India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లాలో నిబంధనలు మీరి డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా స్థాయి రహదారుల భద్రత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాహనం నడిపేటప్పుడు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రూల్స్ పాటించుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం పలుచోట్ల మూవీ షూటింగుల సందడి చోటుచేసుకుంది. ఏలూరు నగరంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ జరుగుతుంది. అలాగే జంగారెడ్డిగూడెంలో నూతన నటీనటులతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అలాగే అత్తిలి మండలం గుమ్మంపాడు- ఎర్రనీలిగుంట రోడ్డులో మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది.
మృతదేహం ఓ ఇంటికి పార్శిల్ పంపిన ఘటన కలకలం రేపింది. పాలకోడేరులోని గరగపర్రు గ్రామానికి చెందిన తులసి ఆర్థిక స్థితి బాగుండకపోవడంతో ఓ ఫౌండేషన్ ఆమెకు పంపాల్సిన నిత్యవసరాలు, యండగండిలోని ఆమె తండ్రి అడ్రస్కు పంపేవారు. ఈ నేపథ్యంలో గురువారం తండ్రికి అందిన పార్శిల్లో ఓ వ్యక్తి డెడ్బాడీ రావడం భయభ్రాంతులకు గురిచేసింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప.గో వెస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపికకు డిసెంబర్ 21న ఎన్నికలను నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు పా.గో నుంచి -14 DCలు, తూ.గో నుంచి- 2 DCలు, ఏలూరు జిల్లా నుంచి- 4 DCలకు ఎన్నిక ఉంటుందన్నారు.
ప.గో జిల్లాలో 900 పశువుల షెడ్ల నిర్మాణం కోసం రూ.18.40 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేవలం 50 షెడ్లు నిర్మాణం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం మండలంలో 64 షెడ్లు మంజూరు కాగా, తణుకు 57, పాలకొల్లు 53, నరసాపురం 51, యలమంచిలి 50, ఆకివీడు 36, పెనుగొండ 37, పెనుమంట్ర 41, ఆచంట 44, పెంటపాడు 44, ఇరగవరం 44 ఉన్నాయన్నారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
జిల్లాలో ఆధార్ ప్రత్యేక క్యాంపులను వినియోగించుకొని అంగన్వాడి పిల్లల ఆధార్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 25 వేల ఆధార్లను నమోదు చేయాల్సి ఉండగా తక్కువ మొత్తంలో నమోదు కావడంపై సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. డిసెంబరు చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లో నూరు శాతం పూర్తి పూర్తి చేయాలని హెచ్చరించారు.
PM ఫసల్ బీమా పథకంలో భాగంగా రబీ 2024-25 పంట కాలానికి సంబంధించి వరి, మొక్కజొన్నకు బీమా సౌకర్యం ఉందని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. గురువారం సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంటకు ప్రీమియం క్రింద ఎకరాకు రూ.630 చెల్లిస్తే రూ.42,000, మొక్కజొన్న ఎకరాకు రూ.540 చెల్లిస్తే రూ.36,000 బీమా వస్తుందన్నారు. డిసెంబర్ 31లోగా ప్రీమియం చెల్లించాలన్నారు.
నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో జరిగిన అశ్లీల నృత్యాలపై నిడమర్రు పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదు అయింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులు, పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నృత్యం చేసిన ఒక హిజ్రాతో పాటు మొత్తం 21 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను గురువారం ఏలూరు బారు అసోసియేషన్ హాల్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఏఎస్ ఏలూరు జిల్లా ప్రతినిధి బండి వెంకటేశ్వర రావు మాట్లాడారు. న్యాయవాదుల సమస్యలపై ఐఏఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, ఐఏఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.