India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి నుంచి బరిలో నిలిచిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ భారీ విజయం సాధించారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా ఆయన ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు డా.కృష్ణ కాంత్ పాఠక్, ఎస్ఏ రామన్ పాల్గొన్నారు.
నరసాపురం పార్లమెంట్ ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ MPగా ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేశారు. కాగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నరసాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ విజయం సాధించారు. మొత్తం ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. 2,76,802 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక వైసీపీ నుంచి బరిలో నిలిచిన గూడూరి ఉమాబాలకు 4,30,541 ఓట్లు వచ్చాయి.
ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. ఉమ్మడి జిల్లాలోని 15 స్థానాల్లో అన్నిచోట్ల విజయ దుందుభి మోగించారు. జనసేన 6 చోట్ల (నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరు, నరసాపురం, పోలవరం) టీడీపీ 9 చోట్ల పోటీచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 చోట్ల గెలుపొందింది.
– SHARE IT
నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కందుల దుర్గేశ్ విజయం సాధించారు. మొత్తం 102699 ఓట్లు సాధించగా.. 33304 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ప్రత్యర్థి జి.శ్రీనివాస నాయుడుకు 69395 ఓట్లు వచ్చాయి. ఇక ఈ విజయంతో ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 13 కైవసం చేసుకున్నట్లయింది. ఇంకా పోలవరం, దెందులూరు ఫలితాలు రావాలి.
ప.గో. జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 72121 భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో రాష్ట్రంలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. ఆరిమిల్లికి మొత్తం ఓట్లు 1,29,547 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి బరిలో నిలిచిన కారుమూరి వెంకట నాగేశ్వర రావుకు 57426 ఓట్లు వచ్చాయి.
ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఘన విజయం సాధించారు. 44,107 ఓట్లతో ప్రత్యర్థి వాసుబాబుపై గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 12 చోట్ల గెలిచినట్లయింది. ఇక పోలవరం, దెందులూరు, నిడదవోలు ఫలితాలు రావల్సి ఉంది.
ఉమ్మడి ప.గో. జిల్లాలో మొత్తం 15 స్థానాలకు గాను ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో 11 చోట్ల ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో ఫలితం రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ 13 చోట్ల వైసీపీ విజయం సాధించగా.. 2 చోట్ల టీడీపీ పాగా వేసింది. మరి ఈ సారి కూటమి మరో 4 చోట్ల గెలిస్తే క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. పోలవరంలో కొద్దిగా పోటాపోటీ నడుస్తోంది.
– మీ కామెంట్..?
ప.గో. జిల్లాలోని 15 స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 11 మంది విజయం సాధించారు. మరో నాలుగు స్థానాలు (దెందులూరు, నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు)లో ఫలితం తేలాల్సి ఉంది. వీటిల్లో పోలవరం ఒక చోటనే వైసీపీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా.. మిగతా 3 చోట్లా కూటమే ముందంజలో ఉంది.
ప.గో. జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. జిల్లాలోని 15 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తోంది. ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో విజయ కేతనం ఎగరేయగా.. తాజాగా ఆచంట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ 84429 ఓట్లు సాధించి 26076 మెజారిటీ సాధించారు.
Sorry, no posts matched your criteria.