India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ద్వారకాతిరుమల మండలం దొరసానివాడు గ్రామానికి చెందిన సంజయ్ కుమార్(24) ఓ పాఠశాల బస్సు డ్రైవర్. ఐదేళ్ల క్రితం నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన తేజాను లవ్మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఆదివారం తమ కుమార్తె పుట్టినరోజు కావడంతో పోతవరం వెళ్లి వేడుకలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రివేళ ఇంట్లో కొత్త బల్బ్ పెడుతుండగా సంజయ్ షాక్కు గురై చనిపోయాడు. కాగా తేజ ప్రస్తుతం గర్భిణి.
విజయవాడ రైల్వే డివిజన్లోని పలుచోట్ల ట్రాక్పనులు చేపడుతున్నందున ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్నిరైళ్లను రామవరప్పాడు వరకు నడపనున్నట్లు చెప్పారు. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే డెమో రైలును రామవరప్పాడు వరకే నడపుతామన్నారు. ఆ రైలు తిరిగి రాత్రి 8 గంటలకు రామవరప్పాడులో బయల్దేరి అర్ధరాత్రి 12గంటలకు నరసాపురం చేరుతుందన్నారు
నరసాపురానికి చెందిన నరేశ్ ఓ యాప్లో పార్ట్ టైం ఉద్యోగ ప్రకటన చూసి నిర్వాహకులను సంప్రదించాడు. యాప్లో వచ్చే ప్రచారాలు చూస్తే నగదు ఇస్తామని వారు నమ్మించారు. తొలుత నరేశ్ ఖాతాలో రూ.10వేలు జమచేశారు. ఆ తర్వాత నగదురాకపోగా నరేశ్ ప్రశ్నించాడు. కొంత నగదుచెల్లిస్తే బకాయి మొత్తం ఇస్తామని చెప్పారు. అదినమ్మి నిర్వాహకుల ఖాతాల్లో రూ.6.86లక్షల వరకు జమచేశాడు. చివరికి మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జూన్ నెల రేషన్ పంపిణీ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం లోపు రిటర్న్ స్టాక్ తీయాల్సిందిగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జులై నెల నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానంపై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కనుమూరి రఘరామకృష్ణరాజు ఫ్లెక్సీ చినిగి ఉండటం కలకలం రేపింది. MLAగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండి మండలం చినపుల్లేరు గ్రామ శివారు తల్లమ్మ చెరువు వద్ద కొందరు నేతలు RRR ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లా గణపవరంలోని చర్చిలో సోమవారం బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ చంద్రావతి తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడికి, నిడమర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) వివాహం చేస్తున్నారు. సమాచారం రావడంతో అధికారులు వెళ్లి పెళ్లిని నిలిపివేశారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చంద్రబాబు కల త్వరలోనే సఫలం కానున్నదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబుకు సోమవారం బొలిశెట్టి శ్రీనివాస్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి స్వాగతం పలికారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శన సిద్ధాంతం పాటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ నేత వలవల బాబ్జీ తదితరులు ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. టీడీపీ హాయంలోనే 72% ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ చేపట్టి ప్రాజెక్టు పనులను నిలిపివేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని మండిపడ్డారు.
సంతానం లేనివారికి ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఓ దారి చూపుతోంది. శాఖ ఆధీనంలో ఏలూరులో శిశుగృహం నిర్వహిస్తోంది. వివిధ కారణాలతో నిరాశ్రయులైన చిన్నారులను ఇక్కడ చేర్చుకొని ఆలనాపాలనా చూస్తోంది. అయితే సంతానం లేనివారెవరైనా వస్తే నిబంధనల మేరకు దత్తత ఇస్తున్నారు. గత 14 ఏళ్లలో 82 మందిని దత్తత ఇచ్చారు. www.cara.nic.inలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఐదేళ్లలోపు 8 మంది పిల్లలున్నారు.
Sorry, no posts matched your criteria.