WestGodavari

News June 22, 2024

విహారయాత్ర విషాద ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని దిగ్భ్రాంతి

image

బాపట్లలో జరిగిన విహారయాత్ర విషాద ఘటనపై ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుగ్గిరాల నుంచి 11 మంది యువకులు రామాపురం బీచ్‌‌కు విహార యాత్రకు వెళ్లగా నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే.

News June 21, 2024

పశ్చిమగోదావరి జిల్లాకు వర్ష సూచన

image

ద్రోణి ప్రభావంతో శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

News June 21, 2024

విషాదం.. బీచ్‌లో ఏలూరు జిల్లా యువకుల గల్లంతు

image

బాపట్ల జిల్లాలో విషాదఘటన చోటు చేసుకుంది. రామాపురం బీచ్‌‌లో నలుగురు యువకులు స్నానానికి సముద్రంలో దిగగా అలల ఉద్ధృతికి వారంతా కొట్టుకుపోయారు. వారిలో తేజ (21), కిశోర్‌(22) మృతదేహాలు సముద్రతీరానికి కొట్టుకువచ్చాయి. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు సహాయంతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 21, 2024

పక్కపక్కనే కూర్చున్న రఘురామ.. అయ్యన్న

image

అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పక్కపక్కనే కూర్చున్నారు. అయ్యన్నకు స్పీకర్ పదవి ఖరారవ్వగా.. ఆ పదవికి రఘురామ పేరు కూడా వినబడేది. కాగా.. వైసీపీపై వీరిద్దరూ తమదైన శైలీలో ఆరోపణలు చేసేవారు. ఈరోజు అసెంబ్లీలో పక్కపక్కనే కూర్చున్న వీరిద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

News June 21, 2024

ప.గో.: 329 మంది హాజరు

image

పశ్చిమగోదావరి జిల్లాలోని మహాత్మాజ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపల్, కన్వీనర్ శైలజ తెలిపారు. మొత్తం 434 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 329 మంది హాజరయ్యారని, 105 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

News June 21, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పోలవరం ఎమ్మెల్యే

image

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు.

News June 20, 2024

అధైర్యపడొద్దని చెప్పారు: తానేటి వనిత

image

జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై నేతలెవరూ అధైర్యపడొద్దని సూచించినట్లు మాజీ మంత్రి తానేటి వనిత చెప్పారు. గెలుపోటములు సహజమేనని, మన ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేశామని చెప్పినట్లు వివరించారు. వైసీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అని, ప్రజా సమస్యలపై పోరాటానికి నేతలందరూ సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రతిఒక్కరూ పని చేయాలని చెప్పారన్నారు.

News June 20, 2024

పవన్ కళ్యాణ్‌ను కలిసిన రెడ్డి అప్పలనాయుడు

image

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గురువారం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News June 20, 2024

ప.గో: చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు

image

ప.గో జిల్లాలో టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. నెల రోజుల నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. అదే రైతుబజారులో అయితే రూ.66 ఉంది. ఆయా చోట్ల వర్షాలతో పంట నష్టం జరిగిందని అందుకు ఉత్పత్తి తగ్గి ఉన్న సరకుకి మంచి డిమాండ్‌ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.

News June 20, 2024

వైద్య సేవలు నాణ్యంగా ఉండాలి: కలెక్టర్ సుమిత్

image

చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందించే సేవలు నాణ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బుధవారం భీమవరం కలక్టరేట్‌లో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి, సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లతో క్షేత్రస్థాయిలో వారు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు.