India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ CM జగన్పై TDP ఎమ్మెల్సీ భూమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘EVMల మీద నమ్మకం లేని జగన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే MLC ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారన్నారు. అభ్యర్థిని ప్రకటించి ఎందుకు వెనకడుగు వేశారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీకీ రాని జగన్ పార్టీ అవసరమా అన్నారు. పులివెందుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించని జగన్కి జీతమెందుకని, రాజీనామా చేస్తే పులివెందులకు మరో MLA వస్తారని అన్నారు.

కడపలో ప్రస్తుతం రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. నిన్న జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వేదికగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కడప మేయర్ సురేశ్ బాబుపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మేయర్ సహకరించారని ఆయన చేసిన ఆరోపణలు ప్రస్తుతం కడప రాజకీయంలో కలవరం రేపుతున్నాయి. దీంతో తాను ఏ తప్పు చేయలేదని రేపు ఉదయం దేవుని కడపలో ప్రమాణం చేస్తున్నట్లు మేయర్ తెలిపారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి సద్దిగుట్టవారిపల్లెలో 2018లో తన అమ్మమ్మపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపిన ఇంద్రప్రసాద్(38) అనే ముద్దాయికి 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 6 వ అదనపు జడ్జ్ శాంతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోట పురుషోత్తం వృద్ధురాలు తరపున కేసును వాదించారు. అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.

చివరి వరకు ఓ జంట అగ్నిసాక్షిగా ఒకరినొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్నారు. అలాగే మృత్యువులోనూ ఒకటిగా వెళ్లారు. ఆ ఘటన గురువారం కడపలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కడపకు చెందిన కానిస్టేబుల్ శివశంకర్(40), భార్య శైలజ(37) బైక్పై కడపకు వెళ్తుండగా వల్లూరు దగ్గర వారిని ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే భార్య మృతి చెందగా.. అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో భర్త చనిపోయినట్లు తెలిపారు.

పులివెందుల పట్టణంలోని మాజీ ఎంపీ దివంగత డీఎన్ రెడ్డి సతీమణి లక్ష్మీ దేవమ్మ(95) గురువారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. లక్ష్మీదేవమ్మ ఆరునెలలుగా హైదరాబాద్లోని తన కుమారుడు రమణారెడ్డి వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లక్ష్మీదేవమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన 1997లో చనిపోయిన విషయం తెలిసిందే.

ఉమ్మడి కడప రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి చెరువు కట్ట సమీపంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే మృతుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకటనారాయణ(40) అని, కొద్ది రోజుల నుంచి రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడులోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నాడని సీఐ తెలిపారు. మృతుడు టైల్స్ వేసేపని చేస్తూ ఉండేవాడు. అయితే హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు.

కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా నియమించింది. వర్రా రవీంద్ర కేసు విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎస్పీని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

జిల్లా అధికారుల సమన్వయ సహకారంతో, ప్రజల అభిమానంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు, కృషి చేస్తామని YSR జిల్లా నూతన కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న ఆయనను, కలెక్టర్ ఛాంబర్లో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.

కడప జిల్లా కలెక్టర్గా చెరుకూరి శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడున్న కలెక్టర్ శివ శంకర్ తెలంగాణ క్యాడర్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో వైఎస్సార్ జిల్లాను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఉమ్మడి కడప రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి చెరువు కట్ట సమీపంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటనను స్థానికులు బుధవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు బ్లాక్ షర్ట్ ధరించి గుబురు గడ్డంతో ఉన్నాడు.
Sorry, no posts matched your criteria.