India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెదవేగి మండలంలో భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. తాళ్లూరి రోజా కుటుంబ కలహాల మధ్య తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. ఏసు తన భార్యపై అనుమానంతో రాత్రి 11గంటలకు సమయంలో కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరకగా రోజా అక్కడికక్కడే మృతిచెందింది. విచారించిన అనంతరం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం ప్రదర్శించుట చేయరాదన్నారు. నిషేధాజ్ఞలు ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే రాజకీయ నాయకులు తప్పకుండా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పార్టీ అభ్యర్థులు సమావేశాలు మొదలైనవాటిని నిర్వహించడానికి 48గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగియడానికి 48గంటల ముందు నిశ్శబ్ద కాలం తప్పక పాటించాలని, దీనినే ఎన్నికల ముందు నిశ్శబ్దం అని పిలుస్తారని అన్నారు.

ఎన్నికల నేపద్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు అనుసారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించుట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించడం చేయరాదన్నారు.

సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించారు. ప్రవేటు భవనాలపై వాల్ పేయింటింగ్కు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించాలన్నారు. ఓటర్లను చైతన్యపరిచే స్వీప్ కార్యక్రమాల నివేదిక తయారు చేయాలన్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రసూతి మాతృ మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని, ముందస్తుగా వారి ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. 6ప్రసూతి మరణాలకు సంబంధించి విచారణ చేపట్టారు.

పెండింగ్ లో ఉన్న ఫారం-7,8 లను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా పనిచేస్తున్న మాచవరపు రాముడు చేసిన పరిశోధనకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ‘స్పింట్రానిక్ అనువర్తనాలకు మాంగనీస్ ఆధారిత యాంటీఫేరో మ్యాగ్నెంట్ హ్యుస్లర్’ పదార్థాల అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. దీనికి గాను జాతీయస్థాయి గుర్తింపు రావడంతో భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు రూ.25లక్షలు కేటాయించింది.

ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి సీటు ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైసీపీలో చేరారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం టీడీపీకి మైనస్ అవుతుందా..? వైసీపీకి కలిసివస్తుందా..? కామెంట్ చేయండి.

తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నాయకులు మాగంటి బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో వస్తున్న తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవాలని, వాటిని నమ్మొద్దని చెప్పారు. వ్యక్తిగత పనులపై హైదరాబాదులో ఉన్న కారణంగా క్యాంప్ కార్యాలయంలో అందుబాటు లేనని చెప్పారు. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదన్నారు.
Sorry, no posts matched your criteria.