WestGodavari

News November 30, 2024

పాలకోడేరు: వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి

image

అప్పు ఇచ్చి అడిగినందుకు వ్యక్తిపై మహిళ యాసిడ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన రేష్మతో పాలకోడేరుకు చెందిన బాలకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ సందర్భంలో దఫాల వారీగా 2.40 లక్షలను అప్పుగా రేష్మకు బాలకృష్ణ ఇచ్చాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగిన బాలకృష్ణపై ఈ నెల 6న మహిళ యాసిడ్ పోసిందని పాలకోడేరు SI రవివర్మ తెలిపారు. శుక్రవారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News November 30, 2024

నరసాపురం హోటళ్లలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

image

నరసాపురం పట్టణ పరిధిలోని పలు హోటళ్లను నరసాపురం మున్సిపల్ కమిషనర్‌ ఎం. అంజయ్య తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. శుక్రవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో పరిశుభ్రత, ఆహార ఉత్పత్తుల నాణ్యతతను క్షుణ్ణంగా పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని ఆయా హోటళ్ల నిర్వాహకులను హెచ్చరించారు.

News November 29, 2024

ఏలూరు జిల్లాను నెంబర్ వన్ స్థానంలో ఉంచాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ప్రణాళికల లక్ష్య సాధనపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమ, విద్యా, వైద్యం, రోడ్డు, భవనాలు తదితర శాఖలు లక్ష్యంతో పనిచేయాలన్నారు. మనం చేసే కార్యాచరణతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో ఉండాలన్నారు.

News November 29, 2024

ద్వారకాతిరుమల: డిగ్రీ చదువుతూ.. శ్రీవారి ఆలయంలో బైక్ దొంగతనాలు

image

ఏలూరులో డిగ్రీ చదువుతూ.. ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం అరెస్టు చేశామని CI విల్సన్, SI సుధీర్ బాబు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామానికి చెందిన గణేశ్ ఏలూరు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు డబ్బులు అవసరమై బైక్ దొంగతనాలు చేస్తున్నాడని, 3 బైకులు రికవరీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

News November 29, 2024

ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ

image

NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.

News November 28, 2024

ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ

image

NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.

News November 28, 2024

పగో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలి: కలెక్టర్

image

ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ మందిరంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పనతో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. రోడ్డు గుంతల పూడ్చివేత, పల్లె పండుగలో చేపట్టిన రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలన్నారు.

News November 28, 2024

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ: కలెక్టర్ వెట్రిసెల్వి

image

ఏలూరు కలెక్టరేట్‌లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్‌లు భద్రపరిచే గోడౌన్‌ను గురువారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. గోదాం తాళాలు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపకదళ పరికరాలను పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్‌ను పరిశీలించి సంతకం చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News November 28, 2024

వాటికి అనుమతులు తప్పనిసరి: ప.గో DMHO

image

ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, ఫిజియోథెరఫీ సెంటర్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్‌లు నిర్వహించడం నేరమని ప.గో జిల్లా DMHO డి.మహేశ్వరరావు హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్నీ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద పరీక్షల ఫీజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News November 28, 2024

ఓ రూముకు నా పేరు పెట్టి బెదిరిస్తున్నారు: RRR

image

తనను వేధించిన వాళ్లంతా జైలుకు వెళ్లడం వాళ్లు చేసుకున్న కర్మేనని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు(RRR) పేర్కొన్నారు. ‘ముసుగు వేసుకుని మరీ నన్ను కొట్టారు. ఆరోజు నా ఛాతీపై బరువైన వ్యక్తి కూర్చోవడంతో మంచం కోళ్లు కూడా విరిగిపోయాయి. నన్ను ఏ రూములో అయితే కొట్టారో దానికి RRR పేరు పెట్టారు. ఆ తర్వాత ఆ రూములోకి ఎంతోమందిని తీసుకెళ్లి బెదిరించి దందాలు చేశారు’ అని RRR చెప్పారు.