India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో వేర్వేరు చోట్ల నదిలో దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలం వాటర్ గండి వద్ద పెన్నా నదిలో పడి కడపకు చెందిన బిల్లపాటి బాబు మృతి చెందినట్లు CI పురుషోత్తమరాజు తెలిపారు. CKదిన్నె మండలం బుగ్గవంక డ్యామ్లో చేపల వేటకు వెళ్లి ఇప్పెంట గ్రామం యానాది కాలనీవాసి తాటిముక్కల అంకయ్య (54) మృతి చెందాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కడప ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, యువతకు ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, గండికోట అభివృద్ధి వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

రాష్ట్రస్థాయి అండర్ – 14 రగ్బీ పోటీల్లో వేంపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. కమలాపురంలో జరిగిన ఈ రగ్బీ పోటిల్లో బాలికల విభాగంలో బిందు మాధవి 2వ స్థానం, బాలుర విభాగంలో నూరుల్లా 3వ స్థానంలో రాణించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ మార్పులు.. వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలపై చర్చలు జరిగాయి.

తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన భాషోద్యమ వీరుడు సీపీ బ్రౌన్. 10-11-1798లో కలకత్తాలో జన్మించారు. ఈస్ట్ ఇండియా తరఫున భారత్కు వచ్చి 1820లో కడపల డిప్యూటీ కలెక్టర్గా పని చేరారు. ఆ రోజుల్లో కడపలో ఇళ్లు కొనుక్కొని అక్కడే ఉన్నారు. తెలుగు నేర్చుకుని తెలుగు భాషా పరిశోధనకు కృషి చేశారు. అనేక తెలుగు గ్రంథాలను కూడా రాశారు. అలాంటి గొప్ప వ్యక్తికి మన కడప జిల్లాతో సంబంధాలు ఉండటం గర్వంగా ఉందని పలువురు అన్నారు.

కడపలో ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. నగరంలోని 7రోడ్ల వద్ద EX ఆర్మీ పేరిట ఈ పోస్టర్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేసే దమ్మున్న మగాడు, మొనగాడు లేడా అని పోస్టర్లో రాశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలను విమర్శించారు ఇంతకూ ఈ పోస్టర్ని ఎవరు ఎవరు అంటించారనేది ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ చర్చనీయాంశమైంది.

ఉమ్మడి కడప జిల్లాలో బెస్ట్ టీచర్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఎంపికయ్యారు.
➤S కొండారెడ్డి (మోడంపల్లి హైస్కూల్) సైన్స్ టీచర్ ప్రొద్దూటూరు మండలం కడప జిల్లా
➤A అనిత (KGBV ప్రిన్సిపల్) కలకడ మండలం అన్నమయ్య జిల్లా
➤రామిశెట్టి నాగరత్నమ్మ (సిద్దవరం KGBV) ఇంగ్లీషు ఉపాధ్యాయురాలు పెద్దమడియం మండలం అన్నమయ్య జిల్లా

కడప నగరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కడప నగరంలోని మునిసిపల్ మైదానంలో నిర్వహించే ర్యాలీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్మీ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రారంభిస్తారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు కడపకు చేరుకున్నారు.

రెండో జాబితాలో ఉమ్మడి కడప జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. అన్నమయ్య అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి నియమితులయ్యారు. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్గా కేకే చౌదరి ఎంపికయ్యారు. ఇక APSRTC రీజనల్ బోర్డు ఛైర్మన్గా పూల నాగరాజుకు అవకాశం దక్కింది.

కడపలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం జరిగిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో జరిగిన రచ్చ తెలిసిందే. గత ఎన్నికల్లో కడపలో ఓ పెద్దమనిషి తమకు సహకరించారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. దీంతో మేయర్ స్పందిస్తూ అందులో ఎటువంటి సత్యం లేదని, ఇవాళ దేవుని కడపలో ఉదయం 10 గంటలకు ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడపలో హై టెన్షన్ నెలకొంది.
Sorry, no posts matched your criteria.