India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖాజీపేట మండలం అప్పనపల్లికి చెందిన ప్రవీణ్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలికిరిలోని JNTUలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ ర్యాగింగ్కు గురయ్యాడు. మనస్థాపన చెంది ఈనెల 23న ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో తన బాధను ఇంట్లో చెప్పుకోలేక 26న పురుగు మందును తాగాడు. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందుతుండగా ఇవాళ ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.
ప్రస్తుతం వైసీపీ నేతల రాజీనామాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ రెడ్డి కూడా పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నేను వైసీపీని వీడేది లేదు. నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాజకీయాలు ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే నా ప్రయాణం’ అని ఓ ప్రకటనలో తెలిపారు.
పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల సెప్టెంబర్ 1న ఇడుపులపాయకు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1న హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి 2న వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని, వైఎస్సార్ ఘాట్లో తండ్రికి నివాళులర్పించనున్నారు. 2,3 తేదీలలో జిల్లాలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని 4న విజయవాడ తిరుగుపయనం అవుతారని ఆపార్టీ నేతలు తెలియజేశారు.
వైసీపీ MLC పోతుల సునీత బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆమె రాజీనామాతో ఖాళీ అయిన MLC స్థానాన్ని పులివెందులకు చెందిన TDP సీనియర్ నేత బీటెక్ రవికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పులివెందుల పోటీ చేసిన బీటెక్ రవి జగన్పై ఓడిపోయిన విషయం తెలిసిందే.
కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో 3వ విడత అడ్మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు కౌన్సిలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటలకు వారు దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ఐటీఐలలో కౌన్సిలింగ్ జరుగుతుందని ప్రభుత్వ మైనారిటీ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఈ కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్తోపాటు ఫోటో, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.
ఎంఎస్ఎంఈ 1989 యాక్ట్ నిబంధనల మేరకు.. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పటిష్ఠం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ, జిల్లా విపత్తుల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కడపలోని స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల గురువారం జాతీయ క్రీడా దినోత్సవ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ముందస్తుగా బుధవారం విద్యార్థులతో NATIONAL SPORTS DAY, APSWERS B.MATTAM అనే ఆకృతితో కూర్చున్నారని కళాశాల ప్రిన్సిపల్ పద్మనాభ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కడప నగర మేయర్ సురేశ్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రభస చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో నిధులు లేనప్పుడు దానిని నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం ఎర్రగుంట్ల మండలం కలమలకు రానున్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని కలమలలో ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రేపు ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంటకు చేరుకొని, అక్కడి నుంచి రైలులో 11.35కు ఎర్రగుంట్లకు వస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కలమలకు చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.