India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు రూపొందించిన గోడ పత్రికను కలెక్టర్, టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యతోనే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన అవుతుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని గుర్తు చేశారు.
తణుకు మండలం దువ్వ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సేవ కేంద్రంలో రైతులతో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నిర్వహణ డేటా ఎంట్రీలను నిశితంగా ఆయన పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులు పెట్టే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంవర్థకం, అక్వా రంగాల క్షేత్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఆక్వారంగం అభివృద్ధిపై దృష్టి సారించామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో తెలిపారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లకు కరెంట్ ఛార్జీలపై రూ.1.50 సబ్సిడీ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. కాగా ఇదే సమస్యపై స్పీకర్గా ఉన్న రఘరామ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ‘ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఉభయ గోదావరి జిల్లాలు APకి ఆర్థికంగా కీలకం. ఈ సమస్యపై దృష్టి సారించాలని జిల్లా MLAగా కోరుతున్నా’ అని ఆయన అన్నారు.
ఉండి మండలం చెరుకువాడలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ సిటింగ్ MLC షేక్ సాబ్జీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై హోం మంత్రి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘సిటింగ్ MLC చనిపోతే ఇంతవరకు పరిహారం రాకపోవడం బాధ కలిగించింది. మైనర్ డ్రైవింగ్ చేయడంతో నోటీసులు ఇచ్చి వదిలేయాల్సి వచ్చింది. చట్టాల్లోని లోపాలు దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆలోచన చేస్తున్నాం’ అని ఆమె అన్నారు.
ప్రస్తుతం సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబరు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. వెబ్ సైట్ www.cybercrime.gov.in సందర్శించవచ్చన్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆదివారం కొవ్వూరు DSP దేవకుమార్ తెలిపారు. అతడిని రాజమండ్రి జైలుకి తరలించామన్నారు. చాగల్లు మండలం దారవరంలో మేనకోడలిపై మామ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై DSP మాట్లాడారు. సమిశ్రాగూడెంలో చదువుతున్న బాలికను దారవరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడిని అరెస్టు చేశామన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు YCP నేతలు కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఆదివారం మంత్రి దుర్గేశ్ సమక్షంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ వెంకటలక్ష్మితోపాటు ఏడుగురు కౌన్సెలర్లు జనసేనలో చేరారు. వారిలో షాకీరా బేగం, మాణిక్యమాల, జాన్ బాబు, శారదాదేవి తదితరులు ఉన్నారు. నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో పలువురు సర్పంచ్లు మంత్రి నిమ్మల సమక్షంలో TDPలో చేరిన విషయం తెలిసిందే.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయడానికి వికేంద్రీకరణ చేశామన్నారు. సోమవారం నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలన్నారు. ఈ మార్పును గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో పాటు అరాచకాలపై వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ప్రత్యేక ప్రణాళిక చేయనున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.
Sorry, no posts matched your criteria.