India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ పై శ్రావణమాసం ఎఫెక్ట్ పడుతోంది. అయితే జిల్లాలో పలుచోట్ల ధరలు తగ్గితే .. కొన్నిచోట్ల మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కాగా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ ఫారం మాంసం రూ. 200గా ఉంది, బ్రాయిలర్ రూ. 220 ఉంది. అయితే కార్తీకమాసం కావడంతో వినియోగదారులు తక్కువగా ఉన్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతంలో 1,123 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
చాగల్లుకు చెందిన బాలిక(14)పై వరుసకు మేనమామ అయే కమల్(22) అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం..బాలిక సమిశ్రగూడెం ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లో చదువుకుంటోంది. ఆధార్లో మార్పులు చేయడానికి తాడేపల్లిగూడెం వాసి కమల్ను బాలిక అమ్మమ్మ పంపింది. అతను తీసుకొచ్చి అత్యాచారం చేసి వాళ్ల ఇంట్లో అప్పగించాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
జైల్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా టౌన్ లోని సబ్ జైల్ను ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఆర్. వరలక్ష్మి శనివారం పర్యవేక్షించి నిందితుల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు తదితర విషయాలను ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాదారులు జైల్ ముద్దాయిలకు అందించే న్యాయ సహాయంపై న్యాయమూర్తి ఆరా తీశారు.
ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ను జంగారెడ్డిగూడెం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతను గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే అదే సమయంలో JRGలోని వేలురుపాడు పోలీస్ స్టేషన్లో అతనిపై మరోకేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు రాజమండ్రి నుంచి రెండురోజుల కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లా స్ఫూర్తి భవనంలో శుక్రవారం కొల్లేరు పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్గా మారే ప్రమాదం ఉందని, విద్యుత్తు ఉత్పత్తిలో ఆటకం ఏర్పడుతుందన్నారు. రుషికొండ కట్టడాల్ని పర్యాటకరంగానికి వినియోగిస్తే ఆదాయం వస్తుందన్నారు.
నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్ గంగుల వెంకటలక్ష్మితో పాటు మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు వైసీపీ శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు విధానాలు వ్యతిరేకిస్తూ తామంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కౌన్సిల్లో మొత్తం 28 మంది సభ్యులకు గాను 27 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా 11 మంది రాజీనామా చేశారు.
ప.గో.జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మూడుసార్లు తుఫాన్లు వచ్చాయని.. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అధికారులు సంబంధిత ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువలు ద్వారా 4,03,001 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.
Sorry, no posts matched your criteria.