WestGodavari

News March 30, 2024

ప.గో.: ‘పెన్షన్ల పంపిణీ అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర’

image

సంక్షేమ పథకాల్లో వాలంటీర్ల జోక్యం లేకుండా చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్‌తో కేసు వేయించి ఆపివేయించారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం రాత్రి తణుకు మండలం మండపాకలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయించి కుట్ర చేశారని ఆరోపించారు. 

News March 30, 2024

గోపాలపురంలో గెలిచిన మహిళా అభ్యర్థులు వీరే

image

ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు(1962-2019) 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3సార్లు మహిళలు MLAలుగా గెలిచారు. 1978లో దాసరి సరోజినిదేవి(కాంగ్రెస్‘ఐ‘), 2004లో మద్దాల సునీత(కాంగ్రెస్‘ఐ’), 2009లో తానేటి వనిత(TDP) నుంచి గెలుపొందారు. ఇక్కడి నుంచి వనిత మరోసారి MLA అభ్యర్థిగా బరిలో ఉంటుండగా.. ఈసారి పార్టీ మాత్రం వేరు. ఆమె 2009లో TDP నుంచి పోటీ చేసి గెలవగా.. ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.

News March 30, 2024

తాడేపల్లిగూడెం ఓటర్ల తీర్పు ఏంటో..?

image

హోల్‌సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు తాడేపల్లిగూడెం. ఇక్కడి ఓటర్ల నాడి అంత ఈజీగా పట్టలేం. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ.. ఇలా ప్రతి పార్టీకి పట్టం కడుతూ విభిన్న తీర్పు ఇస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున బొలిశెట్టి సత్యనారాయణ(జనసేన) బరిలో ఉండగా.. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. మరి ఈసారి తాడేపల్లిగూడెం ఓటర్లు ఏం తీర్పునిచ్చేనో చూడాలి.

News March 30, 2024

ఇంకా టైం ఉంది.. ఏమైనా జరగొచ్చు: ఎంపీ RRR

image

చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.

News March 30, 2024

VIRAL.. ఓట్ల కోసం మా కాలనీలోకి రావొద్దంటూ ఫ్లెక్సీ

image

ఎన్నికల వేళ ఏలూరులో ఓ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతినగర్ 7వ లైన్‌‌ కాలనీవాసులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగటానికి రావద్దని, 20ఏళ్ల నుంచి తమ కాలనీని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత కాలనీ వైపు తొంగిచూసిన వారే లేరని, డ్రైనేజ్ తీయకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

News March 30, 2024

హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికిన ఏలూరు జిల్లా జడ్జి

image

ఏలూరు పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి బి.కృష్ణ మోహన్‌కి జిల్లా జడ్జి సి.పురుషోత్తం కుమార్ శుక్రవారం స్వాగతం పలికారు. నేడు (శనివారం) స్థానిక జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించబోయే న్యాయమూర్తుల జ్యుడీషియల్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొననున్నారు. జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, జిల్లాధికారులు, ఇతర న్యాయమూర్తులు, లాయర్లు ఉన్నారు.

News March 29, 2024

ప.గో.: GREAT: 100 సార్లు రక్తదానం..

image

పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన చిర్రా గోపాల్‌ వందోసారి రక్తదానం చేశారు. తణుకులోని బ్లడ్‌ బ్యాంకులో శుక్రవారం ఆయన ఈమేరకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. 18 ఏళ్ల వయసులో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న సమయంలో రక్తదానం చేసిన గోపాల్‌ అదే స్ఫూర్తితో 3 నెలలకోసారి రక్తదానం చేస్తూ ఇప్పటి వరకు వందమందికి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.

News March 29, 2024

6 చోట్ల మహిళ MLAలే లేరు..!.. రాజ్యలక్ష్మి రికార్డ్ కొట్టేనా..?

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గానూ 6 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మహిళా MLAలుగా గెలిచిన వారే లేరు. అవే.. నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు, తణుకు, ఏలూరు, భీమవరం. మిగతా 9 చోట్ల వేర్వేరు ఎన్నికల్లో అతివలు సత్తా చాటి పరిపాలన చేశారు. అయితే.. ఈసారి పోలవరం వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి దక్కింది. ఆమె ఈ పోరులో గెలిచి పోలవరం చరిత్రలో నిలిచేనా చూడాలి.

News March 29, 2024

ఏలూరు: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య SUICIDE

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన చినవెంకట సాంబమూర్తి RDO ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్. ఆయనకు ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెంకు చెందిన రాధిక(31)తో 2010లో పెళ్లైంది. రెండ్రోజుల కింద రాధిక ఊరివేసుకొని మృతి చెందింది. అదనపుకట్నం తీసుకురావాలని తరచూ భర్త వేధించడం వల్లే తమ కూతురు ప్రాణాలు తీసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

News March 29, 2024

10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

image

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.