WestGodavari

News June 9, 2024

ప.గో: ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ పరీక్షలు

image

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూరవిద్య అనుబంధ పరీక్షలు(ఓపెన్ పరీక్షలు) ముగిశాయి. శనివారం నిర్వహించిన పదో తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 210కి 194 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరయ్యారని డీఈవో నాగమణి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షకు మొత్తం 713కి 644 మంది హాజరై 69 మంది హాజరు కాగా గైర్హాజరయ్యారు. 90.32 శాతం మంది విద్యార్థులు హాజరు అయినట్లు చెప్పారు.

News June 9, 2024

భీమవరం: అపార్ట్ మెంట్‌లో చోరీ.. కేసు నమోదు

image

పట్టణ పరిధిలో బలుమూరిలోని ఓ బహుళ అంతస్తు భవనంలో చోరీ జరిగింది. సీఐ  శ్రీనివాసు కథనం ప్రకారం.. స్థానిక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న మాలతి తన కుమారుడిని ఇంజినీరింగ్ కళాశాలలో చేర్చేందుకు ఈ నెల 1న హైదరాబాద్ వెళ్లారు. 6న తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో ఉంచిన 144 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News June 9, 2024

ప.గో జిల్లాలో కూటమికే జై కొట్టిన ఉద్యోగులు

image

ప.గో లోక్‌సభ స్థానంలో15,165 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అందులో 8,707(57..41%) ఓట్లు కూటమికి పడ్డాయి. వైసీపీకి 5,176(33.13%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 1,006(6..63%) మంది మాత్రమే ఓటు వేశారు.

News June 9, 2024

టి.నరసాపురంలో యువకుడి అదృశ్యం.. కేసు నమోదు

image

యువకుడు అదృశ్యం పై కేసు నమోదు చేసినట్లు టి.నరసాపురం ఎఎస్సై జయకుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గౌరి శంకరపురానికి చెందిన హరీశ్(27) ఈనెల 7న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిపోయాడు. ఆతని ఆచూకీ కోసం బంధువులు ఇళ్లలో వెతికినా.. ఫలితం లేకపోయింది. అతని తండ్రి వెంకట రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

News June 9, 2024

ప.గో: ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

News June 8, 2024

ప.గో: ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ కళాశాలలో ఈ నెల పది నుంచి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ నిర్వహించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ దినేశ్ శంకర్ రెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 480 సీట్లకు గాను 50 శాతం రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

News June 8, 2024

ఏలూరు: ‘కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకం’

image

జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా కలెక్టర్ చేసిన కృషి అందరికీ స్ఫూర్తి దాయకం, అభినందనీయమని జేసి లావణ్య వేణితో పాటు పలువురు రిటర్నింగ్ అధికారులు అన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏలూరులో కలెక్టర్‌కి అభినందనలు తెలిపారు. 

News June 8, 2024

ప.గో: హత్య కేసులో కొవ్వూరు వాసికి 10ఏళ్లు జైలు శిక్ష

image

కొవ్వూరుకు చెందిన చిట్టిబాబు, మహేశ్వరరావు కొండాపూర్‌కు పనికి వెళ్లారు. 2022 ఏప్రిల్ 16న చిట్టిబాబు కుమారుడు దుర్గాప్రసాద్ కొండాపూర్ రాగా మహేశ్వరరావు అతనిని తిట్టాడు. దీంతో మాటామాటా పెరిగి చిట్టిబాబు కత్తితో మహేశ్వరరావుపై దాడి చేయడంతో మహేశ్వరరావు మృతిచెందాడు. దీంతో రెండేళ్ల విచారణ అనంతరం చిట్టిబాబుకు 10ఏళ్ల జైలు, రూ.25 వేలు జరిమానా విధించినట్లు గచ్చిబౌలి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 

News June 8, 2024

ప.గో.: RRRపై ఏకైక మహిళ పోటీ.. ఓట్లు ఎన్నంటే

image

ప.గో. జిల్లాలోని ఉండి నియోజకవర్గ MLAగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది పోటీచేయగా.. అందులో మల్లిపూడి షర్మిల ఒక్కరే మహిళ. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆమెకు 1140 ఓట్లు వచ్చాయి. అయితే RRRకు 1,16,902 ఓట్లు రాగా.. 56,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

News June 8, 2024

రామోజీరావుతో మాటలు గుర్తొస్తున్నాయ్: RRR

image

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకి ఉండి నియోజకవర్గ MLA కనుమూరి రఘురామ కృష్ణరాజు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 నెలల క్రితం ఆయనతో కలిసి 2 గంటల పాటు మాట్లాడిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తొస్తున్నాయని అన్నారు. గొప్ప పట్టుదల, క్రమశిక్షణ, వ్యక్తిత్వం కోటికి ఒక్కరిలోనే ఉంటాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.