WestGodavari

News November 5, 2024

ఏలూరు జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు

image

వినియోగదారులకు స్థిరమైన ధరలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సూచనలను జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆయిల్, పప్పుధాన్యాలు, చక్కెర అసోసియేషన్, ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి, జిల్లాలో 32 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

News November 4, 2024

రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమంలో మంజూరుచేసిన రోడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 213.55 కిలోమీటర్ల మేర 1080 రోడ్ల నిర్మాణ పనులను మంజూరు చేశామన్నారు.

News November 4, 2024

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 252 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలనుంచి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

News November 4, 2024

ప.గో: ఇందులో తప్పు ఎవరిది..?

image

భార్య, ప్రియురాలి మధ్యలో నలిగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉంగుటూరు(M) నాచుగుంటకు చెందిన రామయ్య(36)కు ప్రేమ వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడగా ఇది భార్యకు తెలిసింది. భార్యను కాదనలేక, ప్రియురాలిని వదల్లేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గతనెల 17న ప్రియురాలి ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

News November 4, 2024

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కైవల్య రెడ్డికి స్థానం

image

నిడదవోలుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న కుంచాల కైవల్యరెడ్డి ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో నాసావారి ఆధ్వర్యంలో ఎక్స వారు నిర్వహించిన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసిన అతి చిన్న వయస్కురాలైన భారతీయురాలిగా రికార్డు నమోదు చేసింది. సైన్స్, చిత్రలేఖనంలో ప్రతిభ చూపింది.

News November 3, 2024

సెమీఫైనల్‌కు చేరిన ఉమ్మడి పశ్చిమగోదావరి బాలికల జట్టు

image

పల్నాడు జిల్లా నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ నందు జరుగుతున్న 68వ రాష్ట్రస్థాయి S G F U/14 బాలబాలికల బాస్కెట్బాల్ పోటీల్లో బాలికల విభాగంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుంటూరు జట్టు మీద 26-13 స్కోర్‌తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం రాత్రి సెమీఫైనల్ పోటీల్లో పశ్చిమ జట్టు వేరే జట్టుపై తలపడనుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

News November 3, 2024

ప.గో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

image

నల్లజర్ల మండలం పుల్లపాడు హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు అనంతపురం శారదనగర్‌కు చెందిన కనకదుర్గ (70) అక్కడికక్కడే మృతి చెందగా.. సుసర్ల శ్రీలక్ష్మి (82)కి తీవ్రగాయాలవ్వడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారు అనంతపురం నుంచి కాకినాడ వెళ్తున్నట్లు వివరించారు.

News November 3, 2024

నిడదవోలులో మంత్రి కొత్త కార్యాలయం ప్రారంభం

image

నిడదవోలు పట్టణ 1వ వార్డ్ బాలాజీ నగర్‌లో మంత్రి కందుల దుర్గేశ్ జనసేన కొత్త కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమంలో నిడదవోలు టీడీపీ ఇన్‌ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు తమ సమస్యలను ఇక్కడికి వచ్చి విన్నవించడం కోసం ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.

News November 3, 2024

ఏలూరు: యువతి కడుపులో కేజీన్నర వెంట్రుకలు

image

ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్యులు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా ఒక యువతి కడుపులో నుంచి సుమారు కేజీన్నర వెంట్రుకలు తొలగించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కొల్లేరు పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతి గత కొన్ని రోజులుగా వాంతులు, కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆశ్రమం ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు కడుపులో వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించి శస్త్ర చికిత్స చేసి వెంట్రుకలు తొలగించారు.

News November 2, 2024

రూ.800 కోట్లతో రహదారులకు మరమ్మతులు: మంత్రి

image

రాష్ట్రంలో రూ.800 కోట్లతో రహదారులపై ఏర్పడిన గుంతలను మరమ్మతులు చేపట్టనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం యలమంచిలి మండలం దొడ్డిపట్ల వద్ద రూ.30 లక్షలతో పాలకొల్లు – దొడ్డిపట్ల రహదారి మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఆర్ & బీ డీఈ లు పాల్గొన్నారు.