India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొవ్వూరుకు చెందిన యువతిని ప్రేమపేరిట మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వం తెలిపారు. తల్లి తెలిపిన వివరాలు.. యువతి అమ్మమ్మ ఊరు కడియపులంకకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సతీశ్ ప్రేమిస్తున్నాని గర్భవతిని చేసి కడుపు తీయించేశాడు. యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయగా ముఖం చాటేసినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, యువతిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సీఎం చంద్రబాబు, DY CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్పై అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన యువకుడు అరెస్ట్ అయిన ఘటన ఉమ్మడి ప.గో జిల్లాలో వెలుగు చూసింది. గోపాలపురం SI సతీశ్ కుమార్ వివరాల ప్రకారం.. రంగంపేట మండలానికి చెందిన వీరాబత్తుల చంద్రశేఖర్ సోషల్ మీడియాలో సీఎం, పవన్, ఇతర మంత్రుల
ఫొటోలు మార్ఫింగ్ చేశాడు. పార్టీల మధ్య విభేదాలు, కార్యకర్తల మధ్య గొడవలు వచ్చేలా పోస్టులు పెట్టడంతో గురువారం అరెస్ట్ చేశారు.

భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా SP అద్నాన్ నయీం అస్మితో కలిసి కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. 2027లో గోదావరి పుష్కరాలు రానున్నాయని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముందు నుంచే పక్కా ప్రణాళికతో ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రధానంగా 33 పుష్కర ఘాట్లు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించి నివేదికలను సమర్పించాలన్నారు.

*భీమవరం మాజీ MLA ఇంట్లో ఐటీ సోదాలు
*జీలుగుమిల్లి: అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇల్లు
*తణుకు: 20 మద్యం బాటిళ్లు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు
*కొవ్వూరు: సీఎం సహాయనిధికి రూ.90 లక్షల అందజేత
*ఏలూరు: ‘అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ సిలిండర్’
*భీమవరం: వెంకన్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్
*తాడేపల్లిగూడెం హైవేపై రోడ్డు ప్రమాదం
*కడప జిల్లాలో ప.గో వ్యక్తి దారుణ హత్య

ఏలూరు ARDGK విద్యార్థులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కీర్తన, పావని గోల్డ్ మెడల్ సాధించగా.. హారిక రెడ్డి రజత పతకం, పవిత్ర, మేఘన, నిహారిక కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారని ప్రధానోపాధ్యాయురాలు ఉజ్వల గురువారం తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం విజయ్ కుమార్, సోషల్ వర్కర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

ప.గో.జిల్లాలో 22 రైతు సేవా కేంద్రాల ద్వారా 128 మంది రైతుల నుంచి 11,770 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత సీజన్లో కనీస మద్దతు ధర క్వింటాల్ సాధారణ రకం రూ.2,300, గ్రేడ్-ఏ రకం రూ.2,320 చొప్పున నిర్ణయించినట్లు చెప్పారు. ధాన్యం విక్రయాలకు సంబంధించి సమస్యలుంటే కంట్రోల్ రూం 8121676653కు ఫోన్ చేయాలన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కడప జిల్లాలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పెనుమంట్ర మండలం బొక్కావారిపాలెంకు చెందిన వెంకటనారాయణ(40) కొద్ది రోజుల నుంచి రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడులో ఉంటూ, టైల్స్ వేసేపని చేస్తూ ఉండేవాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఉండ్రాజవరం మండలంలో వారం వ్యవధిలో జరిగిన మూడు ప్రమాదాల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. సూర్యరావుపాలెంలో గత నెల 30న జరిగిన భారీ విస్ఫోటనం ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, ఈనెల 4న తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి మరో నలుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు దీపావళి రోజున వెలగదుర్రులో టపాసులు కారుతుండగా మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్ధానానికి ఉపఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమిస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, మండల స్ధాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు. 43 ప్రత్యేక వీడియో బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

*చింతలపూడి: మంత్రి పార్థసారథితో కూటమి నేతలు భేటి
*గోపాలపురం: ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు
*ఏలూరు: రైల్వే లైన్ పూర్తి చేయాలని మంత్రి విజ్ఞప్తి
*పెనుగొండ: 25 కాసుల బంగారం చోరీ
*భీమవరం మాజీ MLA ఇంట్లో సోదాలు
*ఉండ్రాజవరం: ఏడుకు చేరిన మృతుల సంఖ్య
*ద్వారకా తిరుమల కొండపై కారు- బస్సు ఢీ
*నిడదవోలులో LIC ఏజెంట్ల ధర్నా
*ఏలూరు: సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
*కొయ్యలగూడెం: ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
Sorry, no posts matched your criteria.