Y.S.R. Cuddapah

News May 19, 2024

కడప: శతాధిక వృద్ధురాలు శంఖుపల్లి చెన్నమ్మ (102) మృతి

image

కమలాపురానికి చెందిన శతాధిక వృద్ధురాలు శంఖుపల్లి చెన్నమ్మ (102) ఆదివారం మృతి చెందారు. కమలాపురంలో కుమార్తె చిట్టెం లక్షుమ్మ వద్ద చెన్నమ్మ ఉంటున్నారు. శతాధిక వృద్ధురాలు అయినప్పటికీ సాధారణంగా స్వయంగా రోజువారీ దినచర్యను తానే స్వతహాగా చేసుకొనేది అని కుటుంబీకులు తెలిపారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో అనారోగ్యానికి గురై కడప రిమ్స్ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు.

News May 19, 2024

కడప: ఓవర్ టేక్ చేయబోయి వ్యక్తి మృతి

image

రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి దగ్గర ముందు పోతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చెయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మైసూరు వారి పల్లి హరిజనవాడకు చెందిన చలమల నరసింహులు ఆదెమ్మల కుమారుడు పెంచలయ్య (30)గా పోలీసులు గుర్తించారు. ఉప్పరపల్లి హరిజనవాడలో ఉన్న అక్క దగ్గరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 19, 2024

రాజుపాలెం: ట్రాక్టర్ పైనుంచి పడి ఉపాధి కూలి మృతి

image

రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఉపాధి కూలి వేంపల్లి సుబ్బరాయుడు (60) ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. శనివారం ఉపాధి హామీ పథకం పనుల కోసం ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తుండగా ట్రాలీ డోర్ కున్న సపోర్టు కడ్డీ విరగడంతో సుబ్బరాయుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏపీడీ ఆనందం, ఏపీఓ లక్ష్మీనారాయణ సుబ్బరాయుడు మృతదేహానికి నివాళి అర్పించారు.

News May 19, 2024

రైల్వేకోడూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

రైల్వేకోడూరు మండలం కుక్కల దొడ్డి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముని గణేశ్ రెడ్డి (24) అనే యువకుడు చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బైకుపై ముని గణేశ్ రెడ్డి రైల్వేకోడూరులో జాతరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈరోజు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి, తొక్కించుకొని వెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News May 19, 2024

బి.మఠం: భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

image

బ్రహ్మంగారిమఠంలో ఘోర ప్రమాదం జరగగా, ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఇంద్ర బాబు తన సతీమణి విజయలక్ష్మితో కలిసి బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలను చూడడానికి శుక్రవారం మఠం వచ్చారు. రాత్రి ఓ అన్నదాన సత్రం వద్ద పడుకుని ఉండగా హైదరాబాద్ కు చెందిన కారు డ్రైవర్ కారు ఆన్ లో ఉంచి కిందకు దిగాడు. కారులో ఉన్న బాలుడు గేర్ వేయడంతో కారు ఇంద్ర బాబుపైకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు.

News May 19, 2024

కడప: రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం

image

కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని RPS నగర్లో నివాసం ఉంటున్న శేషం వెంకటేశ్వర్లు కుమారుడు ఈశ్వర ప్రసాద్, సోదరుడితో కలిసి శుక్రవారం మోటార్ సైకిల్ పై ఎర్రముక్కపల్లి కు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో పీఎఫ్ కార్యాలయం వద్ద మరో మోటార్ సైకిల్ ను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. దీంతో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా ఈశ్వర ప్రసాద్(12) మృతి చెందారు.

News May 18, 2024

కడప: ఓట్ల లెక్కింపు దృష్ట్యా 144 సెక్షన్ అమలు

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎం మిషన్లు భద్రపరిచామన్నారు.

News May 18, 2024

కౌంటింగ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు: కడప ఎస్పీ

image

జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఇవాళ కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ కౌంటింగ్‌లో క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ, ఎవరు, ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు. జూన్ 1 నుంచి 6 వరకూ ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు.

News May 18, 2024

కడప, జమ్మలమడుగుపై ప్రత్యేక నిఘా

image

కడప జిల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ జిల్లా పోలీసులను అప్రమత్తం చేసింది. దీనిలో భాగంగానే సుధీర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేశ్ రెడ్డి ఊర్లో ఉండొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో వారు బయటి ప్రాంతాలకు వెళ్లారు. అటు కడపలో కూడా జరిగిన గొడవపై అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మాధవిరెడ్డి, వాసు హైదరాబాద్ వెళ్లారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

News May 18, 2024

ఎర్రగుంట్ల: ఆర్టీపీపీ కార్మికుడి ఆత్మహత్య

image

ఎర్రగుంట్లలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్టీపీపీ కాంట్రాక్ట్ కార్మికుడు వల్లెపురెడ్డి సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సుదర్శన్ రెడ్డి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.