Y.S.R. Cuddapah

News June 4, 2024

ప్రొద్దుటూరు: భారీ మెజార్టీతో దూసుకెళ్తున్న టీడీపీ

image

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ 8వ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి 43,129 ఓట్లు. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 33,024 ఓట్లు వచ్చాయి. నంద్యాల వరద రాజుల రెడ్డి 10,105 లీడ్‌లో కొనసాగుతున్నారు.
7వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థికి 36,477, వైసీపీ అభ్యర్థికి 30,285 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

పులివెందుల 4వ రౌండ్ UPDATE

image

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠4 రౌండ్లో పోలైన ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 21580
➢ బీటెక్ రవి: 8959
వైఎస్ జగన్ 12000+ ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

పులివెందుల 3వ రౌండ్ UPDATE

image

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 15323
➢ బీటెక్ రవి: 7157
వైఎస్ జగన్ 8166 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

కడప పార్లమెంటు 4వ రౌండ్ UPDATE

image

కడపలో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 4వ రౌండ్‌లో ఓట్లు ఇలా..
➢ వైఎస్ అవినాష్ రెడ్డి: 20,085
➢ భూపేశ్ రెడ్డి: 6903
➢ వైఎస్ షర్మిల: 5410 ➠ 4వ రౌండ్ ముగిసే సరికి వైఎస్ అవినాష్ రెడ్డి 13వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

పోస్టల్ బ్యాలెట్: ఆధిక్యంలో వైఎస్ జగన్

image

పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బీటెక్ రవి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ ఓట్లు ఇలా..
➢ వైఎస్ జగన్: 4434
➢ బీటెక్ రవి: 2546
వైఎస్ జగన్ 1888 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

News June 4, 2024

పోస్టల్ బ్యాలెట్: పుట్టాకు 1000 ఓట్ల ఆధిక్యం

image

మైదుకూరు నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 1000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2642 ఓట్లకు గాను పుట్టా సుధాకర్ యాదవ్ 1600 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. రఘురామిరెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లలో వెనుకంజలో పడ్డారు.

News June 4, 2024

ఆధిక్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి

image

కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

వేంపల్లె: వైఎస్సార్‌కు నివాళులర్పించిన షర్మిల

image

ఆంధ్రకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం వైఎస్సార్ ఘాటుకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. వైఎస్సార్ ఘాట్ నుంచి నేరుగా కడప కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

News June 4, 2024

కడప: లబ్ డబ్.. లబ్ డబ్..

image

అసెంబ్లీ ఎన్నికల చివరి అంకం నేడే. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 149 మందికి అనుక్షణం తాము గెలుస్తామా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ గతంలో 10కి 10 స్థానాల్లో గెలిచింది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్ని గెలిచేనో..?
గెలిస్తే: ఐదేళ్లు MLA.
అవకాశం వస్తే మంత్రి.
ఓడితే: రాజకీయ భవిష్యత్తు ఎటువైపన్నది కొందరికి ప్రశ్నార్థకం.

News June 4, 2024

కడప: ఎన్నికల కౌంటింగ్ నేడే.. ఏర్పాట్లు పూర్తి..

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు నేడు తెరవీడనుంది. మరి కొద్ది గంటల్లో నేత భవిష్యత్ తేలిపోనుంది. కడప మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.