Y.S.R. Cuddapah

News May 29, 2024

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంక్షలు కఠినతరం: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

News May 28, 2024

బి.మఠం: భయంతో విద్యార్థిని ఆత్మహత్య

image

ఎంసెట్‌లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ (19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె ఎంసెట్‌ ‘కీ’ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 28, 2024

కడప: వైవీయూ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్‌సీ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య చింతా సుధాకర్ విడుదల చేశారు. వైవీయూలోని తన ఛాంబర్‌లో కులసచివులు ప్రొ. వై.పి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలించారు. బీఏ, బీబీఏలో 100 శాతం పాసయ్యారని, బీకాంలో 98.38 శాతం, బీఎస్సీలో 98.93 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

News May 28, 2024

కడప: భయంతో విద్యార్థి ఆత్మహత్య

image

ఎంసెట్ లో తక్కువ మార్కులు వస్తాయన్న భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బ్రహ్మంగారిమఠంలో జరిగింది. గొడ్లవీడుకు చెందిన లక్కినేని చిన్నయ్య కూతురు ప్రతిభ(19) పులివెందులలో ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసింది. తాజాగా ఆమె కీ చూసుకోగా తక్కువ మార్కులు వస్తాయని భయపడి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 28, 2024

మరో 7 రోజులే.. కడపలో ఆధిపత్యం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేయగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 28, 2024

కడప జిల్లాలో తల్లులకు తప్పని కడుపు కోత

image

కడప జిల్లాలో సిజేరియన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. WHO సంస్థ ప్రకారం 15 శాతం వరకు సిజేరియన్లకు అవకాశం ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య 50పైనే ఉంటుంది. 2023-24లో ప్రభుత్వ ఆసుపత్రిలో 10,890 ప్రసవాలు జరగ్గా అందులో 4,916 సిజేరియన్లే. అదే ప్రైవేట్ ఆస్పత్రిలో 22,667 ప్రసవాలు జరగ్గా ఏకంగా 14,346 మంది తల్లుల కడుపును డాక్టర్లు కోశారు. కొన్ని ఆస్పత్రిల్లో ఈ సంఖ్య 80 శాతంపైనే ఉంటోంది.

News May 28, 2024

అంతర్జాతీయ స్థాయికి కడప లెక్చరర్ 

image

కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.సుధాకర్ రెడ్డికి కాలిఫోర్నియాకు చెందిన ‘స్కాలర్ జీపీఎస్’ సంస్థ అధ్యయనంలో ఉత్తమ పరిశోధకుడిగా అవకాశం దక్కింది. స్కాలర్ జీపీఎస్ ర్యాకింగ్ అనలైటిక్స్‌లో భౌతికశాస్త్ర విభాగంలో ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌతికశాస్త్ర పరిశోధకుల్లో చోటు దక్కించుకున్నాడు. పలువురు ఆయన్ను అభినందించారు. 

News May 28, 2024

వేంపల్లి: విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

image

వేంపల్లిలో సోమవారం విషాదం నెలకొంది. కడప రోడ్డులో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరు మనోజ్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కారుకు నీటితో సర్వీసింగ్ చేస్తుండగా పొరపాటున నీరు మోటార్‌పై పడి మనోజ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News May 28, 2024

కడప: స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాకు సంబంధించి ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు భద్రతపై సిబ్బందితో చర్చించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జూన్ 4 వరకు బందోబస్తులో ఎటువంటి అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.

News May 27, 2024

మైదుకూరు: ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

మైదుకూరు మండల పరిధిలోని కేశలింగయ్య పల్లె వద్ద సోమవారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామానికి చెందిన సుంకర కొండయ్య(55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయం తగిలి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.