WestGodavari

News March 22, 2024

ఉమ్మడి ప.గో నేతల్లో టెన్షన్.. ఆ ‘ఒక్కరు’ ఎవరు..?

image

TDP అభ్యర్థుల మూడో లిస్ట్ విడుదలైంది. ఈ జాబితాలోనూ పోలవరం టికెట్‌పై సందిగ్ధత వీడలేదు. ఉమ్మడి ప.గో జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ ఇప్పటికే అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కూటమి తరపున సైతం పోలవరం మినహా.. 14 చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, పోలవరం నుంచి మాత్రం ఏ పార్టీ బరిలో ఉంటుంది..? ఎవరు పోటీ చేస్తారు..? అనే ఉత్కంఠ వీడటం లేదు. దీంతో అటు క్యాడర్‌లో టెన్షన్.. ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

News March 22, 2024

ఏలూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థినికి వేధింపులు!

image

ఏలూరు జిల్లా కలిదిండి మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరిట వేధిస్తున్న ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై ప్రియ కుమార్ వివరాల ప్రకారం.. మండలానికి చెందిన బాలిక(17) మచిలీపట్నంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలిక సొంతూరుకు చెందిన యువకుడు ప్రేమించాలంటూ కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

అనుమతులు తప్పనిసరి: ఏలూరు ఎస్పీ

image

ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీ అమలులో ఉన్నందున ఏవైనా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సువిధ యాప్‌లో పూర్తి సమాచారంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతించమని తెలిపారు.

News March 22, 2024

పోలవరం: చివరికి ఆ సీటు ఎవరికి..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే సీటు కేటాయింపు విషయంలో గందరగోళం నెలకొంది. కొంతకాలం వరకు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ ఇస్తున్నారని, అలాగే టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాసులకు సీటు కేటాయిస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలలో కొత్త అభ్యర్థుల పేర్లు వినిపించడంతో టీడీపీ, జనసేన నాయకుల్లో టెన్షన్ నెలకొంది.

News March 21, 2024

ఉంగుటూరు: ఒకే వేదికపై ఎమ్మెల్యే అభ్యర్థులు

image

ఉంగుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ ప్రస్తుత అభ్యర్థి పుప్పాల వాసుబాబు, జనసేన- టీడీపీ- బీజేపీ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఒకే వేదికపై కనిపించారు. నిడమర్రు మండలం
పెదనిండ్రకొలను రథోత్సవంలో వీరిద్దరూ వాహనంపై ఎక్కి పూజలు నిర్వహించారు. వారితో పాటే మాజీ MLA గన్ని వీరాంజనేయులు కూడా ఉన్నారు. ముగ్గురు నాయకులు పరస్పరం అభివందనం చేసుకుని భక్తి కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత చోటుచేసుకుంది.

News March 21, 2024

కామవరపుకోట: ఫోక్సో కేసులో దేవాదాయ శాఖ ఉద్యోగి

image

కామవరపుకోట మండలంలో ఓ మైనర్ బాలికపై దేవాదాయ శాఖ ఉద్యోగి లక్ష్మీ నరసింహారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు బంధువుల ఫిర్యాదు మేరకు గురువారం తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు ఎండోమెంట్ పరిధిలో నరసింహారావు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News March 21, 2024

పాలకొల్లులో ఈసారి గెలుపెవరిదో..!

image

టీడీపీ వచ్చాక పాలకొల్లులో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు ఆ పార్టీ,2 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఈసారి పాలకొల్లులో విజయం ఏ పార్టీది అనే చర్చ సాగుతోంది. 1983,1985,1994,1999, 2004, 2014, 2019లలో టీడీపీ గెలిచింది. 1989, 2009లో కాంగ్రెస్ గెలిచింది. కాగా ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, వైసీపీ నుంచి గుడాల గోపి పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనే దానిపై మీ కామెంట్.

News March 21, 2024

ప .గో జిల్లా వాలంటీర్లకు హెచ్చరిక

image

జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ సుమిత్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2024

ప.గో జిల్లాలో పది లక్షల కిలోల పొగాకు కొనుగోళ్లు

image

ఉమ్మడి జిల్లాలోని 5 పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారానికి మిలియన్‌ (పదిలక్షల) కిలోల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 6న వేలం ప్రారంభమైంది. కిలో రూ.240 గరిష్ఠ ధర నమోదు కాగా సగటు ధర రూ.239.46 లభించింది. ఎన్‌ఎల్‌ఎస్‌లో దాదాపు 60 మిలియన్‌ కిలోలకుపైగా పొగాకు పండింది. అలాగే ఒకవైపు వేలం.. మరోవైపు సాగు.. ఓవైపు పొగాకు వేలం జరుగుతుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News March 21, 2024

ఉండి: ప్రేమ పేరిట వేధింపులు.. యువకుడిపై కేసు

image

ప్రేమ పేరిట వేధిస్తూ పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించిన యువకుడిపై కేసు నమోదైందని ఉండి పోలీసులు తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక తాతయ్య వద్ద ఉంటోంది. యండగండి గ్రామానికి చెందిన చంటి ప్రేమ పేరిట వెంటపడి వేధిస్తుండేవాడని పోలీసులు తెలిపారు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి పెళ్లికి ఒప్పుకోకపోతే చంపుతానని బెదిరించాడన్నారు.దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.