ్యారేజ్.. మరో ఎఫైర్ పెట్టుకొని భార్యకు వేధింపులు

image

భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై ఉండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉండికి చెందిన సూరిబాబు, జ్యోతి 2011లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులుగా చెడు వ్యసనాలకు బానిసైన సూరిబాబు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని భార్య ఆదివారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 24, 2024

గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL

image

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?

News March 24, 2024

జంగారెడ్డిగూడెం: 26న నారా భువనేశ్వరి రాక

image

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత భీమడోలు వెంకన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి వస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తెలిపారు. నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు.

News March 24, 2024

ఏలూరులో సైబర్ మోసం.. రూ.92,650 ఫట్

image

బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి ఓ సైబర్ కేటుగాడు డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. ఇంద్రప్రస్థకు చెందిన బదులు వెంకటేశ్వరప్రసాద్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ అధికారినంటూ నమ్మబలికాడు. క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ వివరాలు తెలుసుకొని వెంకటేశ్వరప్రసాద్ ఖాతాలోంచి రూ.92,650 కాజేశాడు. వెంటనే బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2024

ఏలూరులో మంత్రి కొడుకు Vs మాజీ మంత్రి అల్లుడు

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 నియోజకవర్గాల అభ్యర్థులెవరో తేలింది. ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి ఏలూరు స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ బరిలో ఉండగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌కు TDP టికెట్ ఇచ్చింది. వీరిద్దరిదీ బీసీ సామాజికవర్గమే. మరి వీరిలో ఎవరూ సత్తా చాటేనో చూడాలి.

News March 24, 2024

కోడలిని తమకు అప్పగించాలని ఎస్పీకి అత్త ఫిర్యాదు

image

తమ కోడలిని తమకు అప్పగించాలని ఓ అత్త ఏలూరు SPకి ఫిర్యాదు చేసింది. నవాబుపేటకు చెందిన సురేష్ Febలో లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. యువతి పేరెంట్స్‌కి పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఓ న్యాయవాది వద్ద కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఈనెల 22న ఆ న్యాయవాది ఇంటి నుంచి యువతిని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని, దాంతో సురేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

News March 24, 2024

ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

image

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్‌ను విధుల నుండి తొలగించామని తెలిపారు.

News March 23, 2024

ఏలూరు: రూ.2.59 ల‌క్ష‌లు సీజ్

image

సార్వత్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధికారులు ముమ్మ‌రంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.59 ల‌క్ష‌లు సీజ్ చేసిన‌ట్లు ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నిక‌ల అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్ కె.ఖాజావలి వెల్ల‌డించారు.

News March 23, 2024

ప.గో.: లెక్క తేలింది.. 6 చోట్ల జనసేన.. 9 చోట్ల టీడీపీ

image

ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థులు ఎట్టకేలకు ఖరారయ్యారు. పోలవరం టికెట్‌పై జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు కేటాయించగా.. కొద్ది రోజులుగా ఉన్న సందిగ్ధత వీడింది. పొత్తులో భాగంగా 6 స్థానాల్లో జనసేన, 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీకి పోటీ చేసే అవకాశం రాలేదు. మరి కూటమి అభ్యర్థులు ఎన్నింట విజయం సాధించేనో చూడాలి మరి.