Y.S.R. Cuddapah

News August 28, 2024

కడప: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య అరెస్టు

image

ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన ఘటనలో.. <<13943581>>భార్యతో సహా ప్రియుడిని అరెస్టు<<>> చేసినట్లు ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. లింగంపల్లె గ్రామానికి చెందిన గంగయ్య, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. గంగయ్య వాటర్ పంప్ వద్ద పనిచేస్తున్నారు. అయితే సంధ్యకు ఇదే గ్రామానికి చెందిన బలరాముడికి వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలుసుకున్న భర్త గంగయ్య మందలించారు. దీంతో ప్రియుడితో కలిసి ఆమె భర్తను హతమార్చింది.

News August 28, 2024

కడప మేయర్ ఇంటిపై చెత్త.. ఇరువర్గాలపై కేసు నమోదు

image

కడప నగర మేయర్ కె సురేశ్ బాబు ఇంటి వద్ద మంగళవారం ఆందోళన చేయడంతోపాటు, కొందరు చెత్తను ఇంటిలోకి విసిరేశారని బాధ్యులైన వారిపై మేయర్ ఫిర్యాదు చేయగా.. TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, ఇంకా 14 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే కడప నగర మేయర్ కె సురేశ్ బాబు, తమ సహచరులు చిన్నచౌక్ పోలీసు స్టేషన్ వద్ద న్యాయంకోసం బైఠాయించారు. తరువాత పోలీసులు మేయర్‌తోపాటు, మరో 14మందిపై కేసు నమోదు చేశారు.

News August 28, 2024

పెన్షన్ దారులకు కొండంత భరోసా: కడప కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను 1వ తేదీనే 100 శాతం అందించేలా చర్యలు తీసుకోవాలని, కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. వితంతువులు, వృద్ధులు, కిడ్నీ బాధితులు పెన్షన్ అందుకునే ప్రతి లబ్ధిదారునికి, ఒకటవ తేదీన అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.

News August 27, 2024

కడప జిల్లాలో సులభతరంగా ఇసుక సరఫరా.!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ అదితి సింగ్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.

News August 27, 2024

కడప జిల్లాలో చట్టబద్ధంగా ఇసుక సరఫరా.!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ అదితి సింగ్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.

News August 27, 2024

తెలుగు భాషా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 29న కలమల్లలో తెలుగు భాషా దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఈ వేడుకలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి తెలుగు శాసనాలు అభ్యమైన కలమల్ల గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించున్న, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఎలాంటి కొరత లేకుండా జయప్రదం చేయాలన్నారు.

News August 27, 2024

రాజంపేట: తేలుకాటుకు పది సంవత్సరాల విద్యార్థి మృతి

image

రాజంపేట మండలం తొగురుపేటకు చెందిన పత్తూరు హేమంత్ అనే పది సంవత్సరాల విద్యార్థి తేలుకాటుతో మృతి చెందారు. రాజంపేట మన్నూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి తన ఇంటిలో తేలు కుట్టడంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారు కడప రిమ్స్‌కు రెఫర్ చేశారు. రిమ్స్‌లో వైద్యం తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.

News August 27, 2024

ఒక న్యూస్ చదివాను.. చాలా బాధేసింది: వాసు

image

ఒక న్యూస్ చదివాను, చాలా బాధేసింది అంటూ TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) ‘X’లో పోస్ట్ చేశారు. ‘తునిలో గంజాయి మత్తులో ఒక యువకుడు రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. అయ్యా జగన్ నువ్వు ఏదో ఉద్ధరిస్తావని నీకు సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే, నువ్వు రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచినావు.’ అని పేర్కొన్నారు. కడప ప్రజలకు గంజాయి మహమ్మారి నుంచి విముక్తి కలిగేలా ఆయన కృషి చేస్తారనన్నారు.

News August 26, 2024

కడప: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

image

కడప జిల్లాలో ఇవాళ రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దువ్వూరు మండలం చింతకుంట సమీపంలో కారు బోల్తా పడగా.. గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ రెండు ఘటనలో చనిపోయిన వారి పేర్లు..
* నాగలక్ష్మి(70)
* భగత్ సింగ్(35)
* కియాన్ సింగ్(9 నెలలు)
* గుజ్జుగారి నాగయ్య(46)
* వల్లేపు చిన్న వెంకటమ్మ (50)
* వల్లెపు నాగలక్ష్మి దేవి (35)
* ఖాడమియ్య గారి షరీఫ్ (38)
* లారీ డ్రైవర్ పేరు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

దువ్వూరు: చికిత్స పొందుతూ చిన్నారి మృతి

image

దువ్వూరు మండలం చింతకుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు కొత్తపేటకు చెందిన భగత్ సింగ్ తన కూతురు కియాన్ సింగ్ పుట్టు వెంట్రుకలకు తిరుమలకు కారులో 9 మంది బయలుదేరారు. చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటంతో గాయపడ్డారు. మైదుకూరు ఆసుపత్రిలో నాగలక్ష్మి(70), భగత్ సింగ్(35), ప్రొద్దుటూరు ఆస్పత్రిలో కియాన్ సింగ్(9 నెలలు) చికిత్స పొందుతూ చనిపోయారు.