India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.
ఆచంటలో రూ.కోటి వ్యయంతో త్వరలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉక్కు భారీ పరిశ్రమల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం ఆచంట మండలం ఏ వేమవరం గ్రామంలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ కేంద్రం మంజూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాత్ర ఎంతో ఉందన్నారు.
ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎస్సీ పేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీ పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీమవరంలో ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిన మైనర్ బాలిక ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో గాలించి బాలిక పాలకొల్లు బస్టాండ్లో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని, అతని మాటలు నమ్మి వెళ్లిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కాగా పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచించారు.
రెవెన్యూ సదస్సుల్లో, రీసర్వే గ్రామ సభల్లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో వివిధ రెవెన్యూ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల నమోదు, పరిష్కార ప్రక్రియ పురోగతి, 22 ఏ కేసుల స్థితి తదితర అంశాలపై ఆమె సమీక్షించారు.
మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటను ముమ్మరంగా చేస్తున్నారు. పచ్చి సరకు కంటే ఎండు చేపలకు గిరాకీ ఉంటోంది. దీంతో వాటిని ఎండబెడుతూ మరింత ఆదాయం పొందుతున్నారు. బయట మార్కెట్లో ఎండు చేపలు సప్లై తక్కువగా ఉండడంతో మొగల్తూరులో ఎండు చేపలకు గిరాకీ పెరిగింది. కేజీ సుమారు రూ.500 పైనే పలుకుతోంది. మరోవైపు చేపలు, రొయ్యల మేతల్లో వీటిని కలిపేందుకు ఎగుమతులు సైతం భారీగా చేస్తున్నారు.
పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని పోలీసులు కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి నేర సమీక్షను మంగళవారం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాపర్టీ కేసుల గురించి ఆరా తీశారు. నిందితులు అరెస్ట్ అయిన కేసుల్లో త్వరితగతిన ఛార్జ్షీట్ దాఖలు చేసి.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి పూర్తిగా అరికట్టేలా కృషి చేయాలన్నారు.
ప.గో జిల్లాలో కోళ్లు <<15211030>>చనిపోతున్న <<>>విషయం తెలిసిందే. శీతాకాలంలో కోళ్లకు ఇలాంటి మిక్స్డ్ వైరస్ రావడం సహజమేనని పశువర్ధక శాఖ డీడీ జవహర్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘గాలి, నీరు, కోళ్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోడిని కాల్చేయాలి. ముందు జాగ్రత్తగా RDF1, RDK, పాల్పాక్స్ టీకాలు వేయించాలి. యాంటి వైరల్ ఇన్పెక్టెంట్ లేదా బయోబస్టార్ పౌడర్ను లీటర్ నీటికి ఓ గ్రాము కలిపి తాగించాలి’ అని ఆయన సూచించారు.
మొబైల్ చోరీ చేసిన వ్యక్తికి భీమవరం కోర్టు జైలుశిక్ష విధించింది. గతేడాది భీమవరం వీరమ్మ పార్క్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా తణుకు ఏరియాకు చెందిన వరదా దినకరన్ అడ్డుకున్నాడు. అతడిని బెదిరించి ఫోన్ తీసుకుని పారిపోయాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం నిరూపణ కావడంతో వరదా దినకరన్కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి ధనరాజ్ తీర్పు వెలువరించారు.
Sorry, no posts matched your criteria.