WestGodavari

News May 30, 2024

ప.గో: విషాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి మృత్యువాత

image

పాల ప్యాకెట్ కోసం బైక్‌పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప.గో: ‘నేను గెలుస్తానా..? లేదా..? చెప్పండి’

image

జూన్ 4 కోసం అభ్యర్థులు, ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్‌కు మరో 4రోజులే గడువు ఉండగా ఉమ్మడి ప.గో జిల్లాలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన అభ్యర్థులు, నేతలు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఎవరికి వారు సర్వేలు చేయించుకున్నప్పటికీ ఓటరు నాడీ పట్టలేక న్యూమరాలజీ, జ్యోతిషం చెప్పవారిని ఆశ్రయిస్తున్నారు. ‘నేను గెలుస్తానా లేదా చెప్పండి’ అంటూ స్పష్టత తీసుకుంటున్నారట.

News May 30, 2024

ప.గో జిల్లాలో మాజీ సర్పంచికి జైలు శిక్ష

image

ప.గో జిల్లా ఆకివీడు మండలం దుంపగడప మాజీ సర్పంచి కవిటపు రామకృష్ణకు జైలు శిక్ష పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2018 ఫిబ్రవరి 16న రామకృష్ణ తనను కులం పేరుతో దూషించి, ఉద్యోగం తీయిస్తానంటూ బెదించినట్లు ANM ఫిర్యాదు చేయగా, అప్పటి SI సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అనేక వాయిదాలు, వాదనల అనంతరం నేరం రుజువుకావడంతో రామకృష్ణకు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువడింది.

News May 30, 2024

పవన్ మెజార్టీపై నా యావదాస్తి పందెం వేస్తా: వర్మ

image

‘పిఠాపురంలో పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారని నా యావదాస్తి పందెం వేస్తా. ఎవరైనా ఉంటే కాగితాలతో రమ్మనండి’ అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఓ ఛానల్ డిబెట్‌లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ తాము గెలుస్తున్నట్లు ఎక్కడా చెప్పడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్న విషయంపై వర్మ స్పందిస్తూ.. గెలిచే వారెప్పుడూ సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటారని, ఓడిపోయే వారే హడావుడి చేస్తారని అన్నారు.

News May 30, 2024

ఏలూరు: ట్రావెల్స్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు భీమడోలు ఎస్సై సుధాకర్ తెలిపారు. భీమడోలు మండలం అరుంధతీ కాలనీకి చెందిన భీమడోలు మహాలక్ష్ముడు బుధవారం ఏలూరు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్ముడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

News May 30, 2024

ప.గో: విషాదం.. భార్యపై అలిగి భర్త ఆత్మహత్య

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది. SI నాగబాబు వివరాల ప్రకారం.. అమృతరావు కాలనీకి చెందిన బాలుప్రసాద్(31) ఓ ఖాళీ స్థలాన్ని కొని అప్పులపాలయ్యాడు. అవి తీర్చేందుకు కువైట్ వెళ్తానని భార్యకు చెప్పగా ఆమె ఒప్పుకోలేదు. కోపంతో పుట్టింటికి వెళ్లిపోవడంతో బాలు ప్రసాద్ ఈనెల 24న పురుగు మందు తాగాడు. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28న మృతి చెందాడు.

News May 30, 2024

ప.గో: నేడు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పర్యటన

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ముఖేష్ కుమార్ మీనా గురువారం భీమవరం రానున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు భీమవరం SRKR  ఇంజినీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీలలో కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన తనిఖీ చేస్తారు. సాయంత్రం భీమవరం నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 30, 2024

ఏలూరు: దాడి చేస్తారనే భయంతో సూసైడ్

image

తనపై దాడి చేస్తారనే భయంతో భీమడోలుకు చెందిన జయరాజు మజ్జిగలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. జయరాజు ఈనెల 27న కొంతమందితో గొడవపడ్డాడు. అయితే వారు తిరిగి తనపై దాడి చేస్తారనే భయంతో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప.గో.: చంద్రబాబు నాయుడిని కలిసిన RRR 

image

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవారం HYDలోని ఆయన స్వగృహంలో ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కాసేపు రాజకీయ అంశాలపై చర్చించారు. 

News May 29, 2024

ప.గో.: 60 మందిపై కేసులు: DSP

image

ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో ఒక SI, నలుగురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 60 మందిపై కేసులు పెట్టామని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. CI రమేశ్ ఉన్నారు.