India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన మహ్మద్అలీ పెద్దమసీద్ కూడలిలోని ఓ దుకాణంలో రూ.400తో చికెన్ కొనుగోలుచేశాడు. ఇంటికెళ్లాక చూస్తే దుర్వాసన వచ్చింది. దీంతో షాప్కు వెళ్లి యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు వాపోయాడు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుచేయగా..తమ పరిధిలోకి రాదని చెప్పినట్లు సమాచారం. ఫుడ్ ఇన్స్పెక్టర్ ASR.రెడ్డిని వివరణకోరగా సదరు దుకాణాల్లో తనిఖీలు చేస్తామన్నారు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు నడుస్తోంది. అయితే ఈ పదవిని జనసేన తీసుకునే విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు. అదే జరిగిదే తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్కు కేటాయిస్తారని టాక్. రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లు సమాచారం.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరం వద్ద శుక్రవారం నలుగురు యువకులు గల్లంతు కాగా అందరూ చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్ర స్నానం కోసం రామాపురం వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో తేజ(17), కిశోర్(18) అదే రోజు లభ్యం కాగా.. నితిన్ (18), అమల్ రాజు (18) మృతదేహాలు తాజాగా తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ మేరకు కేసు నమోదైంది.
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఎల్టీసీ సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషనర్ కోర్సులో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన వారు, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. చివరి తేదీ 28-06-2024.
➤ ప.గో కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టెక్నికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్గా ఉన్న సి.నాగారాణి కలెక్టర్గా రానున్నారు. సుమిత్ను చిత్తూరు కలెక్టర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
➤ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉన్న వెట్రీ సెల్వీ ఏలూరు కలెక్టర్గా రానున్నారు.
యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన శనివారం తాళ్లపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వీరన్నస్వామి(26) రాజమండ్రిలోని దివాన్ చెరువు నుంచి వచ్చి తాళ్లపూడిలోని ఓ హోటల్లో మాస్టర్గా పని చేస్తున్నాడు. కారణమేంటో తెలియదు గానీ వీరన్న సూసైడ్ చేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కొవ్వూరు తరలించినట్లు ఎస్సై శ్యామ్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో అనేక పనులు చేపట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సైతం పూర్తిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. కాగా ఉమ్మడి ప.గో. జిల్లా సహా.. రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఎదురుచూస్తున్న వేళ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆచంట MLAగా పితాని సత్యనారాయణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ను కలిసి కరచాలనం చేశారు. శుక్రవారం అనివార్య కారణాల వల్ల పితాని అసెంబ్లీకి వెళ్లని విషయం తెలిసిందే.
అసెంబ్లీలో ఆచంట ఎమ్మెల్యేగా పితాని సత్యనారాయణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా శుక్రవారం ఆయన అనివార్య కారణాలతో అసెంబ్లీకి రాని విషయం తెలిసిందే. ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేలలో 14 మంది నిన్న ప్రమాణస్వీకారం చేశారు.
పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పరిధిలోని చించినాడ కాలువ కల్వర్టు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన గీతావాణి(23) పెనుగొండలో MBA చదువుతోంది. ఈమెకు రెండేళ్ల క్రితమే వివాహం కాగా.. పరీక్షల కోసం వారం క్రితం పుట్టిల్లు మార్టేరులోని శివరావుపేటకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు బైక్పై వెళ్తుండగా లారీని ఢీ కొని చనిపోయింది.
Sorry, no posts matched your criteria.