India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఉమ్మడి జిల్లాలో కూటమికి 12 వస్తాయని, కేకే సంస్థ టీడీపీ-9, జనసేన-6 గెలుస్తాయని ఫలితాలు విడుదల చేశాయి. కాగా తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఏదేమైనప్పటికీ ఫలితాల కోసం మరో 3 రోజులు వెయిట్ చేయాల్సిందే.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరికి సంబంధించి KK సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 15 స్థానాలకు గానూ టీడీపీ- 09, జనసేన- 6 గెలుస్తాయని తెలిపింది. వైసీపీ ఏ ఒక్కచోటా గెలవదని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి
– మీ కామెంట్..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. మొత్తం 15 స్థానాలకు గాను కూటమికి 12, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుండగా..ఒకచోట టఫ్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
– మీ కామెంట్ ఏంటి..?
కూటమి పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ బరిలో నిలిచిన భూపతిరాజు శ్రీనివాస శర్మ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన రఘురామకృష్ణరాజు సునాయాసంగా విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. 4వ తేదీన సాయంత్రం 5గంటల లోపు పూర్తి ఫలితాలు వెల్లడించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మొత్తం 16 నుంచి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో అసెంబ్లీకి 14 టేబుల్స్ చొప్పున, అసెంబ్లీ, ఎంపీకి కలిపి 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు జిల్లా ఆదివారపుపేట మసీదు రోడ్డు ప్రాంతానికి చెందిన షేక్ రెహమాన్(21) మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మరణించగా.. అమ్మమ్మ వద్ద ఉంటూ నగరంలోని ఓ షోరూంలో మెకానిక్గా పనిచేసేవాడు. కొద్ది నెలల కిందట అమ్మమ్మ సైతం మృతి చెందడంతో ఒంటరిగా మారి మానసిక ఆందోళనకు గురయ్యాడు. జీవితంపై విరక్తితో రెహమాన్ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీంతో అటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజల్లోరూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్కు, పోలింగ్కు మధ్య సుమారు 20 రోజులకుపైగా వ్యవధి ఉండటంతో జిల్లాలో పొలిటికల్ ఫీవర్ కొనసాగుతుంది. మరో వైపు జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఎన్నికల ఫలితాల కోసం ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ముసునూరు మండలానికి చెందిన వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్లు SI వాసు తెలిపారు. సదరు వ్యక్తిపై SC, ST కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సూరేపల్లికి చెందిన చెన్నకేశవరావు కొన్నేళ్లుగా మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. గత నెల 29న ఉదయం ఆమె గేదెలు మేపేందుకు పొలాల వైపు వెళ్లగా.. అక్కడ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కులం పేరుతో దూషించాడు. మహిళ వెళ్లి భర్తకు విషయం చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
APSRTC ప.గో.జిల్లా ప్రజారవాణ అధికారిగా ఎన్వీఆర్ వరప్రసాద్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న వీరయ్య చౌదరి పదవీవిరమణ చేయడంతో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా పనిచేస్తున్న వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్యచౌదరికి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
Sorry, no posts matched your criteria.