WestGodavari

News June 14, 2024

ప.గో.: అప్పట్లో ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో గత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు MLAలు మంత్రులుగా వ్యవహరించారు. 2019లో తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందిన కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ, కొవ్వూరు నుంచి MLAగా గెలిచిన తానేటి వనితకు హోంశాఖ, తణుకు MLA కారుమూరి వెంకట నాగేశ్వరరావు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా నిమ్మలకు జలవనరులు, దుర్గేశ్‌ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

ప.గో.: ఏ మంత్రికి ఏ శాఖలు అంటే..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 MLAలలో ఇద్దరికి మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. కాగా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలు, నిడదవోలు MLA కందుల దుర్గేశ్‌కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో 5.02 లక్షల లబ్ధిదారులు

image

ఎన్నికల హామీలో భాగంగా ఏప్రిల్ నుంచి పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని కూటమి ప్రకటించింది. కాగా ఏలూరు జిల్లాలో 2.68 లక్షల పెన్షన్‌దారులు, పశ్చిమగోదావరిలో 2.34 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది. మొత్తం 2 జిల్లాల్లో 5.02 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం పెన్షన్ దారులు రూ.3వేలు అందుకుంటున్నారు.

News June 14, 2024

ప.గో: పట్టు కోసం పదవులపై MLAల కన్ను

image

కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్‌, ఎంపీపీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను తమ సొంతం చేసుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం ఎవరి అస్త్రాలను వారు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 14, 2024

ప.గో: పట్టు కోసం పదవులపై MLAల కన్ను

image

కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్‌, ఎంపీపీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను తమ సొంతం చేసుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం ఎవరి అస్త్రాలను వారు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 14, 2024

70ఏళ్ల ‘పాలకొల్లు’ చరిత్రలో ‘నిమ్మల’ సరికొత్త రికార్డ్

image

70ఏళ్ల చరిత్ర గల పాలకొల్లు నియోజకవర్గంలో డా.నిమ్మల రామానాయుడు కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇక్కడ 1955 నుంచి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు నిమ్మలకు మాత్రమే ‘హ్యాట్రిక్’ ఇచ్చారు. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయణ గెలిచినా.. హ్యాట్రిక్ సాధ్యం కాలేదు. 3వసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 19లో గెలిచిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి చేపట్టారు.

News June 14, 2024

ప.గో: ముగిసిన గడువు.. ఇక చేపలే చేపలు

image

తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధ ఉత్తర్వులు రద్దుకానున్నాయి. ఏప్రిల్ 15 నుంచి దాదాపు 60 రోజుల పాటు విధించిన నిషేధాజ్ఞలు శుక్రవారం అర్ధరాత్రితో ఎత్తివేయనున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో తిరిగి బోట్ల సందడి మొదలుకానుంది. 2 నెలల పాటు వృత్తికి దూరంగా ఉన్న మత్స్యకారులు వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రంగంపై ప్రత్యేకంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 2000 మందికి మళ్లీ ఉపాధి దక్కనుంది.

News June 14, 2024

కువైట్‌లో అగ్నిప్రమాదం.. పెరవలి వాసులు మృతి

image

కువైట్‌ అగ్నిప్రమాదంలో పెరవలి వాసులు ఇద్దరు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని ఖండవల్లికి చెందిన సత్యనారాయణ(38) 12ఏళ్ల కింద, అన్నవరప్పాడుకు చెందిన ఈశ్వరుడు(40) పదేళ్ల కింద జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు. బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందడంతో గ్రామాల్లో విషాదం నెలకొంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబీకులు కన్నీరుపెడుతున్నారు.

News June 14, 2024

చంద్రబాబును కలిసిన ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేశ్ గురువారం సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిశారు.

News June 13, 2024

తణుకు: మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ.. హత్య

image

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తణుకు సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దువ్వలో గురువారం మద్యం దుకాణం వద్ద పెరవలి మండలం ముక్కామలకు చెందిన భాస్కరరావు (40), దువ్వకు చెందిన రామకృష్ణ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణ గాజు పెంకుతో భాస్కరరావును పొడిచినట్లు, దీంతో అతను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.