WestGodavari

News May 29, 2024

ఏలూరు: ACCIDENT.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా తాళ్ళపూడిలో మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు SI శ్యాంసుందర్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిడిపి గ్రామానికి చెందిన బండారు శ్రీనివాస్, స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి సురయ్యపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కావడంతో రాజమండ్రి ఆస్పత్రికి తరలించామన్నారు.

News May 29, 2024

జంగారెడ్డిగూడెం: మహిళతో రాసలీలలు.. డిస్మిస్

image

జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ మహేష్ రెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏఈ రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో విద్యుత్ అంతరాయం కలిగిందని స్థానికులు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ మద్యం మత్తులో స్పృహ లేకుండా మహిళతో ఉన్నట్లు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News May 29, 2024

అత్తిలి: రైల్వే గేటు మూసివేత

image

అత్తిలి మండలం పరిధిలోని గవర్లపాలెం రైల్వే గేటు వద్ద రాకపోకలు ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం రైల్వే గేటు మూసివేస్తున్నట్లు చెప్పారు. బుధవారం నుంచి 31సాయంత్రం 7 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని కోరారు.

News May 29, 2024

పెంటపాడులో హై టెన్షన్

image

పెంటపాడు మండలం రావిపాడులో <<13329601>>తీవ్ర ఉద్రిక్తత<<>> నెలకొంది. రావిపాడులో జరిగిన అల్లర్లకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య, తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి రంగంలోకి దిగారు. పోలీసులు ఉన్నతాధికారులపై దళిత సంఘాలు రాళ్లు విసిరారు. దాడిలో పెంటపాడు ఎమ్మార్వో , తాడేపల్లిగూడెం ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్ కు గాయాలు అయినట్లు సమాచారం.

News May 29, 2024

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏలూరు ఖైదీ మృతి

image

చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.

News May 29, 2024

ప.గో.: 6 రోజుల్లో నేతల భవితవ్యం.. గెలుపుపై టెన్షన్

image

ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చి 15 రోజులైంది. మరో 6 రోజుల్లో నేతల భవితవ్యం వెలువడనుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థే MLA అంటూ వాహనాలకు ముందస్తుగానే స్టిక్కర్లు అతికించేస్తున్నారు. మరోవైపు బెట్టింగుల జోరు నడుస్తోంది. – మీ వద్ద పరిస్థితి ఏంటి.?

News May 28, 2024

ప.గో.: ACCIDENT.. వ్యక్తి మృతి

image

ప.గో. జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు రామరాజు (63) బైక్‌పై వెళ్తుండగా.. స్థానిక వంతెన వద్ద ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. బైక్‌పై ఉన్న మరోవ్యక్తి షేక్ సత్తార్‌కు తీవ్రగాయాలవగా పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు.  

News May 28, 2024

నరసాపురంలో ఆలిండియా టోర్నీ.. గెలిస్తే రూ.64వేలు

image

నరసాపురంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో మంగళవారంఆల్ ఇండియా ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీ ప్రారంభమైంది. పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త నూలి శ్రీనివాస్ ఏడేళ్లుగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి రూ.64 వేల నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేయనున్నారు.

News May 28, 2024

ద్వారకాతిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరణ

image

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి మంగళవారం దాతలు స్వామి వారికి బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఎం, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు 139 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు కిరీటాన్ని స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

News May 28, 2024

ఏలూరు: పోలీసుల గస్తీ.. ప్రతి వాహనం పరిశీలన

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు అన్ని ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.