India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పని ఒత్తిడి తగ్గించాలంటూ నిడదవోలు మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డి. లక్ష్మినారాయణకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్వేలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఓ పక్క చేయాల్సిన పని, మరోపక్క వరుస వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలతో ఇబ్బందిగా ఉందని అన్నారు.
ఏలూరు జిల్లాలో జరుగుతున్న పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్డు పనులు డిసెంబర్ నాటికి పూర్తి కావాలని, 171 పనులకు సంబంధించిన బిల్లులను అప్డేట్ చేయాలని ఎంపీడీవోలకు ఆదేశించారు.
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా ప.గో. జిల్లాలో 15,612 ఏలూరు జిల్లాలో 15,573 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక AP ART సెంటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.24లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వారికి ప్రతి నెల రూ.4వేలు పింఛను అందిస్తోంది. గడిచిన ఆరు నెలల్లో 8,400 మంది కొత్త HIV కేసులు గుర్తించారు.
ఏలూరులో వివాహిత ప్రియాంక(25) <<14761231>>ఆత్మహత్యకు<<>> భర్తతో గొడవలే కారణమని తెలుస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పని చేసే శ్రీకాంత్(30) అనే వ్యక్తి తనకు గతంలో పెళ్లయిందనే విషయాన్ని దాచి ప్రియాంకను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవల ప్రియాంకకు తెలిసి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బు కోసం వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు సైతం తెలిపింది. శనివారం రాత్రి కూడా గొడవ జరగ్గా నిన్న ఆమె ఉరి వేసుకుంది.
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను సోమవారం నుంచి మండల, డివిజనల్ ,మున్సిపల్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చునన్నారు.
తన తండ్రి భూపతి రాజు సూర్యనారాయణ రాజు పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రకటించారు. భీమవరంలో తన తండ్రి సంస్మరణ సభలో శ్రీనివాస వర్మ మాట్లాడారు. తన తండ్రి వల్లే ఈ స్థాయికి చేరానని అన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.
కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులతో కళకళలాడే పేరుపాలెం బీచ్ ఆదివారం వెలవెలబోయింది. అల్పపీడనం ఎఫెక్ట్తో బీచ్లో పెద్ద పెద్ద రాకాసి అలలు వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పర్యాటకులను రావొద్దని హెచ్చరించింది. దీంతో పర్యాటకులు బీచ్కు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది.
బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప.గో జిల్లాలో ఫెంగల్ తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు నష్టపోకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలను రైతులకు జారీ చేశారు. వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకోవాలని, అలాగే ఇప్పటికే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలి అన్నారు. సమాచారం కోసం 8121676653, 18004251291 సంప్రదించవచ్చని అన్నారు.
గోపాలపురం మండలం జగన్నాథపురంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తెలిసిందే. ఎస్ఐ సతీష్ వివరాల మేరకు.. రెడ్డిగణపవరం నుంచి వాడపల్లి వెంకన్న సన్నిధికి వామిశెట్టి వెంకటేశ్వరరావ్, షేక్ బేగం(35) బైక్పై వెళ్తుండగా జగన్నాథపురంలో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా బేగం మృతి చెందారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.