India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. జిల్లాలో 2389 అంగన్వాడీ కేంద్రాలున్నాయని, వాటిలో 378 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలలో ఉన్నాయన్నారు.

ఆశయాలకు అనుగుణంగా అధికారులు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా ప్రగతిపై అధికారులతో మంగళవారం సమీక్ష చేశారు. ‘నీతీ ఆయోగ్’ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేసిందన్నారు.

అయ్యప్ప భక్తుల కోసం కడప మీదుగా మచిలీపట్నం- కొల్లామ్ (QLN) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 23,30న మచిలీపట్నం- కొల్లామ్ QLN (నం.07147), డిసెంబర్ 25, జనవరి 1న కొల్లాం QLN- మచిలీపట్నం (నం.07148) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో కడపతోపాటు ఎర్రగుంట్ల, రాజంపేట రైల్వే స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. రేపటి నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.

ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. గాలివీడు మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక సమస్యలపై చర్చించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

గాలివీడు మండలంలో జిల్లా కలెక్టర్ మంగళవారం పర్యటించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగే అధికారుల సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ పలు రికార్డులను తనిఖీ చేశారు. స్థానిక సమస్యలపై చర్చించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించబోనని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, వీఆర్వోలు మండల అధికారులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన గండిలో చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటలకు పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు. గమనించిన పోలీసు సిబ్బంది అంబులెన్స్ ద్వారా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆర్కే వ్యాలీ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతిరాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ఎస్సై తెలిపారు.

అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదేశించారు. కడప కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, పరిష్కరించాలన్నారు.

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలలోనే ఇవ్వాలని సూచించారు.

కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం పెన్నానది నీటిలో గల్లంతైన గణేశ్ అనే యువకుడి కోసం శనివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, బంధువులు, రెస్క్యూ టీంతోపాటు జాలర్ల ద్వారా ట్యూబులు, రబ్బరు బోటు సహాయంతో నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. నేటికి కూడా యువకుడికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన పులివెందులలో చోటుచేసుకుంది. పులివెందుల పరిధిలోని ప్రశాంతి నగర్కు చెందిన యస్వంత్ సమీప కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషిస్తున్నాడని పులివెందుల అర్బన్ పోలీసులను యువతి ఆశ్రయించింది. అనంతరం అతనిపై SC, ST అట్రాసిటీ కేసు పెట్టింది.
Sorry, no posts matched your criteria.