India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ఎమ్మెల్యే ఆంజాద్ బాషా చెప్పులు వేసుకుని గణేశ్ మండపంలో వినాయకుడి విగ్రహం ముందు ఫొటోలు దిగడం కడప నగరంలో కలకలం రేపింది. ఆయన కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి మంగళవారం 25వ డివిజన్ రాధాకృష్ణనగర్లోని గణేశ్ మండపానికి వచ్చారు. పూజల అనంతరం అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణ, వైసీపీ నాయకులతో కలిసి చెప్పులు వేసుకుని ఫొటోలు దిగారు. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతోపాటు మన ప్రాణాలకు ముప్పు రాకుండా విధి నిర్వహణను బాధ్యతను నిర్వర్తించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. జాతీయ అటవీశాఖ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కడపలో కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న ఐదేళ్ల LLB మొదటి సెమిస్టర్, మూడేళ్ల LLB మొదటి సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి, కుల సచివులు ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలసి విడుదల చేశారు. తక్కువ కాలంలోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని వీసీ అభినందించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థుల ఘర్షణకు లవ్ లెటర్ కారణమని తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. కళాశాలలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ విద్యార్థిని మైక్రో బయాలజీ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలు తిన్న విద్యార్థి బంధువులను పిలిపించి గాయపరిచిన వారిపై దాడి చేసే సందర్భంలో వారు యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో తల దాచుకున్నారని సమాచారం.
కడప నగరంలోని కలెక్టరేట్ ముందు సోమవారం గ్రీవెన్స్ సమయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన స్టాఫ్ నర్స్ బి.చిన్నమ్మపై మంగళవారం కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నమ్మ తనను డాక్టర్ చెన్నకృష్ణ ప్రేమ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే బలవన్మరణానికి ప్రయత్నం చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సింహాద్రిపురం ఒంటి కన్నుతో మేక పిల్ల పుట్టడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకిస్తున్నారు. మంగళవారం మండలంలోని గురజాల గ్రామానికి చెందిన కొమ్మెర శ్రీనివాసులుకు సంబంధించిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక పిల్లకు నుదుటన ఒకే కన్ను ఉంది. మరో పిల్ల రెండు కళ్లతో సాధారణంగా జన్మించింది. రెండు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. జన్యుపరమైన లోపంతో ఒక కన్నుతో పుట్టిందని తెలిపారు.
వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
కోనసీమలో ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు కడప జిల్లా తరఫున ఇడుపులపాయ IIIT విద్యార్థులు ఎంపికయ్యారు. మొత్తం 7 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని ట్రిపుల్ఐటీ సంచాలకులు డా. కుమారస్వామి గుప్తా అభినందించారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ కోచ్ డా.బాల్ గోవింద్ తివారి తదితరులు పాల్గొన్నారు.
కామర్స్ కోర్సు చదివిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే ప్రభావంతంగా కోర్సు పూర్తి చేయాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి తెలిపారు. బీకాం ఆనర్స్ కోర్సును ఆచార్య కె.కృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య ఎస్.రఘునాథ్రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మ, విభాగ అధిపతి ఆచార్య విజయభారతి పాల్గొన్నారు.
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. కమలపురం, మైదుకూరులలో అత్యధికంగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోపవరంలో 7.8, వేములలో 7, బద్వేల్ 6.8, పొద్దుటూరు, జమ్మలమడుగు, మీ.మీలో 6.2, ఖాజీపేట, చాపాడులలో 6, కడపలో 5.4, చక్రాయపేటలో 5, దువ్వూరులో 4.8, బి.మఠంలో 3.6, బి.కోడూరులో 3.4, వల్లూరులో 3.2, సిద్దవటం3, ఆట్లూరు 2, సీకేదిన్నె1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది
Sorry, no posts matched your criteria.