India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనది పులివెందుల కావడంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని కడప స్టేషన్కు తరలించారు. గతంలో చంద్రబాబు, పవన్, లోకేశ్, అనితపై వర్రా అసభ్యకర పోస్టులు పెట్టారని పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. ఇతను కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడని సమాచారం.

కడప జిల్లా నూతన కలెక్టర్గా శ్రీధర్ నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు కలెక్టర్ శివ శంకర్ను తెలంగాణ క్యాడర్కు బదిలీ చేయడంతో, ఇన్ఛార్జ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఉన్నారు. జిల్లాకు కొత్త కలెక్టర్గా శ్రీధర్ను ఇటీవల ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన నేడు కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.

ఈనెల 9వ తేదీన కడప జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటకు రానున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిచాక మొదటిసారి జిల్లాకు రానుండగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మంగళవారం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇటీవల ఆయన వరుస ప్రెస్మీట్లతో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఆస్తులకు సంబంధించి వైఎస్ షర్మిల, విజయమ్మలపై కూడా ప్రశ్నలు సంధించారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాచమల్లు చేస్తున్న వ్యాఖ్యలపై మీ కామెంట్.

కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా కడప MLA మాధవి శివున్ని దర్శించుకున్నారు. కడపలోని మృత్యుంజయ కుంటలో వెలిసిన శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా తోటి భక్తులతో కలిసి సామాన్యురాలిగా కార్తీక దీపాలను వెలిగించి ఆమె మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు.

ఈ నెల 10వ తేదీ నుంచి కడపలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మనోజ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి కడప కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చేసి అభ్యర్థులకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. రైన్ ప్రూఫ్ టెంట్స్, రన్నింగ్, ఇతర పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కడప జిల్లాలోని సుదూర ప్రాంత ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని, కాబట్టి వారు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితిసింగ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు అర్జీలను బదిలీ చేస్తూ పరిష్కరించాలన్నారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరిగిన యాక్సిడెంట్లో బద్వేల్కు చెందిన బ్రహ్మయ్య(45) మృతిచెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బైకుపై రాంగ్ రూట్లో వచ్చిన బ్రహ్మయ్యను నియంత్రణ తప్పిన కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. హైదర్గూడలోని ఓ ఆస్పత్రికి తరలించాగా.. చికిత్స పొందుతూ బ్రహ్మయ్య మృతిచెందాడు. వనస్థలిపురం వాసి విజయ్ కుమార్ కారులో ఐమాక్స్ నుంచి వెళ్తుండగా.. టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. కేసు నమోదైంది.

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 9.30గం. నుంచి 10.30 గం. వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు 08562-244437 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పాలని తెలిపారు. అయితే నూతన కలెక్టర్గా శ్రీధర్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

కడప జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ చెరుకూరి శ్రీధర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు కలెక్టర్ శివశంకర్ను తెలంగాణ క్యాడర్కు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో ప్రస్తుతం ఇన్ఛార్జి కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నూతన కలెక్టర్గా డాక్టర్ చెరుకూరి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Sorry, no posts matched your criteria.