WestGodavari

News January 22, 2025

ప.గో జిల్లా పాడి రైతులకు గమనిక

image

ప.గో జిల్లాలో జనవరి 31వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి వెల్లడించారు. పశువులకు పరీక్షలు చేసి.. గర్భకోశ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 21, 2025

Photo Of The Day: భార్యాభర్త ఫైరింగ్

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఇవాళ పోలీస్ ఫైరింగ్ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు. భార్యాభర్తలైన ఎస్పీ, జేసీ ఒకేసారి ఇలా పక్కపక్కనే నిలబడి ఫైరింగ్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News January 21, 2025

ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి

image

కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.

News January 21, 2025

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి

image

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.

News January 21, 2025

ద్వారకాతిరుమల: పిల్లి పిల్లను తల్లిలా సాకుతున్న శునకం

image

ద్వారకాతిరుమల వసంత్ నగర్ కాలనీలో ఒక శునకం పిల్లి పిల్లను కన్న తల్లిలా సాకుతుండటం అబ్బురరుస్తోంది. తన వెంట తిప్పుకుంటూ ఆడిస్తుండటం ముచ్చట గొలుపుతోంది. అంతేకాదు ఆ పిల్లికి పాలిచ్చి మరీ పెంచుతోంది. కుక్కను చూస్తే ఆమడ దూరం పారిపోయే పిల్లి పిల్ల సైతం శునకంతో కలిసి ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండూ నలుపు రంగులో ఉండటంతో అకస్మాత్తుగా వాటిని చూసినవారు నిజంగా అవి తల్లీపిల్ల అని అనుకుంటున్నారు.

News January 21, 2025

JRG: ఇంటర్ యువతిపై అత్యాచారం.. కేసు నమోదు

image

అత్యాచారం చేసిన యువకుడిపై ద్వారకాతిరుమల పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ద్వారకాతిరుమల మండలానికి చెందిన యువతి, యువకుడు జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ప్రేమ పేరుతో యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో నిన్న అమ్మాయి ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News January 21, 2025

ప్రజలు వాటిని నమ్మకండి: ప.గో కలెక్టర్

image

ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే కలెక్టర్ పేరిట ప్రకటన విడుదల చేస్తాం. వేరే వారి పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను గందరగోళం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్ హెచ్చరించారు.

News January 21, 2025

ఆ నిధులను సమాజ సేవకే వినియోగిస్తాం: ప.గో కలెక్టర్

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు ద్వారా సేకరించిన నిధులను సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. రూ.లక్ష కంటే ఎక్కువగా సభ్యత్వ రుసుము సేకరించిన తణుకు తహశీల్దార్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అభినందించారు.

News January 20, 2025

బిహార్‌కు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ RRR

image

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిహార్ వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగిన అఖిల భారత సభాపతుల మహాసభలో పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇతర రాష్ట్రాల స్పీకర్లతో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్ల విధులు గురించి తెలుసుకున్నారు.

News January 20, 2025

భారత జట్టుకు ఏలూరు ఎంపీ శుభాకాంక్షలు

image

ఖోఖో ప్ర‌పంచ‌క‌ప్‌ పోటీల్లో విజేతగా నిలిచిన భార‌త జట్టుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లోనే భారత మహిళలు, పురుషుల జట్లు విశ్వవిజేతలుగా నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ పేర్కొన్నారు.