India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లాలో కూటమి దూసుకుపోతుంది. జిల్లాలోని 15 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తోంది. ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో విజయ కేతనం ఎగరేయగా.. తాజాగా ఆచంట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ 84429 ఓట్లు సాధించి 26076 మెజారిటీ సాధించారు.
ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు ఎవ్వరూ తగ్గట్లేదు. మొత్తం 15 సీట్లలో ఉండి, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు, నరసాపురం స్థానాల్లో పాగా వేశారు. తాజాగా తాడేపల్లి గూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 114955 ఓట్లు సాధించి 61510 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు కైవసం చేసుకున్నారు.
ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. మొత్తం 15 సీట్లలో ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు స్థానాల్లో పాగా వేయగా.. నరసాపురంలోనూ జనసేన అభ్యర్థి 49096 భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడిలో విజయం సాధించగా.. తాజాగా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71059 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరులో విజయం సాధించగా.. తాజాగా చింతలపూడిలో కూటమి అభ్యర్థి సొంగారోషన్ 26972 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
భీమవరంలో కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 64037 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లో ఇప్పటివరకు కొవ్వూరు, పాలకొల్లులో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రులుగా సేవలందించారు. కాగా తాజాగా ముగ్గురు ఓటమి దిశగా వెళ్తుండగా.. కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది.
పోలవరంలో వైసీపీ, జనసేన మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. మొదటి 4 రౌండ్ల వరకు వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. అప్పటి నుంచి 8 రౌండ్ల వరకు జనసేన దూసుకెళ్లింది. తాజాగా 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి 45777 ఓట్లు సాధించి 453 ఓట్ల మెజారిటీతో ముందున్నారు.
ఉండి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా.. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. కాగా కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు 81931 ఓట్లు సాధించి 39390 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకు 42541 ఓట్లు వచ్చాయి.
కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వర రావు విజయం సాధించారు. కాగా ఇప్పడికే ప.గో. జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపొందారు.
– మిగతా 13 చోట్ల విజయం దిశగా కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.