India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కడపలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అశోక్ కుమార్ సారథ్యంలో దాదాపు 500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

పులివెందుల ZPTC ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచివెల్లి(3): 33.74 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 166 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లి (14): 26.71 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1,273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 340 ఓట్లు పోలయ్యాయి.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచ్చివెళ్లి(3): 6.71 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 33 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లె(14): 11.47 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 146 ఓట్లు పోలయ్యాయి.

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రేపు జరగనుంది. కడప నగర శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. నిన్న పోలింగ్ ప్రక్రియ ముగియగా.. పులివెందులలోని 2 చోట్ల ఇవాళ రీ పోలింగ్ నిర్వహిస్తున్నారు. పులివెందులలో 76.44, ఒంటిమిట్టలో 84.05 శాతం పోలింగ్ ముగిసేసరికి జరిగింది.

కడప సెంట్రల్ జైలు పూర్వ అధికారులు ప్రకాష్, జవహర్ బాబు, డాక్టర్ పుష్పలతలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ క్యాంపుల పేరుతో ఖైదీలను బెదిరించిన ఘటనలకు బాధ్యులైన వారిపై విచారణ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. కర్నూల్ SP విక్రాంత్ పాటిల్, కడప DMHO డాక్టర్ నాగరాజు, జైళ్లశాఖ అధికారి ఇర్ఫాన్, RDO ఇర్విన్ విచారణాధికారులుగా వ్యవహరించనున్నారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. పులివెందులలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానం చేసి సీసీ కెమెరాల ఫుటేజీని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. తుమ్మలపల్లి, నల్లపురెడ్డిపల్లి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట ప్రాంతాల పోలింగ్ సరళిని ఇక్కడినే వీక్షించి పోలీసులకు పలు సూచనలు చేశారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులలో 71.36శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 7,565 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 66.39శాతం ఓటింగ్ జరగ్గా.. 24, 606 ఓట్లకు 16,336 ఓట్లు పోలయ్యాయి. 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పులివెందులలో 62.26 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 10,601 ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 6,600 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో 55.06 శాతం మంది ఓటు వేశారు. 24, 606 ఓట్లకు గాను ఇప్పటి వరకు 13, 549 ఓట్లు పోలయ్యాయి.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీధర్ ప్రజలను కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోయే పోలింగ్లో ప్రతి ఒక్క ఓటరూ ముందుకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులను సంప్రదించాలన్నారు.

వినాయక ఉత్సవాల నేపథ్యంలో మట్టి విగ్రహాలను పూజించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప కార్పొరేషన్ కార్యాలయంలో CPM కార్మిక అనుబంధ సంఘాల నేతలు మట్టి వినాయక విగ్రహాల గోడ పత్రాలను రూపొందించగా వాటిని కమీషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. కార్మికులు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకురావడం అభినందనీయమన్నారు.
Sorry, no posts matched your criteria.