India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్కు పాల్పడిన నల్లపు అంజీ అనే నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ నరసింహ, ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. అతని వద్ద నుంచి 27 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిట్వేలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చిట్వేలి నుంచి గరుగుపల్లికి వెళ్లే రహదారిలో సాయిబాబా గుడి వద్ద ట్రాక్టర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైలపల్లి హరిజనవాడకు చెందిన కేతరాజుపల్లి చందు కిషోర్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ చిట్వేలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప జిల్లాలో ఇప్పటి వరకు MLAలుగా గెలిచి మంత్రి పదవులు పొందిన వారు చాలామంది ఉన్నారు. ప్రొద్దుటూరు, రాయచోటి MLAల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఎక్కువగా కడప నియోజకవర్గ MLAలకు మంత్రి పదవులు దక్కాయి. కడప నుంచి ఆరుగురికి, జమ్మలమడుగు, పులివెందుల నుంచి ముగ్గురికి, రాజంపేటలో ఇద్దరికి, కోడూరు, బద్వేలు, కమలాపురం, మైదుకూరు నుంచి ఒక్కొక్కరికి పదవులు దక్కాయి. ఈ సారి ఎవరికి వరిస్తుందో కామెంట్ చేయండి.
జూన్ 4న జరగనున్న జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్కు ప్రతి నియోజకవర్గంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కమలాపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో 20 రౌండ్లు, కడపలో 21 రౌండ్లు, పులివెందులలో 22, జమ్మలమడుగులో 23 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. దీంతో కమలాపురం ఫలితం మొదటగా, జమ్మలమడుగు ఫలితం చివరగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.
వీరపునాయునిపల్లె మండలం బసిరెడ్డిపల్లెకు చెందిన హర్షిత చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై వివరాల మేరకు.. హర్షితను పోరుమామిళ్ల మండలం కల్వకుంట్లకు చెందిన క్రాంతి కిరణ్ ప్రేమిస్తున్నానంటూ ఫోన్ చేసి మానసికంగా వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం పురుగుమందు తాగింది. చికిత్స నిమిత్తం కుటుంబీకులు తిరుపతి స్విమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వెంకటరెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఉన్న శ్రీ మలయాళ స్వామి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేటి వరకు వైవీయు నుంచి ఎలాంటి గుర్తింపు లేదని విశ్వవిద్యాలయ కాలేజీ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ ఆచార్య కె. రఘుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కళాశాలలో బీఈడీ ప్రవేశాలు పొందే విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని ఆయన పేర్కొన్నారు.
అసలే ఎన్నికల వాతావరణం.. ఓట్ల లెక్కింపు అనంతరం అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు కార్డెన్ సెర్చ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులందరూ రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతిభద్రతలకు అఘాతం కలగకుండా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.
బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యువ రైతు అప్పుల బాధ ఎక్కువై గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలకు వెళితే.. ప్రవీణ్ కుమార్ వ్యవసాయంలో అప్పులు కావడంతో తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతణ్ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు ఆవరించాయి.
వల్లూరు మండలం తొల్లగంగనపల్లి సమీపంలో రైలు కింద పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకి మల్లికార్జున (17) రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్లో రిమ్స్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజుల క్రితమే మల్లికార్జున తల్లిదండ్రులు మరణించారు.
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగనన్న విద్యాదీవెన డబ్బులు విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని TNSF కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పూర్తిస్థాయిలో అందలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.
Sorry, no posts matched your criteria.