WestGodavari

News May 28, 2024

కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

image

కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, రాజేశ్, రాధాప్రియ, స్వామి నాథన్ అన్న కుమారుడు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్ 15 ఏళ్ళ క్రితం కుటుంబంతో వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. కుమారుడు రాజేశ్, కూతురు రాధ తమిళనాడులో చదువుతున్నారు. వేసవి సెలవులకు కొవ్వూరు వచ్చిన వీరు తిరిగి సోమవారం కారులో తమిళనాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News May 28, 2024

ఏలూరు: స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన SP

image

ఏలూరు జిల్లా కేంద్రంలోని సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను SP మేరీ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.  

News May 27, 2024

తణుకు: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. రిమాండ్

image

తణుకు పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పట్టణ SI శ్రీనివాస్ తెలిపారు. పట్టణానికి చెందిన చదలవాడ తిమోతి అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో వారు కేసునమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

News May 27, 2024

కొవ్వూరు: జేసీబీ ఢీ.. వృద్ధురాలు మృతి

image

జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం కొవ్వూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన యాదగిరి నూకమ్మ (70)ను వాటర్ ట్యాంక్ సమీపంలో జేసీబీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న కొవ్వూరు టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

News May 27, 2024

ప.గో.: కూటమి అభ్యర్థి గెలుపు కోసం.. మోకాళ్లపై మెట్లెక్కి

image

ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిగుంటకు చెందిన పెంకి శ్రీను కూటమి అభ్యర్థి గెలుపు కోసం మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి మొక్కు చెల్లించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ సోమవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత మందిరాన్ని దర్శించారు. ఈ సందర్భంగా 350 మెట్లను మోకాళ్ళపై ఎక్కి మొక్కు తీర్చుకున్నట్లు శ్రీను తెలిపారు.

News May 27, 2024

ప.గో.: నేటి నుంచి డెమో రైళ్ల పునరుద్ధరణ

image

రైల్వే ట్రాక్, ఇతర నిర్వహణ పనులు కారణంగా జిల్లాలో 10 రోజులుగా రద్దయిన డెమో రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు నుంచి నడిచే అన్ని రైళ్లు గతంలో మాదిరిగా షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి. అలాగే భీమవరం, నరసాపురం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా గతంలో నడిచిన విధంగానే షెడ్యూల్ సమయాలకు బయలుదేరనున్నాయి. 

News May 27, 2024

జూన్ 1న ఉమ్మడి ప.గో. జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జూన్ 1వ తేదీన ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జడ్పీ అధ్యక్షులు ఘంటా పద్మశ్రీ అధ్యక్షత వహిస్తారన్నారు. సమావేశానికి జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు, హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

News May 27, 2024

ఏలూరులో కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

ఏలూరులోని శాస్త్రీకాలనీలో విషాదం చోటుచేసుకుంది. యడ్లపల్లి వికాస్ సోమవారం ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందాడు. వికాస్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ఇటీవలే వేరే శాఖకు బదిలీ అయినట్లు సమాచారం. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వికాస్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

అజ్జమూరులో లారీ ఢీకొని మహిళ మృతి

image

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులోని అజ్జాలమ్మ గుడి సమీప మలుపులో సోమవారం లారీ ఢీకొని పీతల నందమ్మ(75) మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమ్మ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News May 27, 2024

ప.గో: ALERT.. మామిడి పండ్లు తింటున్నారా..?

image

పండ్ల రారాజైన ‘మామిడి’కి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉండటంతో ఉమ్మడి ప.గో జిల్లాలో దళారులు అక్రమ మార్గాలకు తెరదీస్తున్నారు. కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలతో కాయలను మగ్గబెడుతున్నారు. ఇలాంటి ఆరోపణలున్నా అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. కెమికల్స్‌తో మగ్గబెట్టిన పండ్లు తింటే క్యాన్సర్, అల్సర్, కాలేయ వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు నీటితో పండ్లు కడితే మేలని సూచిస్తున్నారు.