India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంటలో వ్యవసాయ భూమి బుధవారం సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. ఉదయాన్నే పొలం దగ్గరకు రైతు మాను కొండు శివ కుంగిన భూమిని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పంట వేయలేదు. 2019లోనూ ఇదే భూమి కుంగిందని, అప్పట్లో దాన్ని పూడ్చేందుకు రూ. 50 వేలు వెచ్చించినట్లు బాధిత రైతు తెలిపారు. అధికారులు దీనిని పరిశీలించాలని కోరుతున్నాడు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 74 పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 11, సహాయకురాలు 59, మినీ అంగన్వాడీ 4 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 17-09-2024 కాగా.. అంగన్వాడీ కార్యకర్తకి విద్యా అర్హత 10వ తరగతి, అంగన్వాడీ సహాయకురాలు, మిని అంగన్వాడీలకు 7వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.kadapa.ap.gov.inలో చూడవచ్చన్నారు.
వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా మట్టి విగ్రహాల తయారీ పోటీని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కడప ప్రాంతీయ కార్యాలయం ఇంజినీరు శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కడపలోని పవన్ కాన్సెప్ట్ స్కూల్లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఉత్తమ విగ్రహాలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు (Teacher) కృషి వెలకట్టలేనిది. అటువంటి వారిలో కడప జిల్లాకు చెందిన 79 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు వరించాయి. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నేడు టీచర్స్ డే జరుపుకుంటున్నాము. మరి మీ జీవితాన్ని మార్చిన టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి.
Happy Teachers’ Day
జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన 79 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజును పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం సాయంత్రం వారికి అవార్డులను ప్రదానం చేసి సన్మానించనున్నట్లు డీఈవో తెలిపారు.
కడప నగరంలోని బీసీ భవన్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ అన్నారు. పాత రిమ్స్ ఆవరణంలోని బీసీ భవన్ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కడప బీసీ భవన్కు జిల్లా నలుమూలల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి బీసీలు ఈ బీసీ భవన్కు వస్తారని అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఈ భవనంలో లైబ్రరీ, స్టడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో నెలకొన్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వేలాదిమంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న సంఘటనలూ చూస్తున్నాం. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లాకు చెందిన సీఐలు ఎస్సైలు, ఇతర సిబ్బంది వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా బందోబస్తుకు తరలి వెళ్లారు. బాధితులను ఆదుకునేందుకు NDRF సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలను, వన్య ప్రాణులను సంరక్షించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ, డిస్టిక్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలలో టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. ఆయా టూరిజం స్పాట్లలో పర్యాటకులు సందర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
రాయచోటి పట్టణం కొత్తపేట- రామాపురానికి చెందిన కరాటే రామచంద్ర రైస్ పుల్లింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడు. అయితే అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామచంద్ర కుటుంబ సభ్యులను బెంగళూరుకు చెందిన నవీన్ మనుషులు కిడ్నాప్ చేసిన కేసులో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఆగస్టు 31న సంబేపల్లిలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.
రాయచోటి పట్టణం కొత్తపేట- రామాపురానికి చెందిన కరాటే రామచంద్ర రైస్ పుల్లింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడు. అయితే అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామచంద్ర కుటుంబ సభ్యులను బెంగళూరుకు చెందిన నవీన్ మనుషులు కిడ్నాప్ చేసిన కేసులో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఆగస్టు 31న సంబేపల్లిలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.