WestGodavari

News July 31, 2024

ఏలూరు: ఇస్త్రీ పెట్టె షాక్ కొట్టి యువకుడి మృతి

image

ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడులో విషాదం నెలకొంది. బట్టలు ఇస్త్రీ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి జంగం తంబి(26) మరణించాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తంబి బట్టలు ఇస్త్రీ చేస్తుండగా షాక్‌కు గురై అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 31, 2024

ఏలూరు: విషాదం.. కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వెదుళ్ల నరేశ్(11) మంగళవారం డాబాపై ఆడుకుంటూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిల్లలతో కలిసి డాబాపై ఆడుకుంటుండగా, అతడి చేతిలో ఉన్న ఇనుప పైపు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News July 31, 2024

ప.గో: రోడ్డు ప్రమాదం.. వదిన, మరిది మృతి

image

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వదిన, మరిది మృతి చెందారు. మృతులు మందస మండలం బోగబంద పంచాయతీ పరిధిలోని కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్(21)గా పోలీసులు గుర్తించారు. ప.గో జిల్లా తణుకు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా.. అదుపుతప్పి పడటంతో వీరు మృతి చెందారు.

News July 30, 2024

MLA చిర్రి బాలరాజుపై దాడిని ఖండిస్తున్నా: నాగబాబు

image

పోలవరం MLA చిర్రి బాలరాజుపై జరిగిన <<13739566>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. ‘X’ వేదిక స్పందిస్తూ.. దోషులు ఎవరైనా సరే కఠిన శిక్షపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం అవ్వకుండా కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు.

News July 30, 2024

జంగారెడ్డిగూడెం: గదిలో బంధించి అత్యాచారం

image

జంగారెడ్డిగూడెంలో బాలికపై అత్యాచారం జరిగింది. స్థానిక యువకుడికి విజయనగరం బాలిక ఇన్‌స్టాలో పరిచయమైంది. అతడిని కలిసేందుకు JRG బస్టాండ్‌ వద్దకు వచ్చింది. యువకుడు బాలికతో మాట్లాడి కాసేపట్లో వస్తానని వెళ్లిపోయాడు. తిరిగిరాకపోవడంతో అక్కడే ఉన్న శ్రీను అనే వ్యక్తి బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ రాజు అనే మరొక వ్యక్తి బాలికను ఊరు పంపిస్తానని చెప్పి రూంలో ఉంచి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 30, 2024

జంగారెడ్డిగూడెంలో ఉద్యోగ మేళా

image

ఛత్రపతి శివాజీ త్రి శత జయంతి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 31న ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ .ప్రసాద్ బాబు తెలిపారు.ఈ జాబ్ మేళాలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ అర్హత కలిగి, 18 ఏళ్లు పైబడిన వారు ఉద్యోగ మేళాలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాల్గొనాలన్నారు. https:///bit.ly/ncsregister గూగుల్ షీట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

News July 30, 2024

నరసాపురం: యువకునిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను వంచించిన ఘటనలో నిందితుడిపై పోక్సో,ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేశామని నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్సీ ధర్మారావు తెలిపారు. పోలీసుల కథనం.. పాలకొల్లుకు చెందిన బాలిక(15)కు నరసాపురానికి చెందిన నయనాల సతీశ్(28) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. సతీశ్ ఆ బాలికను మూడు సార్లు లాడ్జికి తీసుకువెళ్లి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు

News July 29, 2024

BREAKING: పోలవరం MLA కారుపై దాడి

image

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. రాయి విసరడంతో కార్ అద్దం పగిలినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 29, 2024

రాష్ట్రాన్ని అప్పులపాలుచేసి తాకట్టుపెట్టారు: మంత్రి నిమ్మల

image

జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులు, పాపాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని రూ.14 లక్షల కోట్ల అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోడూరు మండలం వద్దిపర్రు ముంపు ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యావసర సరకులు అందించారు.

News July 29, 2024

ఏలూరు జిల్లాలో సైకో వీరంగం

image

ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పరకు చెందిన అజ్జా రాజు అనే వ్యక్తి మహిళలపై దాడికి పాల్పడటంతో అతడిని తాళ్లతో బంధించి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజు సైకోగా మారి ఇలాగే పలుమార్లు దాడులకు పాల్పడడంతో గణపవరం పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు నమోదైనట్లు సమాచారం. గతంలో తండ్రి నాగరాజుపై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.