WestGodavari

News November 6, 2024

ఏలూరు: జిల్లా సిబ్బందితో ఎస్పీ నేర సమీక్ష సమావేశం

image

ఏలూరు జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది తో బుధవారం జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్టేషన్‌లలో నమోదు చేసిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా జిల్లా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే విచారణ చేయాలని చెప్పారు. పోలీసు అధికారులు ప్రతి గ్రామాన్ని ప్రణాళిక బద్ధంగా సందర్శించాలని, ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిని పరిష్కరించాలని సూచించారు.

News November 6, 2024

ఉండి: ట్రైనింగ్‌లో కుప్పకూలి టీచర్ మృతి

image

టీచర్ ఆకస్మికంగా మృతిచెందిన ఘటన ప.గో జిల్లాలో జరిగింది. ఉండి మండలం ఉనుదుర్రు హైస్కూల్ ఇన్‌ఛార్జ్ HM తోట రత్నకుమార్ ఆగిరిపల్లి హీల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న లీడర్షిప్ శిక్షణకు హాజరయ్యారు. ఈక్రమంలో అక్కడ బుధవారం ఉదయం గుండె నొప్పి రావడంతో చనిపోయారు. తీవ్రమైన ఒత్తిడి, వైద్య సదుపాయాలు లేని అటవీ ప్రాంతంలో శిక్షణ ఇవ్వడంతోనే రత్నకుమార్ చనిపోయారని ఇతర టీచర్లు ఆరోపించారు.

News November 6, 2024

ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

image

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 11వ తేదీ నుంచి అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తెలిపారు. ఈనెల 18 నామినేషన్ చివరి తేదీ అని, 19న పరిశీలన, 21న ఉప సవరణ చివరి తేదీ అని అన్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిసెంబర్ 9వ తేదీన లెక్కింపు జరుగుతుందని తెలిపారు.

News November 6, 2024

ప.గో: TODAY TOP NEWS

image

* సీఎం చంద్రబాబును కలిసిన మాజీ MLA శేషారావు
*ఉండ్రాజవరం: 6కు చేరిన మృతుల సంఖ్య
*JRG: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
*ఏలూరు: 7న జరగాల్సిన జాబ్ మేళా రద్దు
*చింతలపూడి: 515.160 M.T ధాన్యం కోనుగోలు
*దేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
*జగన్నాథపురంలో కొబ్బరి చెట్టు ఎక్కిన త్రాచుపాము
*తణుకు: మద్యం మత్తులో హత్య.. వీడిన మిస్టరీ
*మంత్రి లోకేశ్‌తో ఉండి ఎమ్మెల్యే భేటీ

News November 5, 2024

ఏలూరు: ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్

image

ఏలూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ద్విచక్రవాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ క్రమంలో పూతి ప్రసాద్ , అప్పల నాయుడు, నాగాంజనేయులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.17,50,000 విలువ గల 25 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News November 5, 2024

ప.గో: పేలుడు ఘటనలో మరొకరు మృతి

image

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో గత నెల 30న జరిగిన బాణసంచా తయారీ కేంద్రంలోని పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన మందలంక కమలరత్నం(47) ఏలూరులో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో అదే రోజు ఇద్దరు మృతిచెందగా.. అనంతరం మరొకరు ప్రాణాలు విడిచారు. రత్నం మృతితో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. 

News November 5, 2024

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక

image

ఈనెల 18 నుంచి 22 వరకు ఛత్తీస్ ఘడ్ రాష్టంలోని రాజనందిగంలో జరుగు 68వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాల బాలికల పోటీలకు పశ్చిమ గోదావరి నుంచి ఇద్దరు ఎంపిక అయ్యారు. ఏలూరు కస్తూరిబా మున్సిపల్ పాఠశాలకు చెందిన ఎం.యోగశ్రీ, దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలకు చెందిన చార్లెస్ వెస్లీ ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అభినందించారు.

News November 5, 2024

తణుకులో హత్య.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు?

image

తణుకులో పాఠశాల ఆవరణలో ఈ నెల 1న జరిగిన హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యకు గురైన కాకర్ల దుర్గారావుతోపాటు నిందితుడు కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో దుర్గారావుపై దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

News November 5, 2024

ఏలూరు జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

image

వినియోగదారులకు స్థిరమైన ధరలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సూచనలను జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆయిల్, పప్పుధాన్యాలు, చక్కెర అసోసియేషన్, ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి, జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

News November 4, 2024

రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమంలో మంజూరుచేసిన రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 213.55 కిలోమీటర్ల మేర 1080 రోడ్ల నిర్మాణ పనులను మంజూరు చేశామన్నారు.