India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద పెన్నా నదిలో దిగి గణేశ్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పుష్పగిరిలో పూజలు నిర్వహించడానికి కడప ఎన్జీవో కాలనీకి చెందిన గణేశ్ కుటుంబ సమేతంగా పుష్పగిరికి వచ్చి, నీటిలో దిగి గల్లంతైనట్లు సమాచారం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ‘పుష్ప-2’ మేనియా ఓ రేంజ్లో ఉంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా ఎక్కడికక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేషన్స్కు ప్లాన్ చేసుకుంటున్నారు. భారీ కటౌట్లు, ప్రత్యేక కార్యక్రమాలతో థియేటర్ల వద్ద హడావుడి చేసేందుకు రెడీ అవుతున్నారు. జమ్మలమడుగులో భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నామని ఫ్యాన్స్ ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

కడప జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలను ఈ-కామర్స్ బిజినెస్ వైపు అడుగులు వేయించి ప్రపంచ గుర్తింపుతో పాటు సంపూర్ణ సాధికారిత సాధించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పరిధిలో వివిధ రకాల పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. మహిళాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తెలిపారు.

యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ 7, 8, LLB సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను కులసచివులు ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు, సహాయ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి విడుదల చేశారు. యోగివేమన విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో ఎల్.ఎల్.బి, డిగ్రీ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు.

నందలూరు పోలీస్ స్టేషన్లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సిరిగిరి అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ. ఐటీ చట్టాల కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా వేదికగా నారా లోకేశ్, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దవటం మండలానికి చెందిన వాకమల్ల వెంకటాద్రి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో వీరిపై 20 కేసులు నమోదయ్యాయి.

కడపలో ఆర్మీ రిక్యూట్మెంట్ ర్యాలీ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగవరోజు ర్యాలీ జరుగుతున్న DSA మైదానం బురదగా మారింది. దీంతో రిమ్స్ హాస్పిటల్ రోడ్డులో రన్నింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

వివిధ పార్టీలకు చెందిన MLAలను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ఈక్రమంలో కడప జిల్లా బద్వేల్ వైసీపీ MLA దాసరి సుధాకు ఆ జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. దాసరి సుధ స్పీకర్ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. వైసీపీలో గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని సైతం ప్యానల్ స్పీకర్గా ఎంపిక చేశారు.

పులివెందులలో ఏడేళ్ల క్రితం జరిగిన అవినీతిపై తిరిగి విచారణ మొదలైంది. పులివెందుల ICDS ప్రాజెక్టు పరిధిలో రూ.8.71 లక్షల విలువైన బియ్యం, పప్పులు, ఆయిల్, ఇతర ఆహార పదార్థాలు దుర్వినియోగం చేశారని 2017లో గుర్తించారు. అప్పడు షోకాజ్ నోటీసులు మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీడీపీవోగా పనిచేసి రిటైర్డ్ అయిన సావిత్రితో పాటు మరో 10 మంది సూపర్వైజర్లపై విచారణకు తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.

ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 18న కడపకు రానున్నట్టు తెలుస్తోంది. కడపలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. 16న పెద్ద దర్గా గంధ మహోత్సవం, 17న ఉరుసు, 18న ముషాయిర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ముషాయిరా కార్యక్రమానికి ఒక అతిధి రావడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి కడప ఎయిర్ పోర్ట్ నూతన భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా కడప నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పటిష్టపరచాలన్నారు.
Sorry, no posts matched your criteria.