India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసాపురం- గుంటూరు మధ్య 17282 నంబర్తో నడిచే ఫాస్ట్ పాసెంజర్ రైలును జూన్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ రైలు గుంటూరు వరకు వెళ్లదని విజయవాడ వరకే మాత్రమే వెళ్తుందన్నారు. రైలు ఉదయం 6:05 గంటలకు నరసాపురంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటుందన్నారు. 17281 నంబర్తో ఇదే రైలు సాయంత్రం 6:50కి విజయవాడలో బయలుదేరి రాత్రి 10:30కు నరసాపురం చేరనుందన్నారు.
తమిళనాడులో భారీవర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందటి వరకు 75 కేజీల బస్తా రూ.100- 150 పలకగా, ప్రస్తుతం రూ.200 దాటింది. ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాల్లో ఉప్పు తయారీచేస్తున్నారు. గతంలో ఎకరాకు 800- 900 బస్తాల దిగుబడి వస్తుండగా, ఈ సారి 1,300 నుంచి 1,400 వరకు వస్తోంది. పెరగడంతో దాదాపు 7వేల మంది రైతులు, 10 వేలకు పైగా కూలీలకు లబ్ది చేకూరుతుంది.
ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దేవరగోపవరానికి చెందిన కేశన మీనాక్షి డీసెట్ భౌతికశాస్త్ర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం పామర్రులో ప్రగతి మహిళా అకాడమీలో డిగ్రీ చదువుతుంది. తండ్రి సూర్యచంద్రరావు వ్యవసాయ కూలీ, తల్లి సునీత గృహిణి. శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జడ్పీ ఉన్నత పాఠశాల పెదనిండ్రకొలను హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. – CONGRATS మీనాక్షి.
ప.గో జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో 216వ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. బైక్ను కారు ఢీకొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. 216వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం పాలకొల్లు వైపు నుంచి నరసాపురం వైపు వెళ్తున్న దంపతుల బైక్ను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులకు గాయాలు కాగా.. స్థానికులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరులోని బీసీ స్టడీ సర్కిల్లో జూన్ 1 నుంచి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారిణి నాగరాణి తెలిపారు. గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనన్నట్లు వివరించారు. జూలై 28వ తేదీన జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంక్షలు విధించిన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ప.గో SP అజిత వేజెండ్ల హెచ్చరించారు. పోలింగ్ తర్వాత SRKR, విష్ణు ఇంజినీరింగ్ కళాశాలల్లో EVMలు, వీవీప్యాట్స్ భద్రపర్చినందున ఆ ప్రాంతాల్లో డ్రోన్స్, బెలూన్స్, ఇతరత్రా ఎగురవేయరాదన్నారు. ఈ కళాశాలల పరిసర ప్రాంతాలను జూన్ 5 వరకు నో ఫ్లై జోన్స్గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్కు అందరూ సహకరించాలని కోరారు.
ఏలూరు: ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణ సాధించి మెయిన్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వెల్లడించారు. ఏలూరు బీసీ స్టడి సర్కిల్లోని అంబేద్కర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో జూన్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ మసుమ్ బాషా హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో టపాసులు, పెట్రోల్ బంకు యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో టపాసులు కాల్చడానికి పర్మిషన్ లేదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాటిళ్లలో పెట్రోల్ నింపరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీ మూర్తి, సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. 7,058 మంది విద్యార్థులకు గాను 4,310 మంది హాజరయ్యారు. 2,748 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్వి.రమణ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని అన్నారు.
పాల ప్యాకెట్ కోసం బైక్పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.