WestGodavari

News December 30, 2024

ఏలూరు: నేడే పోలీస్ ఈవెంట్స్ నిబంధనలు ఇవే..!

image

ఏలూరులో నేటి నుంచి జరగనున్న (PET&PMT) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ఆయన వివరించారు. *సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా పరీక్షలు నిర్వహణ*వైద్య శిబిరం, అంబులెన్సులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, *ఒక సెట్ జిరాక్స్ కాపీలు*అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి. *స్నేహితులు, బంధువులకు అనుమతిలేదు

News December 30, 2024

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపే మాటలు నమ్మొద్దు..ఎస్పీ సూచన

image

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసే వారి సమాచారాన్ని ఫోన్ నెంబర్ 9550351100 కి తెలపాలని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.

News December 29, 2024

ప.గో: ‘237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి’

image

ప.గో.జిల్లాలో ఇప్పటివరకు 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజల నుంచి భూ సంబంధ, రెవెన్యూ శాఖల పరంగా మ్యుటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

News December 29, 2024

ప.గో.: ఆ కేసును కొట్టివేయండి: మంత్రి

image

ఏలూరు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ.. మంత్రి నిమ్మల రామానాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హాజరు నుంచి మినహాయింపుతో పాటు కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 2022లో పాలకొల్లులో టిడ్కో ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడంలేదంటూ నిమ్మల నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News December 29, 2024

సంక్రాంతి పండుగ.. హోటల్స్‌కు ఫుల్ డిమాండ్

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప.గో జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. భీమవరం, ఏలూరు, తణుకు, నర్సాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో 4 రోజులకు గాను రూ.25 వేల- రూ.35 వేల వరకు అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.

News December 29, 2024

కొల్లేరుపై నిర్వహించిన లిడార్ సర్వేపై ఏలూరు కలెక్టర్ సమీక్ష

image

కొల్లేరుపై 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తవడంతో దానిపై శనివారం శాఖల అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, లిడార్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులు, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News December 28, 2024

పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం భీమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు& ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న 47 పరిశ్రమలకు స్టాటిటరీ నోటీసులు ఇచ్చి, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలన్నారు.

News December 28, 2024

ఏలూరు జిల్లాలో ఒకరోజు ముందే రూ.113.01కోట్లు పంపిణీ

image

డిసెంబర్ 31న జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,62,228 మంది పెన్షన్‌దారులకు రూ.113.01 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. పెన్షన్ పంపిణీపై అధికారులతో శనివారం సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న పెన్షన్ చెల్లింపులు జనవరి 1న ఆంగ్ల సంవత్సరాది కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

News December 28, 2024

నిడదవోలు: యువతి అదృశ్యంపై కేసు నమోదు

image

నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన దేనాబోయిన అమర్నాథ్ కుమార్తె సునీత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై వీరబాబు తెలిపారు. శనివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సునీత నిడదవోలు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుందన్నారు. ఈనెల 27న ఉదయం కళాశాలకు వెళ్లి ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదని, అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News December 28, 2024

ప.గో: గన్ మిస్ ఫైర్..రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు

image

సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్‌ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్‌ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి స్టేషన్ బయట కూర్చుని గన్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయ్యింది.