India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవరపల్లి మండలం సూర్యనారాయణ పురం హైవే పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు కందిపల్లి సత్యనారాయణ (26)గా గుర్తించారు. పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామం బిక్కవోలుకు బైక్ పై వస్తున్నాడు. యర్లగూడెం టోల్గేట్ దాటిన తర్వాత బైక్ పై వెనుక కూర్చున్న సత్యనారాయణ నిద్ర మత్తులో కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. శంఖవరం మండలం కత్తిపూడి హైవేపై జరిగిన ప్రమాదంలో భీమవరానికి చెందిన ముగ్గురు చనిపోయారు. పెదవేగి మండలం సీతాపురంలో జరిగిన ప్రమాదంలో రామసింగవరానికి చెందిన కేబుల్ ఆపరేటర్ శ్యామ్ మృతి చెందారు. దెందులూరు మండలం ఉండ్రాజవరంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సోమయ్య (60) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శంఖవరం మండలం కత్తిపూడిలో హైవేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. భీమవరానికి చెందిన సత్యనాగమధు కుటుంబీకులు, స్నేహితుడు మొత్తం ఏడుగురు శనివారం అన్నవరం బయలుదేరారు. ప్రమాద స్థలంలో శ్యాంప్రసాద్, దివ్య, ఆమె భర్త శివనారాయణ మృతిచెందారు. శ్యాంప్రసాద్ దంపతులకు పెళ్లై పదేళ్లు అయినా పిల్లలు కలగకపోవడంతో దత్తతు తీసుకునేందుకు వారు అన్నవరం బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది.
నరసాపురం ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్గా రూపొందిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శనివారం నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించి, అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్వేది మంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
పెదవేగి మండలం సీతాపురం గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. ద్విచక్ర వాహనంపై అటుగా వస్తున్న ఓ వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి రామసింగవరం గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ శ్యామ్గా గుర్తించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక రేట్లతో టికెట్లను అమ్ముతున్నారని సమాచారం మేరకు రవాణా శాఖ అధికారులు ప.గో.జిల్లాలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠినంగా శిక్షిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ తనిఖీల్లో 96 కేసులు నమోదు చేసి, రూ.14లక్షలు ఫైన్ వేసి, 2బస్సులను సీజ్ చేశామన్నారు.
సంక్రాంతి కోసం సొంత గ్రామాలకు నగరవాసులు తరలిరావడంతో ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ 13,14,15 తేదీలు వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాలకొల్లు, భీమవరం, నరసాపురం పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు సాధారణంగా వెయ్యి లోపు ఉంటే ఇప్పుడు రూ.3వేల నుంచి 5 వేలకు పెరిగాయి.
ఆచంటలోని పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఆలయం తిరునాళ్ల నిర్వహణకు ముస్తాబవుతోంది. సంక్రాంతి పర్వదినాల్లో ఈ ఆలయంలో తీర్థవ ఘనంగా జరుగుతుంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. పూర్వం ఓ నవ జంట ఇక్కడ చనిపోయింది. పాము కాటు వేయడంతో భర్త చనిపోయాడని భార్య స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఊర్లో పంటలు సరిగా పండకపోవడంతో వారికి ఇక్కడ గుడి కట్టినట్లు గ్రామస్థులు చెబుతారు.
విధి నిర్వహణ, పనితీరు ఆధారంగా చింతలపూడి మండల తహశ్దీలార్ డి. ప్రమద్వార ఏలూరు జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు ప్రమద్వారను అభినందించారు. జిల్లాలో పనితీరు ఆధారంగా ద్వితీయ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని ఈ విజయం సాధించడానికి సహకరించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఉన్నతాధికారులు, చింతలపూడి మండల రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలన్నారు.
విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందడానికి చక్కని పరిష్కారం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో ఇప్పడు సోలార్ రూఫ్ టాప్ పథకం సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు భీమవరం ఆమె కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పీఎం సూర్య ఘర్ పోర్టల్ pmsuryaghar.gov.inలో దీని కోసం రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.