India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేన 6 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా అన్నింటా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఒక్క పోలవరంలో తొలి 4 రౌండ్లలో వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత జనసేన పుంజుకుంది. అక్కడ ప్రస్తుతం 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. 1614 ఓట్ల మెజారిటీ నడుస్తోంది.
ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు 9 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం 62017 ఓట్లు రాగా.. 29338 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పీవీఎల్ నరసింహరాజుకు 32679 ఓట్లు వచ్చాయి.
ఉమ్మడి ప.గో. జిల్లాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్కు 1,64,291 ఓట్లు రాగా.. 42177 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. కాగా వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్కు 1,22,114 ఓట్లు వచ్చాయి. అటు నరసాపురంలో బీజేపీ అభ్యర్థి 1,98,676 ఓట్లు రాగా 72738 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి ఉమాబాలకు 1,25,938 ఓట్ల వచ్చాయి.
ఆచంట నియోజకవర్గంలో 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి MLA అభ్యర్థి పితాని సత్యనారాయణ 24895 ఓట్లు సాధించగా.. 6581 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుకు 18314 ఓట్లు వచ్చాయి.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల టీడీపీ, 5 చోట్ల జనసేన, ఒకచోట వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దాదాపు అన్నీచోట్ల 3 రౌండ్లు పూర్తయ్యాయి. పోలవరంలో వైసీపీ అభ్యర్థి లీడ్ లో ఉండగా.. అక్కడ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 62 ఓట్ల లీడ్ ఉంది.
గోపాలపురం నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజుకు మొత్తం 19588 ఓట్లు రాగా.. 4121 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తానేటి వనితకు 15467 ఓట్లు వచ్చాయి.
ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు మొత్తం 6349 ఓట్లు రాగా.. 2630 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పీవీఎల్ నరసింహరాజుకు 3719 ఓట్లు వచ్చాయి.
ప.గో. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ 2600 మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలో పోస్టల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామ కృష్ణరాజు, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, తాడేపల్లిలో బొలిశెట్టి, నరసాపురంలో బొమ్మిడి నాయకర్ ముందంజలో ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తొలిఫలితం రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో రానుంది. కాగా అమలాపురంలో ఎంపీ నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. కాగా రాజమండ్రిలో కూటమి నుంచి పురందీశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల, అటు అమలాపురంలో వైసీపీ నుంచి రాపాక శ్రీనివాస్, కూటమి నుంచి గంటి హరీష్ మాదుర్ బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.