Y.S.R. Cuddapah

News August 26, 2024

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి

image

గువ్వలచెరువులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణ కొరకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. వాహనదారులు రోడ్ల పైన ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సూచించారు.

News August 26, 2024

కడప జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

image

దువ్వూరు మండలం చింతకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి తిరుపతికి వెళుతున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి (55), భగత్ సింగ్ (48) ఇద్దరు మృతి చెందారు. అలాగే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రొద్దుటూరుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

News August 26, 2024

పెండ్లిమర్రి: యువకునికి దేహశుద్ధి మహిళ బంధువులు

image

పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెకు చెందిన ప్రసాద్ రెడ్డికి సోమవారం మధ్యాహ్నం మహిళా బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రసాద్ రెడ్డి గత కొంతకాలంగా ఓ వివాహితకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తుండేవారు. దీంతో ఆమె బంధువులు ప్రసాద్ రెడ్డికి దేహ శుద్ధి చేశారు. అనంతరం ప్రసాద్ రెడ్డిని పోలీసులకు అప్పగించారు.

News August 26, 2024

కడప: ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య

image

ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హతమార్చిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధవటం మండలం లింగంపల్లికి చెందిన గంగయ్య సంధ్యకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గంగయ్య లింగంపల్లి వాటర్ పంప్ వద్ద ఉద్యోగం చేస్తుంటారు. అయితే డ్యూటీ నుంచి ఇంటికి రాగా.. భార్య ప్రియుడితో ఉండటం చూసి ఆమెను మందలించాడు. కక్ష్య పెంచుకున్న భార్య ప్రియుడితో కలిసి గంగయ్యను హతమార్చి ఘాట్ రోడ్‌లో పడేశారు.

News August 26, 2024

కడప: ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య

image

ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హతమార్చిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధవటం మండలం లింగంపల్లికి చెందిన గంగయ్య సంధ్యకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గంగయ్య లింగంపల్లి వాటర్ పంప్ వద్ద ఉద్యోగం చేస్తుంటారు. అయితే డ్యూటీ నుంచి ఇంటికి రాగా.. భార్య ప్రియుడితో ఉండటం చూసి ఆమెను మందలించాడు. కక్ష్య పెంచుకున్న భార్య ప్రియుడితో కలిసి గంగయ్యను హతమార్చి ఘాట్ రోడ్‌లో పడేశారు.

News August 26, 2024

చెన్నూరు: గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

image

కడప జిల్లా చెన్నూరు మండల పరిధిలోని బచ్చుంపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో, వల్లూరు మండలానికి చెందిన బద్వేల్ నజీర్ అనే వ్యక్తి మృతి చెందినట్లు సీఐ పురుషోత్తం రాజు తెలిపారు. సొంత పనుల నిమిత్తం చెన్నూరు వెళ్లిన ఇతడు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఇతడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

News August 26, 2024

శ్రీనివాసుల రెడ్డిని కలిసిన గండిక్షేత్రం మాజీ ఛైర్మన్

image

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డిని గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పాలకమండలి మాజీ ఛైర్మన్ కల్లూరు వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గండిక్షేత్రంలో జరిగే స్వామివారి శ్రావణమాసం ఉత్సవాల పత్రికను, తీర్థ ప్రసాదాలు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు ఈశ్వరయ్య, ఎల్బీఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2024

ఎర్రగుంట్లలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో నివాసముండే విద్యార్థిని చందు(14) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఎర్రగుంట్లకు చెందిన కులాయప్ప కూతురు 2రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ టాబ్లెట్ వేసుకుంది. అయినా నొప్పి తగ్గకపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 25, 2024

ఎర్రగుంట్లలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో నివాసముండే విద్యార్థిని చందు(14) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఎర్రగుంట్లకు చెందిన కులాయప్ప కూతురు 2రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ టాబ్లెట్ వేసుకుంది. అయినా నొప్పి తగ్గకపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 25, 2024

సంబేపల్లె: ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి రిసెప్షన్

image

సంబేపల్లె మండలం దుద్యాల గ్రామం పెద్దకోడివాండ్ల పల్లెలో ఆదివారం సినీ హీరో అబ్బవరం కిరణ్, హీరోయిన్ రహస్య గోరక్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొని వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.