Y.S.R. Cuddapah

News August 22, 2024

కలసపాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

కలసపాడు మండలం ఎగువరామాపురం పంచాయితీ తంబళ్లపల్లెకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం పోరుమామిళ్ల మలకత్తువ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన సాయి కుమార్ రెడ్డి, తరుణ్ కుమార్ రెడ్డి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోరుమామిళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2024

ఉద్యోగులంటే చంద్రబాబుకు చిరాకు: శ్రీకాంత్ రెడ్డి

image

ఉద్యోగులంటే చంద్రబాబుకు చిరాకు అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం.. శాడిస్ట్ ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులు గురి చేస్తోందన్నారు. సరిగ్గా 2019కు ముందు ఉద్యోగులనుద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకష్ణ, చంద్రబాబు మధ్య జరిగిన వీడియో సంభాషణ ఎన్ని తరాలైనా మరిచిపోలేమని తెలిపారు.

News August 22, 2024

కడప: నూతన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను పరిశీలించిన ఎస్పీ

image

కడప జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఏ.ఆర్ డీఎస్పీ మురళీధర్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ.ఈ కె.రోశయ్య, డీఈ బి.మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

News August 21, 2024

కడప ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్

image

కడపలో విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి చెందడంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస విద్యుత్ ప్రమాదాలపై సీఎండీలతో మంత్రి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. కడప ఘటనపై పూర్తి సమాచారాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

News August 21, 2024

పోరుమామిళ్ల: కారు, స్కూటర్ ఢీ.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

పోరుమామిళ్ల మల్ల కత్తువ సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్ ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుల స్వగ్రామం కలసపాడు మండలం తంబళ్లపల్లె గ్రామంగా స్థానికులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారిలో సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు.

News August 21, 2024

ఉక్కు ప్రవీణ్‌కు కీలక పదవి?

image

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ఉక్కు ప్రవీణ్‌కు నామినేటెడ్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రవీణ్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి కారణాన్ని వివరిస్తూ.. ప్రభుత్వం వచ్చిన అనంతరం తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కు నెడ్ క్యాప్ ఛైర్మన్‌ పదవి వరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.

News August 21, 2024

కడప జడ్పీ ఛైర్మన్‌గా రామ గోవింద్ రెడ్డి

image

కడప జడ్పీ ఛైర్మన్‌గా ముత్యాల రామ గోవింద్ రెడ్డి పేరును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ రామ గోవింద్ రెడ్డి పేరును బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జడ్పీటీసీల సమావేశంలో వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.

News August 21, 2024

వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్

image

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో A6గా ఉన్న ఉదయ్ కుమార్‌కి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇస్తూ, ప్రతి ఆదివారం పులివెందుల పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. వివేకా హత్య కేసులో గత రెండున్నర సంవత్సరాల నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.

News August 21, 2024

ప్రొద్దుటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

image

తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశారంటూ ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన మహబూబ్ బాషా మంగళవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ వలికి ఏపీఎస్పీడీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన భానుప్రతాప్ రెడ్డి రెండేళ్ల క్రితం ఫోన్ పే ద్వారా పలుమార్లు రూ.2.47లక్షలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు వెనక్కి ఇవ్వాలన్నా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 21, 2024

కడప: నూతన ఓటు హక్కు చేర్చుకునే అవకాశం

image

కడప జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, కొత్తగా ఓటు హక్కును చేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. 1.1.25 నాటికి 18 ఏళ్లు నిండబోయే వారు ఓటర్ లిస్ట్ నందు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని సూచించారు. అలానే ఓటు కార్డు నందు సవరణలు ఏవైనా ఉన్నయెడల సవరించుకోవచ్చని స్థానిక ఎమ్మార్వో, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద నమోదు చేసుకోవాలన్నారు.