Y.S.R. Cuddapah

News May 18, 2024

రాయచోటి: అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి

image

చిన్నమండెం మం, గుట్టుమోటు సమీప అడవిలో హిజ్రా(26) (గణేశ్ అలియాస్ అశ్వని అలియాస్ జానకి) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఆమె కొంతకాలంగా రాయచోటిలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పెద్దమండెంకి చెందిన గురును నాలుగు నెలల కిందట వివాహం చేసుకుంది. గురు ఇంకో పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన జానకి మార్చి 21న ఇంటి నుంచి వెళ్లిపోగా, శుక్రవారం శవమై స్థానికులకు కనిపించింది.

News May 18, 2024

ప్రొద్దుటూరు: సింహ వాహనంపై అగస్త్యేశ్వర స్వామి

image

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 200 మంది భక్తులు సామూహికంగా ఐదుసార్లు లలితా సహస్రనామం పఠించారు. రాత్రి గంగా రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సింహ వాహనంపై ఆశీనులను చేసి ఘనంగా ఊరేగించారు.

News May 17, 2024

ప్రశాంత వాతావరణం కోసమే బయటి ప్రాంతాలకు ఆది, భూపేశ్

image

జమ్మలమడుగులో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు భూపేశ్ రెడ్డి, ఆది నారాయణరెడ్డి దేవగుడి వదిలి బయటి ప్రాంతాలకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. పోలింగ్ రోజు రాత్రి జమ్మలమడుగులో జరిగిన అల్లర్ల గురించి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు భూపేశ్, ఆది గ్రామం వదిలి వెళ్లారు.

News May 17, 2024

ప్రొద్దుటూరు: రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

ప్రొద్దుటూరులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పెన్నానది రైల్వే బ్రిడ్జి మార్గంలో విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని గుర్తు పట్టిన వారు యర్రగుంట్ల రైల్వే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 17, 2024

కడప: ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రవేశాల కన్వీనర్ ఎం.జ్ఞానకుమార్ తెలిపారు. జిల్లాలో 10 ప్రభుత్వ, 22 ప్రైవేట్ ఐటీఐలలో 3934 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 17, 2024

రైల్వే కోడూరు విద్యార్థినికి రూ.1.42 కోట్ల జీతం

image

రైల్వే కోడూరుకు చెందిన నికిత ఏడాదికి రూ.1.42 కోట్ల జీతంతో అమెరికాలో ఉద్యోగం సాధించారు. రైల్వే కోడూరులోని మాచినేని విశ్వేశ్వర నాయుడు, షర్మిల దంపతుల కుమార్తె నికిత అమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. ఆమెకు న్యూజెర్సీలోని న్యూబిస్ కమ్యూనికేషన్స్ సంస్థలో సంవత్సరానికి రూ.1.42 కోట్ల జీతంతో ఉద్యోగం లభించింది.

News May 17, 2024

కడప: అక్కడ గెలిస్తే మంత్రి పదవి?

image

జిల్లాలోని కడప అసెంబ్లీ నియోజకవర్గంలో MLAగా గెలిచిన వారు ఇప్పటివరకు ఎక్కువగా మంత్రి పదవులు పొందారు. ఇక్కడి నుంచి 1952లో గెలిచిన కడప కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్.రామమునిరెడ్డి హెల్త్ మినిస్టర్‌గా, సి. రామచంద్రయ్య 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా, ఖలీల్‌బాషా, అహ్మదుల్లా, అంజాద్ బాషా సైతం మంత్రులుగా పనిచేశారు.

News May 17, 2024

YCP నేత ఇంటిపై దాడి.. నిందితులు పట్టివేత: ఎస్పీ

image

ఈ నెల 15వ తేదీ రాత్రి రాయచోటి టౌన్, గాలివీధి మెయిన్ రోడ్, లక్ష్మీపురంలో ఉండే YCP నేత వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.కృష్ణరావు ఉత్తర్వుల మేరకు.. రాయచోటి అర్బన్ పోలిస్ స్టేషన్ సీఐ యం. సుధాకర రెడ్డి దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

News May 17, 2024

కడప: భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చిమిరపకాయల ధర ఒక్కసారిగా 70 రూపాయలకు చేరింది. అల్లం ధర రూ.170 పలుకుతోంది. బీన్స్ కిలో రూ.75 పలుకుతోంది. క్యాప్సికం, కాకర కిలో రూ.60, బీరకాయ, అలసంద కాయలు కిలో రూ.55 పలుకుతున్నాయి. టమోటా, వంకాయలు మాత్రమే కిలో రూ.20 ఉండగా మిగిలిన కూరగాయల ధరలన్నీ భారీగా పెరిగాయి.

News May 17, 2024

కడప: ఐటిఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

లింగాలలోని స్థానిక నందలి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ) నందు 2024-25 సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లింగాల ఐటిఐ ప్రిన్సిపల్ శాంతయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.