Y.S.R. Cuddapah

News June 3, 2024

కడప: ASI కుమారుడి ఆత్మహత్య

image

పెండ్లిమర్రి మండలంలో ASIగా పనిచేస్తున్న పుల్లయ్య కుమారుడు సాయి కృష్ణ ఆదివారం కడప ప్రకాష్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రఫీ తెలిపారు. సాయి కృష్ణ ప్రైవేట్‌గా చదువుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. పుల్లయ్య అనారోగ్యం వల్ల రెండు రోజుల క్రితం కేరళ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

కడప: ఇద్దరి మద్య గొడవ.. పక్కనున్న మహిళకు గాయాలు

image

నందలూరు మండల పరిధిలోని చింతలకుంటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని విడిపించడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ప్రమాదవశాత్తు రాయి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలింది. హుటాహుటిన ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

కౌంటింగ్‌కు నాలుగు అంచెల భద్రత: కడప ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఆదివారం కడప నగరం మౌంట్ ఫోర్ట్ స్కూల్లో పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కేంద్ర సాయుధ బలగాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో పోలీసుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు పాల్గొన్నారు.

News June 2, 2024

కడప: కౌంటింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం కౌంటింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు విధులను కేటాయించడం జరిగిందని కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గాల వారీగా విధులను కేటాయించే రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. 4న ఉదయం 5.30కి 3వ ర్యాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు.

News June 2, 2024

కడప జిల్లాలో టీబీ మందుల కొరత లేదు: జేడీ

image

వైఎస్సార్ కడప జిల్లాలో ఎక్కడా టీబీ మందులకు కొరత లేదని టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.రమేష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో అవసరమైన టీబీ మందులు లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో అవసరమైన స్థాయిలో టీబీ నివారణ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 రోజులకు సరిపడా టీబీ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.

News June 2, 2024

కడప జిల్లాలో 2500 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ

image

ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కడప ఎస్పీ తెలిపారు. జిల్లాలో కేంద్ర బలగాలతో సహా 2500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా డే అండ్ నైట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తారని, 55 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గొడవలు సృష్టించిన, పాల్పడినవారు జిల్లా బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.

News June 2, 2024

అవినాశ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమేనా?

image

కడప పార్లమెంట్ ఫలితంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇప్పటికే అవినాశ్‌రెడ్డి రెండు సార్లు MPగా విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైగా ఓట్లతో విజయం సాధించగా, 2019లో ఏకంగా 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోసారి విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటుండగా, అందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నాయి. మరి అవినాశ్ హ్యాట్రిక్ సాధిస్తారా లేక ఎగ్జిట్ పోల్స్‌ని కాదని వేరే వ్యక్తి గెలుస్తారో చూడాలి.

News June 2, 2024

C-PAC EXIT POLLS: కడప ఎంపీగా గెలుపెవరిదంటే.?

image

కడప ఎంపీగా వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో వైసీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

EXIT POLLS: కడపలో వైసీపీకే పట్టం.!

image

ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 6 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో కూటమికి రెండు సీట్లు వస్తాయని, మరో రెండు చోట్ల రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

కడప: పోలింగ్ సిబ్బందికి రెండు ఇంక్రిమెంట్లు కట్

image

ఎన్నికల పోలింగ్ విధుల్లో అలసత్వం వహించిన 185 మంది పోలింగ్ సిబ్బందికి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నట్లు కడప జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది.. మే 12, 13 తేదీల్లో పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించి ఎన్నికల ప్రక్రియ ఆలస్యానికి కారకులైన 185 మంది పోలింగ్ సిబ్బందికి ఇంక్రిమెంట్లు కట్ చేశామని తెలిపారు.