India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ వాహన తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 50 వేలకు మించి నగదు సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తే సీజ్ చేస్తున్నారు. కావున నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏలూరు ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని ఎవరైనా కోరారా అని చంద్రబాబును అడిగారు. టికెట్ మార్పుపైనా చర్చించగా.. సీటు మార్చడం కుదరదని చంద్రబాబు స్పష్టంచేశారన్నారు. తనకు రాజ్యసభలో చోటు కల్పిస్తామని చెప్పినట్లు మాగంటి మీడియాతో తెలిపారు.
కొవ్వూరు – అరిగెల అరుణకుమారి, నిడదవోలు- పెద్దిరెడ్డి సుబ్బారావు, పాలకొల్లు- కొలుకులూరి అర్జునరావు, నరసాపురం- కనురి ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్, భీమవరం- అంకెం సీతారాం, ఉండి- వేగేశ్న వెంకట గోపాలకృష్ణ, తణుకు- కడలి రామరావు, తాడేపల్లిగూడెం- మర్నీడి శేఖర్, ఉంగుటూరు- పాతపాటి హరికుమార రాజు, దెందులూరు- అలపాటి నరసింహ మూర్తి, పోలవరం- దువ్వెల సృజన, చింతలపూడి- ఉన్నమట్ల ఎలీజా.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1952-2019 వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1987వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈలి వరలక్ష్మి.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పి.కనక సుందరరావుపై 31 ఓట్ల అత్యల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరలక్ష్మికి 42,062 ఓట్లు రాగా.. కనక సుందరరావుకు 42,031 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ.
ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.
తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి వారికి మత్తు ఇంజక్షన్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఏలూరు-1 టౌన్ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఫిలిప్పిన్స్లో MBBS కోర్స్ చేస్తున్న కొవ్వూరి భానుసుందర్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి అప్పులపాలయ్యాడు. దీంతో వారిలో ఒకరికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వలన ఒక వ్యక్తి చావుకి కారకుడయ్యాడు. మరో మహిళ ఆసుపత్రిపాలైంది.
ఉమ్మడి జిల్లాలో వర్జీనియా పొగాకు ధర నిలకడగా కొనసాగుతోంది. సోమవారం నాటికి 20 రోజులు వేలం నిర్వహించగా.. ఇప్పటి వరకూ ₹.50.24 కోట్ల విలువైన 21.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1,2 పొగాకు వేలం కేంద్రాల్లో కిలో పొగాకు రూ.240తో వేలం ప్రారంభం కాగా.. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.241 పలుకుతోంది. అయితే ఇది గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు.
మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు అలవాటు పడి ఓ <<12965125>>వ్యక్తి ప్రాణం<<>> తీసిన వైద్యుడి బాగోతం తెలిసిందే. ఆ దొంగ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్రంపాడుకు చెందిన కొవ్వూరి భానుసుందర్ MBBS చదువుతున్నప్పటి నుంచి బెట్టింగ్స్కు అలవాటు పడి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇలా మత్తు ఇంజక్షన్లు ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. సోమవారం భానుసుందర్ను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో సామాన్యుడికి ఒక నిబంధన ముఖ్యమంత్రికి మరో నిబంధననా అని ఆయన ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.