India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్థిక ఇబ్బందులతో మహిళా వాలంటీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి ప.గో. నల్లజర్ల(M)లో గురువారం జరిగింది. ప్రకాశరావుపాలెంకు చెందిన గౌతమి(24) ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.50 వేలు ఋణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది సామగ్రి బయపడేసి ఇంటికి తాళం వేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తల్లిని చూసిన చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించిన పురుష, మహిళ కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలను సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ, డ్రోన్ కెమెరాల ద్వారా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పేర్కొన్నారు. 4,976 అభ్యర్థులకు హాల్ టికెట్స్ ఇవ్వగా వారిలో 3,453 మంది మంది హాజరయ్యారని వారిలో 1,975 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు.
సంక్రాంతికి సొంతూర్లకు వచ్చేందుకు ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్లు అయిపోయాయి. బస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. HYD నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు పట్టణాలకు ప్రయివేట్ ట్రావెల్స్లో సుమారుగా రూ. 2,500 నుంచి 3 వేల వరకు ఉన్నాయని చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో ఛార్జీలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ కామెంట్
సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జంతుహింస జరుగకుండా నియంత్రణా చర్యలు చేపట్టాలని గురువారం అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లాలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో అన్ని మండలాల్లో 28 సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.
కొవ్వూరు మండలం కాపవరం సమీపంలోని గోవర్ధనగిరి మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గోపాలపురానికి చెందిన కె. వెంకటేశ్వరరావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 12న జిల్లా మీదుగా నడిచే రెండు రైళ్లను రద్దు చేస్తూ విజయవాడ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
గోపాలపురం(M) కొమటిగుంట రైస్ మిల్లులో బయటపడిన అక్రమ PDS బియ్యం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. అధికారులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా మిల్లులో44 బస్తాల బియ్యం, లారీలో లోడ్ చేసున్న 580 బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విలువ రూ.14,31,111 ఉంటుందన్నారు. ఐదుగురు మిల్లు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లారీని సీజ్ చేశామన్నారు.
ప.గో.జిల్లాలో 27 రోజులు పాటు 318 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4,560 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 8 వరకు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నరసాపురం ఆర్డీవో దాసిరాజు హెచ్చరించారు. నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు (పీసీ, పీఎన్డీటీ) కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది డివిజన్లోని స్కానింగ్ సెంటర్స్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్
Sorry, no posts matched your criteria.