India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నరసాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. 1వ రౌండ్లో కె.బేతపూడి, మల్లవరం, సరిపల్లి, చినమామిడిపల్లి, చిట్టవరం, గొంది, పాతనవరసపురం, కొత్తనవరసపురం, నరసాపురం వలందరరేవు ప్రాంతం ఓట్లు లెక్కించనున్నారు. పోస్టల్
బ్యాలెట్ల లెక్కింపునకు 4 టేబుళ్లు, పోలింగ్ బూత్ల వారీగా
169 ఈవీఎంలలో ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్లు ఏర్పాటుచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండటంతో ఇక్కడే త్వరగా ఫలితం వెల్లడికానుంది. రంపచోడవరం ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం ఎంపీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం వెల్లడి కానుండగా.. అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏలూరు కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్ జిల్లాలో రేపు లోకల్ హాలిడే ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు, అల్లర్లకు తావు లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని.. ఎదుటి పార్టీపై కవ్వింపు చర్యలు, దుష్ప్రచారాలు చేస్తే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉమ్మడి ప.గో.లోని 15 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తోందో ‘RTV’ సర్వే చేసింది. ఆచంట-పితాని, ఉండి-రఘురామ, తాడేపల్లిగూడెం-బొలిశెట్టి, నరసాపురం- నాయకర్, దెందులూరు-అబ్బయ్య చౌదరి, తణుకు-ఆరిమిల్లి, ఏలూరు-బడేటి చంటి, చింతలపూడి-కంభం విజయరాజు, పోలవరం-రాజ్యలక్ష్మి, కొవ్వూరు-ముప్పిడి, నిడదవోలు-కందుల, గోపాలపురం-రాజ్యలక్ష్మి, భీమవరం-రామాంజనేయులు, ఉంగుటూరు-వాసుబాబు, పాలకొల్లు-నిమ్మల గెలుస్తారని అంచనా వేసింది.
జూన్ 4వ తేదీ సాయంత్రానికి జగనన్న 2.0 సిద్ధమని దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైసీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయన్నారు. ఇక సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన సత్య (30) విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ప.గో. జిల్లా కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, భార్య సత్య, కుమార్తె రాధాప్రియ, కుమారుడు రాకేష్, బంధువు గోపితో కలిసి కారులో వెళ్తూ లారీని ఢీ కొట్టి ట్రాలీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
☛ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో దెందులూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరులో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసుల అంచనా.
☛ ఉమ్మడి ప.గో.లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు.
☛ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – SPలు మేరీ ప్రశాంతి, అజిత
☛ ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బంది
☛ ఏలూరులో 42 అతిసమస్యాత్మక, 92 సమస్యాత్మక, ప.గో.లో అతిసమస్యాత్మక 22, సమస్యాత్మక 135 ప్రాంతాల గుర్తింపు.
➤ SHARE IT
పశ్చిమ గోదావరి జిల్లాలో పండుగప్ప చేపలకు ధర లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. 4 నెలల క్రితం పండుగప్ప కేజీ 580 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.380కి పడిపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. చేపల చెరువుల రైతులు అధికంగా పండుగప్ప జాతి చేపలను పెంచేందుకు ఆసక్తి చూపుతారు. దళారుల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
విధులకు హాజరయ్యే సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్కు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఏలూరులో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో ఆదివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దన్నారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. దీంతో మద్యం బాబులకు టెన్షన్ పట్టుకుంది. సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేస్తుండటంతో ఆదివారమే మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు ఎగబడ్డారు. మరోవైపు లిక్కర్ మాల్స్ వద్ద మద్యం నిల్వలు నిండుకున్నాయి.
Sorry, no posts matched your criteria.