WestGodavari

News November 26, 2024

దోషరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

దోషరహిత ఓటరు జాబితాను రూపొందించడంపై సంబంధిత అధికారులు కృషి చేయాలని ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ చెప్పారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి 2005 ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై సమీక్షించారు. జిల్లాలో 18-20 సంవత్సరాల వయస్సు కలిగిన యువతను ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్ధులను నూతన ఓటర్లుగా చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

News November 25, 2024

పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

image

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్‌కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, శరీరపు కుష్టు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.

News November 25, 2024

పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

image

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్‌కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, కుష్ట, శరీరపు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.

News November 24, 2024

ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ, పెళ్లి ఆ తర్వాత

image

మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిపై శనివారం కృష్ణా జిల్లా గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వంగాయిగూడెంకు చెందిన ఓ బాలికకు గుణదలకు చెందిన రాంపండు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. బాలిక 4నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతడి కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News November 24, 2024

భీమవరం: ‘అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి’

image

భీమవరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 368 సీ.సీ, బీ.టీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా, మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 23, 2024

నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జీఐ)కు ఎంపిక 

image

నరసాపురం లేస్‌కు భౌగోళిక సూచిక (జిఐ) ఎంపికతో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు ప.గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 25న హోటల్ ఒబెరాయ్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా లేస్ పార్క్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

News November 23, 2024

భీమవరం: కేంద్ర మంత్రికి జిల్లా ప్రముఖులు పరామర్శలు

image

పితృవియోగం పొందిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను పలువురు నేతలు శనివారం పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరమిల్లి రాధాకృష్ణ, ధర్మరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

News November 23, 2024

ఉమ్మడి ప.గో. జిల్లా నేతలకు కీలక పదవులు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నేతలను కీలక పదవులు వరించాయి. APC ఛైర్మన్‌గా భీమవరం MLA రామంజనేయులు, అదే కమిటీకి సభ్యుడిగా తణుకు MLA రాధకృష్ణ తాజాగా ఎంపికయ్యారు. ఇటీవల ఉండి MLA రఘురామకు DY. స్పీకర్ పదవి లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక జిల్లా నేతలను కీలక పదవులు వరించాయి. దీంతో శుక్రవారం CM, డిప్యూటీ సీఎం, పలువురు కూటమి నాయకులు వారికి అభినందనలు తెలిపారు.

News November 22, 2024

రఘురామతో హిందూపురం ఎమ్మెల్యే భేటీ

image

శాసనసభ సమయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య పలు అంశాలు చర్చించుకున్నారు. ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి బాలకృష్ణ తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసే నిధులు కోసం ఎదురు చూడకుండా స్వంత అభివృద్ధి నిధి ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు.

News November 22, 2024

కేంద్రమంత్రి తండ్రి మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి

image

నర్సాపురం ఎంపీ, కేంద్రసహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. సూర్యనారాయణ కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.