India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా జైల్ను మంగళవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. జైల్లో ముద్దాయిలకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడుతూ ఖైదులు సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వచ్చినవారి జీవనోపాధి కోసం పోలీసు వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు.
గోపాలపురం మండలంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI సతీశ్ కుమార్ మంగళవారం తెలిపారు. SI వివరాల మేరకు..ఈ నెల 9న సదరు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. దీనిపై సోమవారం రాత్రి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రూరల్ సర్కిల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలో మహిళల కోసం నూతనంగా అభయ దళం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మహిళల కోసం 95503 51100 టోల్ ఫ్రీ వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్న సమాచారం అందుకున్న వెంటనే డయల్ 112కు సమాచారం అందించిన 10 నిమిషాల్లో పోలీసులు మీకు భద్రతను కల్పిస్తూ, మహిళలపై వేధింపులు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విద్య వల్ల ఉజ్వల భవిష్యత్తు సాధ్యం అని ఆనాడే గుర్తించిన మహనీయుడు మౌలానా ఆజాద్ నుంచి స్ఫూర్తిని పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఉమ్మడి ప.గో జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇటీవల వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. ఆమెపై చర్యలు తీసుకోవాలని ZPTCలు ZP సీఈవోకు నోటీసులు పంపారు. శుక్రవారం జరిగిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని YCP జెడ్పీటీసీలు బహిష్కరించి ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు ఉమ్మడి జిల్లా అత్యవసర సర్వసభ్య సమావేశం జరపాలని అనుకోగా..ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి ఉమ్మడి ప.గో జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం కావడంతో ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందు గ్రామంలో సమస్యలు , యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు గుమ్మరించారు. మరి వాటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో గళం వినిపిస్తారా? లేదా? మీరేమంటారు. కామెంట్ చేయండి.
ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప.గో.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ.గో.జిల్లా తిపర్రు- 2&3, ఔరంగాబాద్ రీచ్ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తిపర్రులో రూ.96.02, ఔరంగాబాద్లో రూ.229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.
కూటమి నేతల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న నిందితుడిపై శనివారం కేసు నమోదు చేశామని నరసాపురం పట్టణ సీఐ బీ.యాదగిరి తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నామాలదిన్ని వెంకట రెడ్డి కొన్నేళ్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలు మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ప్రచారం చేస్తున్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు.
➤ S.పెద్దిరాజు(HM, ఉంగుటూరు MPP స్కూల్)
➤ కూనాటి జాన్ (కైకారం జడ్పీ స్కూల్)
➤ బీఎస్ఎన్.కళ్యాణి(దెందులూరు జడ్పీ స్కూల్)
➤గుగ్గులోత్తు కృష్ణా(ఏలూరు ఇందిరా కాలనీ)
➤ బీఎల్ నరసింహ మూర్తి(వాడలి జడ్పీ హైస్కూల్)
➤ VVSS.నాగలక్ష్మి(నరసాపురం 10వ వార్డు స్కూల్)
➤ పి.పోలారావు(ఎర్రాయి చెరువు స్కూల్)
Sorry, no posts matched your criteria.