WestGodavari

News June 25, 2024

ప.గో: విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

ప.గో జిల్లాలో వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామానికి చెందిన జ్యోతి(38) ఈనెల 24వ తేదీన ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి పాలకొల్లు ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు భర్త పోతరాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వీరవాసనం ఎస్సై రమేష్ తెలిపారు.

News June 25, 2024

శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు అవగాహన

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా సమస్యలపై చర్చించారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మంత్రి దుర్గేష్, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

News June 25, 2024

ఏలూరు: GOOD NEWS.. 6 రైళ్ల పునరుద్ధరణ

image

ట్రాఫిక్ మెయింటనెన్స్ దృష్ట్యా గతంలో రద్దు చేసిన 6 రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విశాఖ-లింగంపల్లి(12805నెంబర్ రైలు), చంగల్‌పట్టు-కాకినాడ పోర్టు(17643) రైళ్లు.. జూన్ 26న విజయవాడ-కాకినాడ(17257), కాకినాడ పోర్టు-విజయవాడ(17258), లింగంపల్లి-విశాఖ(12806), కాకినాడ పోర్టు-చంగల్‌పట్టు(17644) రైళ్లు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.

News June 25, 2024

తాడేపల్లిగూడెం: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.

News June 25, 2024

కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు: జేసీ

image

ఏలూరు జిల్లాలో కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జేసీ బి. లావణ్యవేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టమాటా, ఉల్లి, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాటి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పుష్పమణి , జిల్లా వ్యవసాయ శాఖాధికారి హబీబ్ బాషా, ఉద్యాన శాఖ ఏడీ రామ్మోహన్ పాల్గొన్నారు.

News June 25, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు

image

పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రానుంది. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీ అంశాలను పరిశీలించనున్నారు.

News June 25, 2024

ప.గో జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులంటే..!

image

సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ప.గో జిల్లా వ్యాప్తంగా 1.067 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!

News June 25, 2024

తాడేపల్లిగూడెం: దొరకని బాలుని ఆచూకీ.!

image

తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన మణికంఠ(16) ఆదివారం ఉదయం పట్టణంలోని యాగర్లపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో పడి గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సోమవారం గాలింపు చర్యలు కొనసాగించారు. గజఈతగాళ్లు, మరబోట్లు సాయంతో కాలువలో గాలించినా ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో అధికారులు గాలింపు చర్యలు విరమించుకున్నారు. అతని ఆచూకీ ఇంకా దొరకక పోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

News June 25, 2024

జంగారెడ్డిగూడెం : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

జంగారెడ్డిగూడెంలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. పట్టణంలో రాజుల కాలనీలో ఇళ్ల మధ్య వ్యభిచార గృహం నడిపిస్తున్నారనే సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం ఎస్సై జ్యోతి బసు తన సిబ్బందితో దాడి చేశారు. ఇద్దరు విటులు , ఇద్దరు అమ్మాయిలు, ఒక నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.

News June 25, 2024

కవి ప్రసాద్‌‌కు అక్కినేని శతజయంతి పురస్కారం 

image

డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఇటీవల అక్కినేని జీవితం, నట జీవితంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్‌ సత్తా చాటారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. అక్కినేని సాంఘిక చిత్రాలు అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ బహుమతి లభించినట్లు పేర్కొన్నారు. రాబోయే సెప్టెంబర్‌లో పురస్కారం అందిస్తారని చెప్పారు.