India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా కలెక్టరేట్, డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచి అమలులోకి వచ్చిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్పందన కార్యక్రమం జరగదని తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు 32 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నందు 1,971 కేసులను రాజీ చేశామన్నారు. అందులో 1,760 పెండింగ్ కేసులకు పరిష్కారం చూపామని చెప్పారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 2,356 పెట్టీ కేసులను కూడా రాజీ చేశామన్నారు.

ప.గో జిల్లా తణుకు మండలం పైడిపర్రులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి ఎట్టకేలకు కిందికి దిగాడు. వేల్పూరు గ్రామానికి చెందిన యరమాటి సత్యనారాయణ ఆదివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సత్యనారాయణను కిందకు దించే ప్రయత్నం చేశారు. దాదాపు 3గంటల అనంతరం అతడు కిందికి దిగాడు.

సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి ప.గో వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, కార్యాలయాలపై ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆదివారం మొగల్తూరు పంచాయతీ సిబ్బంది అధికారుల పర్యవేక్షణలో సచివాలయాల భవానాలు, బహిరంగ ప్రదేశాలలోని బ్యానర్లు, ఫ్లెక్సీలు, పార్టీల జెండాలు తొలగించారు. విగ్రహాలకు ముసుగులు వేశారు.

ప.గో జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మొత్తం 1,463 పోలింగ్ స్టేషన్లలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధులను కూడా సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు అప్పజెప్పడం లేదని, పరోక్షంగా వాలంటీర్లు ఎవరికైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో YCP నుంచి ఇరువురు మహిళలకు అవకాశం దక్కింది. వీరిలో తెల్లం రాజ్యలక్ష్మి (పోలవరం), తానేటి వనిత (గోపాలపురం) ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఒకరికి అవకాశం లభించగా, ఈసారి అదనంగా మరొకరికి చోటు దక్కింది. కాగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ నుంచి గూడూరి ఉమాబాలకు అవకాశం లభించింది. ఏలూరు జిల్లాలో పార్లమెంటు మహిళలకు స్థానం దక్కలేదు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా, పార్టీ సీనియార్టీ ప్రధానంగా సీట్ల కేటాయింపు జరిగింది. సామాజికవర్గాల వారీగా కాపులకు 5, క్షత్రియులకు 3, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, వెలమకు 1, కమ్మకు 1 స్థానం కేటాయించారు. రెండు పార్లమెంట్ స్థానాలను బీసీల్లోని యాదవ, శెట్టిజలిజలకు కేటాయించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,61,338 మంది ఓట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మహిళలు అత్యధికంగా 7,44,308, పురుషులు 7,16,956 మంది, థర్డ్ జెండర్స్ 74 మంది ఉన్నారు. మొత్తంగా 1,463 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఈసారి ఐదుగురు కొత్తవారికి వైసీపీ అవకాశం కల్పించింది. ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్కుమార్ యాదవ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి విజయరాజు (రిటైర్డ్ రవాణా శాఖ అధికారి), పోలవరం అసెంబ్లీ అభ్యర్థి రాజ్యలక్ష్మి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ), పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థి గుడాల గోపికి పార్టీ అవకాశం ఇచ్చింది.

ప.గో. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల చదువులు ఇలా..
చెరుకువాడ శ్రీరంగనాథరాజు- 9వ తరగతి
కొట్టు సత్యనారాయణ – ఇంటర్
గుడాల శ్రీహరిగోపాల రావు – బీకాం
పెన్మెత్స వెంకట లక్ష్మీ నర్సింహరాజు – బీఏ
గ్రంథి శ్రీనివాస్ – ఇంటర్
ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు – ఇంటర్
ఆళ్ల నాని – బీకాం
తానేటి వనిత – MSC (PHD)
అబ్బయ్య చౌదరి – బీటెక్
కంభం విజయరాజు – BA, ఎల్ఏఈ
తెల్లం రాజ్యలక్ష్మి- BA, బీఈడీ
పుప్పాల శ్రీనివాసరావు – డిగ్రీ
Sorry, no posts matched your criteria.